Political News

జగన్ తో రోజా భేటీ… ‘గాలి’కి గ్రీన్ సిగ్నలా? బ్రేకులా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా సోమవారం భేటీ అయ్యారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన జగన్ ఆ తర్వాత తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సలీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కని సభకు ఇంకేం హాజరవుతాం… ఇకపై ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుందాం అంటూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత పక్కనే తన ఇంటికి జగన్ చేరుకోగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న రోజా.. జగన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీపై పలు ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.

చిత్తూరు జిల్లాలోని నగరి కేంద్రంగా రోజా రాజకీయం చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ సీనియర్ మోస్ట్ నేత దివంగత గాలి ముద్దు కృష్ణమనాయుడు చేతిలో పరాజయం పాలైన ఆమె… ఆ తర్వాత ఆయననే ఓడించారు. ఆ తర్వాత ముద్దు కృష్ణమ పెద్ద కుమారుడు గాలి భాను ప్రకాశ్ ను కూడా ఓడించిన రోజా… మొన్నటి ఎన్నికల్లో ఆయన చేతిలో పరాజయం పాలయ్యారు. రాష్ట్రంలో కూడా టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది.

ఇదే సమయంలో ముద్దు కృష్ణమ రెండో కుమారుడు గాలి జగదీశ్ ప్రకాశ్ కూడా రాజకీయంగా యాక్టివేట్ అయ్యే దిశగా పక్కా వ్యూహాలు రచించుకున్నారు. తన సోదరుడు ఎలాగూ టీడీపీలో ఉన్నాడని.. అందులో తనకు ఇంకే ప్రాధాన్యం దక్కదని భావించి వైసీపీలో చేరే దిశగా సాగారు. వైసీపీ కీలక నేత, రోజా అంటే గిట్టదని ప్రచారంలో ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మంత్రాంగం నెరపిన జగదీశ్.. వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ సాధించారు. ఇప్పటికే ఆయన ఓ సారి జగన్ ను తాడేపల్లిలో కలిశారు కూడా.

ఇలాంటి నేపథ్యంలో జగన్ తో రోజా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నగరిలో తాను ఉండగా… జగదీశ్ ను ఎలా చేర్చుకుంటారని గతంలోనే ఆమె వైసీపీ అధిష్ఠానం వద్ద పెద్ద పంచాయతీనే పెట్టారట. ఈ కారణంగానే ఇటీవల జగన్ తో జగదీశ్ కలిసినా కూడా జగదీశ్ చేరికను తర్వాత చూద్దామంటూ జగన్ వాయిదా వేసినట్టు సమాచారం. వైసీపీలోకి జగదీశ్ చేరికపై అటోఇటో తేల్చుకుందామన్న భావనతోనే సోమవారం రోజా నేరుగా తాడేపల్లికి వచ్చి జగన్ తో భేటీ అయ్యారన్ వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో జగన్ పిలిస్తేనే… రోజా సోమవారం తాడేపల్లి వచ్చారన్న మరో ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే నగరిలో రోజాకు ఇంటి పోరు ఓ రేంజిలో ఇబ్బంది పెడుతోంది. ఈ విషయాన్ని కాస్తంత వివరంగా చెప్పి జగదీశ్ చేరికకు రోజాను ఒప్పించేందుకే జగన్ ఆమెను పిలిపించారని సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ తో రోజా భేటీ.. వైసీపీలో జగదీశ్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?.. లేదంటే బ్రేకులేసిందా? అన్న దానిపై చర్చ సాగుతోంది.

This post was last modified on February 25, 2025 6:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

56 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago