Political News

‘వివేకా హత్య’ ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతి

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య జరిగి అప్పుడే ఆరేళ్లు కావస్తోంది. ఈ నెల 15వ తేదీకి వివేకా హత్యకు ఆరేళ్లు నిండనున్నాయి. ఇలాంటి క్రమంలో ఈ కేసు దర్యాప్తు పెద్దగా ముందుకు సాగలేదు గానీ… ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న రంగన్న బుధవారం చనిపోయాడు. వివేకా ఇంటి వద్ద రంగన్న వాచ్ మన్ గా పనిచేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం 85 ఏళ్ల వయసున్న రంగన్న…నాడు వివేకా మరణించినప్పుడు అక్కడే ఉన్నారు. ఇంటి ప్రధాన గేటు వద్దే ఆయన నిద్రించారు. వివేకా ఇంటి వద్ద చాలాకాలంగా పనిచేస్తున్న నేపథ్యంలో వివేకా దైనందిన జీవనం గురించి ఆయనకు సంపూర్ణ అవగాహన ఉందని చెప్పాలి. వివేకా హత్య జరిగిన సమయంలో రంగన్న అక్కడే ఉన్న నేపథ్యంలో ఈ కేసును విచారించిన పోలీసులు, సీబీఐ అదికారులు కూడా రంగన్న వాంగ్మూలాన్ని సేకరించారు. రంగన్న స్టేట్ మెంట్ ఈ కేసులో కీలకంగా పరిగణిస్తున్నారు. వయసురీత్యా అనారోగ్యంతో సతమతం అవుతున్న రంగన్న… బుధవారం తీవ్ర అస్వస్థతకు గురి కాగా…ఆయనను కడప రిమ్స్ కు తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

టీడీపీ అధికారంలో ఉండగా…2019 ఎన్నికలకు ఒక నెలముందు అదే ఏడాది మార్చి 15న వివేకా హత్యకు గురయ్యారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ నాడు విపక్ష నేతగా ఉన్న జగన్ ఏకంగా హైకోర్టునే ఆశ్రయించారు. ఆ క్రమంలో ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లినా… ఎందుకనో గానీ వేగంగా దర్యాప్తు ముందుకు సాగలేదు. ఈ హత్య జరిగిన నెలల వ్యవధిలోనే జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయినా కూడా ఈ కేసు దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఇలాంటి క్రమంలో రంగన్న మృతి ఈ కేసు దర్యాప్తును మరింతగా ప్రభావం చూపనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on March 6, 2025 6:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

24 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago