Political News

పదవిలో ఉంటే కాషాయ వస్త్రాలు కట్టకూడదట!

ఎర్రన్నలు… అదేనండి మన వామపక్ష పార్టీలకు చెందిన నేతలు ఎప్పుడేం మాట్లాడతారో కూడా అర్థం కాదు. అసలే జనాల్లో పట్టు కోల్పోయిన ఎర్ర దండు నేడో, రేపో దుకాణాలు పూర్తిగా బంద్ చేసుకోక తప్పని పరిస్థితులు కనపడుతున్నాయన్న వాదనలు తరచూ వినిపిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దుకునే పనిని పక్కనపెట్టేసిన లెప్ట్ పార్టీ నేతలు.. అధికారంలో ఉన్న నేతలు.. అది కూడా పోటీ చేసిన అన్ని స్థానాలను గెలిచిన.. 100 శాతం స్ట్రైక్ రేటును సాధించిన జనసేన లాంటి పార్టీని.. ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. పదవిలో ఉంటే… గుళ్లు, గోపురాలకు దూరంగా ఉండాలన్న దిశగా సీపీఐ కీలక నేత రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు నిజంగానే వింతగా ఉన్నాయని చెప్పక తప్పుదు.

ధర్మ పరిరక్షణ యాత్ర పేరిట పవన్ కల్యాణ్ 3 రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను సందర్శించారు. కుమారుడు అకీరా నందన్ ను వెంటేసుకుని బయలుదేరిన పవన్…. 3 రోజుల పాటు యాత్రలో నిష్టగా కొనసాగారు. యాత్రకు బయలుదేరిన నాటి నుంచి యాత్రను ముగించి తిరిగి వచ్చేదాకా ఆయన కాషాయ దుస్తుల్లోనే కనిపించారు.

కాళ్లకు ప్యారగాన్ చెప్పులను వేసుకుని అత్యంత సాధారణ వ్యక్తిగా కనిపించారు. మొత్తంగా ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వస్తున్న తన ఆధ్యాత్మిక యాత్ర ఇప్పటికి గానీ పూర్తి కాలేదని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆధ్యాత్మిక యాత్రలో పవన్ పాలనను పక్కనపెట్టినా… ఆయన శాఖకు చెందిన అధికార యంత్రాంగం లోటు లేకుండానే అన్ని కార్యక్రమాలను యధాతథంగానే కొనసాగించింది.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో శనివారం మీడియా ముందుకు వచ్చిన సీపీఐ రామకృష్ణ.. పవన్ తీరుపై నిప్పులు చెరిగారు. పాలనను పక్కన పెట్టి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారా.? రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి గుళ్లు, గోపురాలు పట్టుకుని తిరుగుతారా? అంటూ ఓ రేంజిలో ఫైరయ్యారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్… పాలనను పక్కన పెట్టి కాషాయ వస్త్రాలు ధరించారంటూ ఆయన అభ్యంతరం తెలిపారు.

రాష్ట్రాన్ని కూటమి సర్కారు ఆదానికి దోచిపెడుతుంటే… పవన్ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించడానికే పుట్టానని ప్రకటించిన పవన్ ను ప్నజలు నమ్మి ఓట్లేస్తే.. పవన్ ఏమో ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేశారంటూ సెటర్లు సంధించారు. రామకృష్ణ ఆరోపణలపై ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నాయి.

మీరు ఎర్ర బట్టలు కట్టి ప్రజలకు ఏం చేశారు?… మీ ఆస్తులు పెంచుకోవడం తప్ప.. అంటూ నెటిజన్లు రామకృష్ణను ఏకిపారేస్తున్నారు.

This post was last modified on February 16, 2025 2:33 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

35 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago