Political News

‘ఫస్ట్’తోనే గట్టెక్కాలి.. ‘సెకండ్’ మాటే వద్దు

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడేసి స్థానాలకు జరగనున్న ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న పార్టీలన్నీ తమ అభ్యర్థుల విజయం కోసం పక్కా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. తెలంగాణలో రెండు టీచర్, ఓ గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరగనుండగా… ఏపీలో రెండ గ్రాడ్యుయేట్, ఓ టీచర్ స్థానానిక ఎన్నికలు జరుగుతున్నాయి. టీచర్ స్థానాలను పక్కనపెడితే… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకునేందుకు రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తెలంగాణలో ఒకింత టఫ్ ఫైట్ నడుస్తున్నా… ఏపీలో విపక్షం బరిలో లేకపోవడంతో అధికార టీడీపీ అభ్యర్థుల విజయం నల్లేరుపై నడకేనన్న దిశగా ఊహాగానాలు సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆయా ప్రాంతాలకు చెందిన కూటమి నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు.. పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన పేరాబత్తుల రాజశేఖరం, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ల విజయావకాశాలపై ఆయన దృష్టి సారించారు. విపక్షం బరిలో లేకపోవడం, రెండు స్థానాల పరిధిలోని జిల్లాలు టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నేపథ్యంలో అటు పేరాబత్తుల, ఇటు ఆలపాటి విజయాలపై ఎలాంటి అనుమానాలు లేవని నేతలు లోకేశ్ కు తెలియజేశారట. ఈ సందర్భంగా లోకేశ్ నేతలకు ఓ అంశాన్ని పదే పదే చెప్పి పంపారట.

ఎన్నికల బరిలోకి దిగిన పార్టీ అభ్యర్థులు ఇద్దరూ తొలి ప్రాధాన్యతా ఓటుతోనే విజయం సాధించి తీరాలని లోకేశ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారట. ఆ విజయం కూడా రికార్డు మెాజారిటీ దిశగా కూడా ఉండాలని ఆయన సూచించారట. పార్టీ అభ్యర్థుల విజయం నల్లేరుపై నడకే అన్నట్లుగా చెబుతున్నారు కదా… మరి ఈ విజయాల్లో సెకండ్ ప్రయారిటీ ఓటు అన్న మాటే తనకు వినిపించరాదని కూడా ఆయన ఓ కండీషన్ పెట్టారట. సెకండ్ ప్రయారిటీ ఓట్లను లెక్కించాల్సి వస్తే… పార్టీ అభ్యర్థులపై పట్టభద్రులకు అంతగా నమ్మకం లేదనే భావించక తప్పదు. ఈ తరహా పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలని లోకేశ్ సూచించారట. అయినా విపక్షం పోటీలో లేకుండా సెకండ్ ప్రయారిటీ ఓటు ప్రస్తావనే ఉండదంటూ పార్టీ నేతలు చెప్పినా… విజయం వరించేదాకా కష్టపడాల్సిందేనని లోకేశ్ చెప్పారట. అప్పుడే పార్టీ అభ్యర్థులకు రికార్డు మెజారిటీలు సాధ్యమవుతాయని ఆయన చెప్పారట.

This post was last modified on February 25, 2025 10:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

30 minutes ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

4 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

4 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

6 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

7 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

8 hours ago