Political News

‘ఫస్ట్’తోనే గట్టెక్కాలి.. ‘సెకండ్’ మాటే వద్దు

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడేసి స్థానాలకు జరగనున్న ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న పార్టీలన్నీ తమ అభ్యర్థుల విజయం కోసం పక్కా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. తెలంగాణలో రెండు టీచర్, ఓ గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరగనుండగా… ఏపీలో రెండ గ్రాడ్యుయేట్, ఓ టీచర్ స్థానానిక ఎన్నికలు జరుగుతున్నాయి. టీచర్ స్థానాలను పక్కనపెడితే… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకునేందుకు రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తెలంగాణలో ఒకింత టఫ్ ఫైట్ నడుస్తున్నా… ఏపీలో విపక్షం బరిలో లేకపోవడంతో అధికార టీడీపీ అభ్యర్థుల విజయం నల్లేరుపై నడకేనన్న దిశగా ఊహాగానాలు సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆయా ప్రాంతాలకు చెందిన కూటమి నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు.. పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన పేరాబత్తుల రాజశేఖరం, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ల విజయావకాశాలపై ఆయన దృష్టి సారించారు. విపక్షం బరిలో లేకపోవడం, రెండు స్థానాల పరిధిలోని జిల్లాలు టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నేపథ్యంలో అటు పేరాబత్తుల, ఇటు ఆలపాటి విజయాలపై ఎలాంటి అనుమానాలు లేవని నేతలు లోకేశ్ కు తెలియజేశారట. ఈ సందర్భంగా లోకేశ్ నేతలకు ఓ అంశాన్ని పదే పదే చెప్పి పంపారట.

ఎన్నికల బరిలోకి దిగిన పార్టీ అభ్యర్థులు ఇద్దరూ తొలి ప్రాధాన్యతా ఓటుతోనే విజయం సాధించి తీరాలని లోకేశ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారట. ఆ విజయం కూడా రికార్డు మెాజారిటీ దిశగా కూడా ఉండాలని ఆయన సూచించారట. పార్టీ అభ్యర్థుల విజయం నల్లేరుపై నడకే అన్నట్లుగా చెబుతున్నారు కదా… మరి ఈ విజయాల్లో సెకండ్ ప్రయారిటీ ఓటు అన్న మాటే తనకు వినిపించరాదని కూడా ఆయన ఓ కండీషన్ పెట్టారట. సెకండ్ ప్రయారిటీ ఓట్లను లెక్కించాల్సి వస్తే… పార్టీ అభ్యర్థులపై పట్టభద్రులకు అంతగా నమ్మకం లేదనే భావించక తప్పదు. ఈ తరహా పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలని లోకేశ్ సూచించారట. అయినా విపక్షం పోటీలో లేకుండా సెకండ్ ప్రయారిటీ ఓటు ప్రస్తావనే ఉండదంటూ పార్టీ నేతలు చెప్పినా… విజయం వరించేదాకా కష్టపడాల్సిందేనని లోకేశ్ చెప్పారట. అప్పుడే పార్టీ అభ్యర్థులకు రికార్డు మెజారిటీలు సాధ్యమవుతాయని ఆయన చెప్పారట.

This post was last modified on February 25, 2025 10:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

2 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

3 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

3 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

5 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

5 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

7 hours ago