Political News

చంద్రబాబు తెగువకు హ్యాట్సాఫ్ చెప్పిన పవన్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగానే పోడియం దగ్గరకు దూసుకు వచ్చిన వైసీపీ సభ్యులు ఆయనపై కాగితాలు విసిరేసి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ అనే గౌరవం లేకుండా వైసీపీ సభ్యులు చేసిన పనిపై టీడీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలోని తాజాగా ఆ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో స్పందించారు.

గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ నేతల ప్రవర్తనను పవన్ ఖండించారు. గొడవలకు, బూతులకు వైసీపీ నేతలు పర్యాయపదంగా మారిపోయారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి నేతలను ఇన్ని సంవత్సరాల పాటు చంద్రబాబు ఎలా తట్టుకుని నిలబడగలిగారు అని పవన్ అనుమానం వ్యక్తం చేశారు. నిన్నటి ఘటన తర్వాత తనకు ఇలా అనిపించిందని, ఈ నేతలను ఇన్నాళ్లు ఎదుర్కొన్న చంద్రబాబుకు హ్యాట్సాఫ్ అంటూ పవన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

ఈ తరహా నేతలను ఎదుర్కోవాలంటే ఎంతో ధైర్యం, తెగువ ఉండాలని పవన్ అన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న సందర్భంలో ఆయన కళ్ళల్లోకి చూసే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా అని పవన్ ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ తన ప్రసంగాన్ని గవర్నర్ విజయవంతంగా పూర్తి చేశారని ప్రశంసించారు. తమ తప్పు లేకపోయినప్పటికీ వైసీపీ నేతల తీరుకుగానూ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు తామంతా క్షమాపణలు చెబుతున్నామని పవన్ అన్నారు. చట్టాలు చేయాల్సిన వైసీపీ శాసనసభ్యులు వాటిని ఉల్లంఘిస్తే ఎలా అని పవన్ నిలదీశారు.

నిన్న సభలో వైసీపీ సభ్యుల గొడవ చూసి వైసీపీ నేతల ఐదేళ్ల విధ్వంసకర పాలన గుర్తొచ్చిందని పవన్ చెప్పారు. ప్రజావేదిక కూల్చివేత, ఆలయాల కూల్చివేత, డాక్టర్ సుధాకర్ చనిపోయిన విధానం, కల్తీ సారా మరణాలు, సుప్రీంకోర్టు జడ్జిలపై లేఖ రాయడం, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో విమర్శలు చేయడం, పత్రికాధిపతులపై దాడులు, చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టడం, తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన వైనం గుర్తొచ్చాయన్నారు.

అసెంబ్లీలో ఈ స్థాయిలో వారు ప్రవర్తిస్తే బయట కూడా ఇంతకన్నా ఎక్కువ గొడవలు సృష్టించి ఉంటారని పవన్ అభిప్రాయపడ్డారు. అందుకే, ప్రజలు వారు వద్దు అని అత్యధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారని పవన్ అన్నారు.

This post was last modified on February 25, 2025 4:48 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago