ఎస్ ఇది నిజం తెలంగాణ ముఖ్యమంత్రి ఒక కాంగ్రెస్ నేతకు ఎమ్మెల్సీ ఇవ్వడం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇగోను హర్ట్ చేసేలా ఉందన్న చర్చలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచే వేం నరేందర్రెడ్డి ఇంకా చెప్పాలంటే రేవంత్ తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచే రేవంత్కు ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు.
వేం నరేందర్రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్టు అవ్వడం వెనక ఓ చిన్న లింక్ ఉంది. దీనికో హిస్టరీ కూడా ఉంది. రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేవంత్రెడ్డిని ఓటుకు నోటు కేసులో బుక్ చేసేందుకు స్టిఫెన్సన్ను ప్రయోగించారన్న ప్రచారం ఉంది. ఈ ట్రాప్ వెనక ఎవరి హస్తం ఉందన్న దానిపై రకరకాల వాదనలు ఉన్నాయి. అయితే వేం నరేందర్రెడ్డిని ఎమ్మెల్సీని చేసేందుకే రేవంత్ అక్కడకు ఓటు అడిగేందుకు వెళ్లాడు.
అప్పట్లో తెలుగుదేశం నుంచి వేం నరేందర్రెడ్డి ఎమ్మెల్సీగా బరిలో ఉన్నారు. ఆ రోజు ఆయన గెలిచేందుకు సరిపడా బలం తెలుగుదేశంకు ఉంది. కానీ బీఆర్ఎస్ కొంత మందిని ఆకర్షించింది. దీంతో నరేందర్రెడ్డి గెలుపు కష్టం అయ్యింది. అందుకే ముత్తయ్య అనే ఫాస్టర్ ద్వారా స్టీఫెన్సన్తో టీడీపీ వర్గాలు ఓటు కోసం ఏవేవో వ్యవహారం నడిపించారు. ఆయనతో రేవంత్ మాట్లాడేందుకు వెళ్లిన సమయంలో ట్రాప్ చేశారని రేవంత్ క్యాంపు ఆరోపిస్తోంది.
అప్పుడు వేం నరేందర్రెడ్డి ఎమ్మెల్సీగాను ఓడిపోయారు. కేసుల పాలయ్యారు. ఇప్పుడు అదే నేతను బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల సపోర్టుతోనే ఎమ్మెల్సీగా గెలిపించే ప్రయత్నంలో రేవంత్ ఉన్నారట. ఇది ఇప్పుడు కేసీఆర్ ఇగోను హర్ట్ చేసేలా ఉందంటూ రేవంత్ క్యాంప్ మామూలుగా హైలెట్ చేయడం లేదు.
This post was last modified on February 28, 2025 1:49 pm
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…