Political News

మహా కుంభమేళాలో పవన్ పుణ్య స్నానం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహా కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించారు. మంగళవారం సతీసమేతంగా ప్రయాగ్ రాజ్ వెళ్లిన పవన్… సతీ సమేతంగానే పుణ్య స్నానాలు ఆచరించారు. పవన్ దంపతులతో పాటు పవన్ కుమారుడు అకీరా నందన్, టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ పుణ్య స్నానాల్లో పాలుపంచుకున్నారు. పుణ్య స్నానాల అనంతరం పవన్ తన చేతులతో అఖండ హారతిని పట్టుకుని కనిపించారు.

గత నెలలో ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వేదికగా మొదలైన మహా కుంభమేళా ముగింపు దశకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా మహా కుంభమేళాకు వెళ్లారు. లోకేశ్ వెంట టీడీపీ నేతలు పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, రఘురామకృష్ణరాజు, బీటెక్ రవి, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తదితరులు కూడా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించిన సంగతి తెలిసిందే.

ఇటీవలే ధర్మ పరిరక్షణ యాత్రలో భాగంగా కేరళ, తమిళనాడుల్లోని పలు ఆలయాలను సందర్శించిన పవన్ కల్యాణ్…మొన్న విజయవాడ తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి ఆయన విజయవాడలో జరిగిన మ్యూజికల్ నైట్ కు హాజరై…ఆదివారం ఒకింత విశ్రాంతి తీసుకుని మంగళవారం ప్రయాగ్ రాజ్ బయలుదేరి వెళ్లారు. మహా కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించిన తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడిన పవన్… కుంభమేళాకు యూపీ సర్కారు భారీ ఏర్పాట్లు చేసిందని కీర్తించారు. భాషా బేధాలు ఉన్నా… భారతీయులంతా మత పరంగా అంతా ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించారు.

Kumar

Recent Posts

పీఏ అక్ర‌మాలు… గట్టిగా వినిపిస్తున్న జగన్ పేరు

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు.. రాష్ట్రంలో జ‌రిగిన అనేక అక్ర‌మాల‌పై ప్ర‌స్తుత ప్ర‌భుత్వం విచార‌ణ చేస్తున్న…

41 minutes ago

తెలుగు దుకాణంలో డబ్బింగ్ వ్యాపారం

వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…

1 hour ago

కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై…

3 hours ago

వైసీపీ మెడకే చుట్టుకున్న వైఎస్ విగ్రహ ధ్వంసం!

ఏపీలోని నంద్యాల జిల్లా కేంద్రం నంద్యాలలో సెలవు దినం ఆదివారం రాజకీయ రచ్చ చోటుచేసుకుంది. పట్టణంలోని శ్రీనివాస సెంటర్ లో…

5 hours ago

ఓవర్సీస్ ప్లానింగ్ ఇలా ఉండాలి

గత కొన్నేళ్లుగా నిర్మాతలను బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఓవర్సీస్ ప్రీమియర్లు. టైంకి డేటా పంపలేకపోవడం, హార్డ్ డిస్క్ రవాణాలో…

6 hours ago

జగన్ గొడ్డలి కంటే ఎక్కువ: సజ్జల

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇటీవలి మహానాడులో టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…

6 hours ago