Political News

“క‌డుపు రిగిలింది అధ్య‌క్షా.. జ‌గ‌న్ వ‌స్తే.. ఇచ్చిప‌డేసేవాణ్ణి!”

“క‌డుపు రిగిలింది అధ్య‌క్షా.. జ‌గ‌న్ వ‌స్తే.. ఇచ్చిప‌డేసేవాణ్ణి!” – అని బీజేపీ శాస‌న స‌భా ప‌క్ష నేత‌, సీనియ‌ర్ నాయ‌కుడు విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్య‌లు అసెంబ్లీలో ఆస‌క్తిగా మారాయి. తాజాగా మంగ‌ళ‌వారం.. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు చ‌ర్చ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. “స‌భ‌లో జ‌గ‌న్ లేని లోటు క‌నిపిస్తోంద‌ని.. అంద‌రూ అంటున్నారు అధ్య‌క్షా” అని వ్యాఖ్యానించారు.

దీంతో స‌భ‌లో ఉన్న‌వారు అంద‌రూ ఫ‌క్కున న‌వ్వారు. అలా తాము అన‌లేద‌ని.. జ‌గ‌న్ వ‌చ్చి ఉంటే బాగుం డేద‌ని మాత్ర‌మే అన్నామ‌ని.. టీడీపీ స‌భ్యులు ఒక‌రిద్ద‌రు పేర్కొన్నారు. అనంత‌రం విష్ణు త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ.. “జ‌గ‌న్ స‌భ‌కు వ‌స్తాడేమోన‌ని.. నేను కూడా ఆస‌క్తిగానే ఎద‌రు చూస్తున్నా. కానీ, ఆయ‌న రాలేదు. పోనీ.. ఆయ‌న స‌భ్యుల‌నైనా పంపించొచ్చుక‌దా!” అని వ్యాఖ్యానించారు. ఈ స‌మ‌యంలో స్పీక‌ర్ జోక్యం చేసుకుని.. “అది వారి ఇష్టం” అన్నారు.

ఇక‌, విష్ణు త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ.. “గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభలో వైసీపీ సభ్యుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్య‌క్త‌మైంది. జ‌నాలు కూడా ఆగ్ర‌హంతోనే ఉన్నారు. నాకు వ్య‌క్తిగ‌తంగా అయితే.. కడుపు మండిపోది. ఇవాళ జ‌గ‌న్ కానీ, ఆయ‌న స‌భ్యులు కానీ సభకు వస్తారేమో.. కడుపుమంట తీర్చుకుందామను కున్నా. ఇవాళ సభకు రాలేదు. కానీ, రావాలి అధ్య‌క్షా. వాళ్ల‌ను ర‌ప్పించేందుకు మీరుబాధ్య‌త తీసుకోవాలి” అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. సభలో సోమవారం జరిగిన ఘటన దురదృష్టకరమన్న విష్ణుకుమార్ రాజు.. జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అని తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నార‌ని తెలిపారు. జగన్‌పట్ల కూటమి ప్రభుత్వం వైఖరి ఎలా ఉంటుందోనని తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నార‌ని చెప్పారు. వైసీపీ నాయకులే తలదించుకునేలా జగన్ వైఖరి ఉందన్నారు. పెద్ద వయస్కులైన 89 ఏళ్ల ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును పోడియం ముందుకు పంపి నిరసన తెలపమని చెప్పడం జగన్‌కు సిగ్గుగా లేదా? అని విష్ణు తీవ్ర విమ‌ర్శ చేశారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ ఎవరిని వదిలిపెట్టడంలేదన్నారు.

This post was last modified on February 25, 2025 3:19 pm

Share

Recent Posts

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

15 minutes ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

28 minutes ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

39 minutes ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

3 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

4 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

7 hours ago