Political News

“క‌డుపు రిగిలింది అధ్య‌క్షా.. జ‌గ‌న్ వ‌స్తే.. ఇచ్చిప‌డేసేవాణ్ణి!”

“క‌డుపు రిగిలింది అధ్య‌క్షా.. జ‌గ‌న్ వ‌స్తే.. ఇచ్చిప‌డేసేవాణ్ణి!” – అని బీజేపీ శాస‌న స‌భా ప‌క్ష నేత‌, సీనియ‌ర్ నాయ‌కుడు విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్య‌లు అసెంబ్లీలో ఆస‌క్తిగా మారాయి. తాజాగా మంగ‌ళ‌వారం.. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు చ‌ర్చ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. “స‌భ‌లో జ‌గ‌న్ లేని లోటు క‌నిపిస్తోంద‌ని.. అంద‌రూ అంటున్నారు అధ్య‌క్షా” అని వ్యాఖ్యానించారు.

దీంతో స‌భ‌లో ఉన్న‌వారు అంద‌రూ ఫ‌క్కున న‌వ్వారు. అలా తాము అన‌లేద‌ని.. జ‌గ‌న్ వ‌చ్చి ఉంటే బాగుం డేద‌ని మాత్ర‌మే అన్నామ‌ని.. టీడీపీ స‌భ్యులు ఒక‌రిద్ద‌రు పేర్కొన్నారు. అనంత‌రం విష్ణు త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ.. “జ‌గ‌న్ స‌భ‌కు వ‌స్తాడేమోన‌ని.. నేను కూడా ఆస‌క్తిగానే ఎద‌రు చూస్తున్నా. కానీ, ఆయ‌న రాలేదు. పోనీ.. ఆయ‌న స‌భ్యుల‌నైనా పంపించొచ్చుక‌దా!” అని వ్యాఖ్యానించారు. ఈ స‌మ‌యంలో స్పీక‌ర్ జోక్యం చేసుకుని.. “అది వారి ఇష్టం” అన్నారు.

ఇక‌, విష్ణు త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ.. “గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభలో వైసీపీ సభ్యుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్య‌క్త‌మైంది. జ‌నాలు కూడా ఆగ్ర‌హంతోనే ఉన్నారు. నాకు వ్య‌క్తిగ‌తంగా అయితే.. కడుపు మండిపోది. ఇవాళ జ‌గ‌న్ కానీ, ఆయ‌న స‌భ్యులు కానీ సభకు వస్తారేమో.. కడుపుమంట తీర్చుకుందామను కున్నా. ఇవాళ సభకు రాలేదు. కానీ, రావాలి అధ్య‌క్షా. వాళ్ల‌ను ర‌ప్పించేందుకు మీరుబాధ్య‌త తీసుకోవాలి” అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. సభలో సోమవారం జరిగిన ఘటన దురదృష్టకరమన్న విష్ణుకుమార్ రాజు.. జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అని తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నార‌ని తెలిపారు. జగన్‌పట్ల కూటమి ప్రభుత్వం వైఖరి ఎలా ఉంటుందోనని తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నార‌ని చెప్పారు. వైసీపీ నాయకులే తలదించుకునేలా జగన్ వైఖరి ఉందన్నారు. పెద్ద వయస్కులైన 89 ఏళ్ల ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును పోడియం ముందుకు పంపి నిరసన తెలపమని చెప్పడం జగన్‌కు సిగ్గుగా లేదా? అని విష్ణు తీవ్ర విమ‌ర్శ చేశారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ ఎవరిని వదిలిపెట్టడంలేదన్నారు.

Satya

Recent Posts

ఐపీఎల్ 2026 అట్టర్ ఫ్లాప్

ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…

4 minutes ago

ఒక్క థియేట‌ర్ మీద ఇంత గొడ‌వా?

నిజామాబాద్‌లో న‌ట‌రాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడ‌వ టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…

36 minutes ago

జెన్‌-జీ రాజకీయం మొదలుపెట్టిన పవన్

ఏపీ అధికార పార్టీ జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పార్టీలో యువ‌త‌రాన్ని ఆకర్షించేందుకు..…

2 hours ago

పాలన… ప్లానింగ్… బాగున్నాయి లోకేష్

పాల‌న విష‌యంలో మంత్రి లోకేష్ ప‌క్కా ప్లానింగ్‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. రాజ‌కీయాల‌ను విధాన‌ప‌ర‌మైన అంశాల‌ను క‌ల‌గాపుల‌గం…

4 hours ago

ఇక RCB అభిమానులను ఎవరు ఆపలేరు

పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…

6 hours ago

గ్రేటర్ హైద‌రాబాద్ ఎల‌క్ష‌న్స్‌… ప్లాన్ ఏంటి సీఎం సార్?

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే పాల‌క మండ‌లి కూడా ర‌ద్ద‌యింది. ప్ర‌త్యేక అధికారి పాల‌న‌లోకి…

6 hours ago