Political News

సీనియర్లంటే.. టిష్యూ పేపర్లలా కనిపిస్తున్నారా?

రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ఏనాడూ విననన్ని సంచలన వ్యాఖ్యలు, వింత వ్యాఖ్యలు, వినూత్న పోలికలు వింటున్నాం. రాజకీయ రంగమైనా… ఇంకే రంగమైనా కూడా పాత నీరు పోతూ ఉంటే… కొత్త నీరు వస్తూనే ఉంటుంది కదా. అలాగని పాత తరం నేతలను కొత్త తరం నేతలు మరీ చులకనగా చూడకూడదు కదా. అదే సమయంలో తాము ఇంకా బరిలోనే ఉండగా… ఈ కొత్త నేతలు అవసరమా? అని పాత తరం నేతలూ భావించకూడదు కదా. ఈ రెండు భావనలూ తప్పే.

ఎవరు రమ్మన్నా… ఎవరు వద్దన్నా కూడా కొత్త నేతల ఎంట్రీ అయితే ఆగదు కదా. ఇలాంటి పరిణామాలు ఇప్పుడు తెలంగాణలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది కూడా అధికార కాంగ్రెస్ లో ఈ పరిణామాలు విస్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త నేతలపై పాత తరం నేతలు కస్సుబుస్సులాడుతున్నారు. మీరు ఇంకెంత కాలం కొనసాగుతారంటూ కొత్త నేతలు కూడా పాత నేతలపై విరుచుకుపడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకప్పుడు ఓ రేంజిలో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం 40 ఏళ్లకు పైగా కష్టపడుతున్న తమకు ఇప్పుడు పార్టీలో కనీస గౌరవం కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌరవం మాట అటుంచితే.. సీనియర్ నేతలు అన్న కనీస ప్రాధాన్యం కూడా దక్కడం లేదని ఆయన వాపోయారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న చిన్నారెడ్డి.. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంచి ప్రాధాన్యమే దక్కింది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. వనపర్తి నుంచి ఆయన 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనకు వనపర్తి టికెట్ కేటాయించిన కాంగ్రెస్… ఆ తర్వాత ఎందుకనో గానీ ఆయనను తప్పించి మేఘారెడ్డికి టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక… చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ లెక్కన రేవంత్ హాయాంలోనూ చిన్నారెడ్డికి మంచి ప్రాధాన్యం దక్కినట్టే.

తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉండి కూడా చిన్నారెడ్డి… తనకు ప్రాధాన్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. తనకు ఇచ్చిన టికెట్ ను దక్కించుకున్న మేఘారెడ్డి ఎన్నికల్లో విజయం సాధించడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీనియర్లను… ప్రత్యేకించి చిన్నారెడ్డిని అసలు పట్టించుకోవడం లేదట.

ఈ క్రమంలోనే పెబ్బేరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కోసం ఓ పేరును చిన్నారెడ్డి ప్రతిపాదిస్తే.. మేఘారెడ్డి వేరే ఎవరికో దానిని ఇచ్చేశారట. దీంతో భగ్గుమన్న చిన్నారెడ్డి మీడియా ముందుకు వచ్చేశారు. పార్టీలో సీనియర్ నాయకులంటే.. టిష్యూ పేపర్ లాగా కనిపిస్తున్నారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటి వద్ద కావలిదార్లుగా పనిచేస్తున్నారని, మేఘారెడ్డి చెప్పిందే వేదంలా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యేకు అధికారులు, పోలీసులు ఇంతలా భయపడటం తానెప్పుడూ చూడలేదన్నారు. పెబ్బేరు లాంటి చిన్న పట్టణాలకు చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అడిగే అర్హత కూడా తమకు లేదా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

This post was last modified on February 24, 2025 2:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

37 minutes ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

1 hour ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

1 hour ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

2 hours ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

3 hours ago

SRH: కమిన్స్ లేకుంటే కెప్టెన్ ఎవరు మరీ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…

4 hours ago