Political News

“క‌డుపు రిగిలింది అధ్య‌క్షా.. జ‌గ‌న్ వ‌స్తే.. ఇచ్చిప‌డేసేవాణ్ణి!”

“క‌డుపు రిగిలింది అధ్య‌క్షా.. జ‌గ‌న్ వ‌స్తే.. ఇచ్చిప‌డేసేవాణ్ణి!” – అని బీజేపీ శాస‌న స‌భా ప‌క్ష నేత‌, సీనియ‌ర్ నాయ‌కుడు విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్య‌లు అసెంబ్లీలో ఆస‌క్తిగా మారాయి. తాజాగా మంగ‌ళ‌వారం.. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు చ‌ర్చ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. “స‌భ‌లో జ‌గ‌న్ లేని లోటు క‌నిపిస్తోంద‌ని.. అంద‌రూ అంటున్నారు అధ్య‌క్షా” అని వ్యాఖ్యానించారు.

దీంతో స‌భ‌లో ఉన్న‌వారు అంద‌రూ ఫ‌క్కున న‌వ్వారు. అలా తాము అన‌లేద‌ని.. జ‌గ‌న్ వ‌చ్చి ఉంటే బాగుం డేద‌ని మాత్ర‌మే అన్నామ‌ని.. టీడీపీ స‌భ్యులు ఒక‌రిద్ద‌రు పేర్కొన్నారు. అనంత‌రం విష్ణు త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ.. “జ‌గ‌న్ స‌భ‌కు వ‌స్తాడేమోన‌ని.. నేను కూడా ఆస‌క్తిగానే ఎద‌రు చూస్తున్నా. కానీ, ఆయ‌న రాలేదు. పోనీ.. ఆయ‌న స‌భ్యుల‌నైనా పంపించొచ్చుక‌దా!” అని వ్యాఖ్యానించారు. ఈ స‌మ‌యంలో స్పీక‌ర్ జోక్యం చేసుకుని.. “అది వారి ఇష్టం” అన్నారు.

ఇక‌, విష్ణు త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ.. “గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభలో వైసీపీ సభ్యుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్య‌క్త‌మైంది. జ‌నాలు కూడా ఆగ్ర‌హంతోనే ఉన్నారు. నాకు వ్య‌క్తిగ‌తంగా అయితే.. కడుపు మండిపోది. ఇవాళ జ‌గ‌న్ కానీ, ఆయ‌న స‌భ్యులు కానీ సభకు వస్తారేమో.. కడుపుమంట తీర్చుకుందామను కున్నా. ఇవాళ సభకు రాలేదు. కానీ, రావాలి అధ్య‌క్షా. వాళ్ల‌ను ర‌ప్పించేందుకు మీరుబాధ్య‌త తీసుకోవాలి” అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. సభలో సోమవారం జరిగిన ఘటన దురదృష్టకరమన్న విష్ణుకుమార్ రాజు.. జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అని తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నార‌ని తెలిపారు. జగన్‌పట్ల కూటమి ప్రభుత్వం వైఖరి ఎలా ఉంటుందోనని తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నార‌ని చెప్పారు. వైసీపీ నాయకులే తలదించుకునేలా జగన్ వైఖరి ఉందన్నారు. పెద్ద వయస్కులైన 89 ఏళ్ల ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును పోడియం ముందుకు పంపి నిరసన తెలపమని చెప్పడం జగన్‌కు సిగ్గుగా లేదా? అని విష్ణు తీవ్ర విమ‌ర్శ చేశారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ ఎవరిని వదిలిపెట్టడంలేదన్నారు.

This post was last modified on February 25, 2025 3:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

53 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

1 hour ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

3 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago