“కడుపు రిగిలింది అధ్యక్షా.. జగన్ వస్తే.. ఇచ్చిపడేసేవాణ్ణి!” – అని బీజేపీ శాసన సభా పక్ష నేత, సీనియర్ నాయకుడు విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో ఆసక్తిగా మారాయి. తాజాగా మంగళవారం.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. “సభలో జగన్ లేని లోటు కనిపిస్తోందని.. అందరూ అంటున్నారు అధ్యక్షా” అని వ్యాఖ్యానించారు.
దీంతో సభలో ఉన్నవారు అందరూ ఫక్కున నవ్వారు. అలా తాము అనలేదని.. జగన్ వచ్చి ఉంటే బాగుం డేదని మాత్రమే అన్నామని.. టీడీపీ సభ్యులు ఒకరిద్దరు పేర్కొన్నారు. అనంతరం విష్ణు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. “జగన్ సభకు వస్తాడేమోనని.. నేను కూడా ఆసక్తిగానే ఎదరు చూస్తున్నా. కానీ, ఆయన రాలేదు. పోనీ.. ఆయన సభ్యులనైనా పంపించొచ్చుకదా!” అని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో స్పీకర్ జోక్యం చేసుకుని.. “అది వారి ఇష్టం” అన్నారు.
ఇక, విష్ణు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. “గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభలో వైసీపీ సభ్యుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. జనాలు కూడా ఆగ్రహంతోనే ఉన్నారు. నాకు వ్యక్తిగతంగా అయితే.. కడుపు మండిపోది. ఇవాళ జగన్ కానీ, ఆయన సభ్యులు కానీ సభకు వస్తారేమో.. కడుపుమంట తీర్చుకుందామను కున్నా. ఇవాళ సభకు రాలేదు. కానీ, రావాలి అధ్యక్షా. వాళ్లను రప్పించేందుకు మీరుబాధ్యత తీసుకోవాలి” అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. సభలో సోమవారం జరిగిన ఘటన దురదృష్టకరమన్న విష్ణుకుమార్ రాజు.. జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అని తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. జగన్పట్ల కూటమి ప్రభుత్వం వైఖరి ఎలా ఉంటుందోనని తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. వైసీపీ నాయకులే తలదించుకునేలా జగన్ వైఖరి ఉందన్నారు. పెద్ద వయస్కులైన 89 ఏళ్ల ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును పోడియం ముందుకు పంపి నిరసన తెలపమని చెప్పడం జగన్కు సిగ్గుగా లేదా? అని విష్ణు తీవ్ర విమర్శ చేశారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ ఎవరిని వదిలిపెట్టడంలేదన్నారు.
This post was last modified on February 25, 2025 3:19 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…