దేశమంతా ఆసక్తి రేకెత్తించిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠను తెర పడిపోయింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి సమవేశమైన బీజేఎల్పీ భేటీలో ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా ఏకగ్రీవంగా రేఖా గుప్తాను సీఎంగా ఎన్నుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఢిల్లీలోని షాలిమార్ భాగ్ నియోజకవర్గం నుంచి గుప్తా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దాదాపుగా 15 రోజుల సుదీర్ఘ కసరత్తు తర్వాత రేఖాను బీజేపీ అధిష్ఠానం ఢిల్లీ సీఎంగా ఎంపిక చేయడం గమనార్హం.
ఇక న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగి ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను మట్టి కరిపించిన బీజేపీ సీనియర్ నేత పర్వేశ్ వర్మకు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. ఢిల్లీకి గతంలో బీజేపీ సీఎంగా పనిచేసిన సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేశ్ కే సీఎం పోస్టు దక్కుతుందని అంతా భావించారు. ఆ మాట నిజమేనన్నట్లుగా ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుక్షణమే వర్మ నేరుగా అమిత్ షా వద్దకు వెళ్లి ఆయనను కలిశారు. దీంతో ఢిల్తీ సీఎంగా పనిచేసిన వర్మ కుమారుడికే సీఎం పీఠం దక్కడం ఖాయమంటూ ఊహాగానాలు వినిపించాయి.
రేపు ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవంలో సీఎంగా రేఖా గుప్తా, డిప్యూటీ సీఎంగా పర్వేశ్ వర్మలతో పాటు ఆరుగురు మంత్రులు పదవీ ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఇక సీఎం పదవి కోసం గట్టిగానే యత్నించిన మరో బీజేపీ నేత విజయేంద్ర గుప్తాకు స్పీకర్ పదవి వరించబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం జరగనున్న ఢిల్లీ సీఎం పదవీ ప్రమాణానికి పీఎం మోదీతో పాటుగా బీజేపీ అగ్ర నేతలు, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన కీలక నేతలంతా పాల్గొననున్నారు.
This post was last modified on February 19, 2025 9:26 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…