Political News

చంద్రబాబు తెగువకు హ్యాట్సాఫ్ చెప్పిన పవన్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగానే పోడియం దగ్గరకు దూసుకు వచ్చిన వైసీపీ సభ్యులు ఆయనపై కాగితాలు విసిరేసి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ అనే గౌరవం లేకుండా వైసీపీ సభ్యులు చేసిన పనిపై టీడీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలోని తాజాగా ఆ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో స్పందించారు.

గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ నేతల ప్రవర్తనను పవన్ ఖండించారు. గొడవలకు, బూతులకు వైసీపీ నేతలు పర్యాయపదంగా మారిపోయారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి నేతలను ఇన్ని సంవత్సరాల పాటు చంద్రబాబు ఎలా తట్టుకుని నిలబడగలిగారు అని పవన్ అనుమానం వ్యక్తం చేశారు. నిన్నటి ఘటన తర్వాత తనకు ఇలా అనిపించిందని, ఈ నేతలను ఇన్నాళ్లు ఎదుర్కొన్న చంద్రబాబుకు హ్యాట్సాఫ్ అంటూ పవన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

ఈ తరహా నేతలను ఎదుర్కోవాలంటే ఎంతో ధైర్యం, తెగువ ఉండాలని పవన్ అన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న సందర్భంలో ఆయన కళ్ళల్లోకి చూసే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా అని పవన్ ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ తన ప్రసంగాన్ని గవర్నర్ విజయవంతంగా పూర్తి చేశారని ప్రశంసించారు. తమ తప్పు లేకపోయినప్పటికీ వైసీపీ నేతల తీరుకుగానూ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు తామంతా క్షమాపణలు చెబుతున్నామని పవన్ అన్నారు. చట్టాలు చేయాల్సిన వైసీపీ శాసనసభ్యులు వాటిని ఉల్లంఘిస్తే ఎలా అని పవన్ నిలదీశారు.

నిన్న సభలో వైసీపీ సభ్యుల గొడవ చూసి వైసీపీ నేతల ఐదేళ్ల విధ్వంసకర పాలన గుర్తొచ్చిందని పవన్ చెప్పారు. ప్రజావేదిక కూల్చివేత, ఆలయాల కూల్చివేత, డాక్టర్ సుధాకర్ చనిపోయిన విధానం, కల్తీ సారా మరణాలు, సుప్రీంకోర్టు జడ్జిలపై లేఖ రాయడం, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో విమర్శలు చేయడం, పత్రికాధిపతులపై దాడులు, చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టడం, తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన వైనం గుర్తొచ్చాయన్నారు.

అసెంబ్లీలో ఈ స్థాయిలో వారు ప్రవర్తిస్తే బయట కూడా ఇంతకన్నా ఎక్కువ గొడవలు సృష్టించి ఉంటారని పవన్ అభిప్రాయపడ్డారు. అందుకే, ప్రజలు వారు వద్దు అని అత్యధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారని పవన్ అన్నారు.

This post was last modified on February 25, 2025 4:48 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

28 minutes ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

58 minutes ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

2 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

3 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

5 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

6 hours ago