Political News

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా డిప్యూటీగా పర్వేశ్…

దేశమంతా ఆసక్తి రేకెత్తించిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠను తెర పడిపోయింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి సమవేశమైన బీజేఎల్పీ భేటీలో ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా ఏకగ్రీవంగా రేఖా గుప్తాను సీఎంగా ఎన్నుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఢిల్లీలోని షాలిమార్ భాగ్ నియోజకవర్గం నుంచి గుప్తా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దాదాపుగా 15 రోజుల సుదీర్ఘ కసరత్తు తర్వాత రేఖాను బీజేపీ అధిష్ఠానం ఢిల్లీ సీఎంగా ఎంపిక చేయడం గమనార్హం.

ఇక న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగి ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను మట్టి కరిపించిన బీజేపీ సీనియర్ నేత పర్వేశ్ వర్మకు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. ఢిల్లీకి గతంలో బీజేపీ సీఎంగా పనిచేసిన సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేశ్ కే సీఎం పోస్టు దక్కుతుందని అంతా భావించారు. ఆ మాట నిజమేనన్నట్లుగా ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుక్షణమే వర్మ నేరుగా అమిత్ షా వద్దకు వెళ్లి ఆయనను కలిశారు. దీంతో ఢిల్తీ సీఎంగా పనిచేసిన వర్మ కుమారుడికే సీఎం పీఠం దక్కడం ఖాయమంటూ ఊహాగానాలు వినిపించాయి.

రేపు ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవంలో సీఎంగా రేఖా గుప్తా, డిప్యూటీ సీఎంగా పర్వేశ్ వర్మలతో పాటు ఆరుగురు మంత్రులు పదవీ ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఇక సీఎం పదవి కోసం గట్టిగానే యత్నించిన మరో బీజేపీ నేత విజయేంద్ర గుప్తాకు స్పీకర్ పదవి వరించబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం జరగనున్న ఢిల్లీ సీఎం పదవీ ప్రమాణానికి పీఎం మోదీతో పాటుగా బీజేపీ అగ్ర నేతలు, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన కీలక నేతలంతా పాల్గొననున్నారు.

This post was last modified on February 19, 2025 9:26 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

8 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

52 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago