మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడలోని సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఆ పార్టీ కార్యకర్త సత్యవర్థన్ను కిడ్నాప్ చేసి.. బెదిరించి.. ఆయనతో కేసు వెనక్కి తీసుకునేలా వత్తిడి చేశారన్న అభియోగాలతో పోలీసులు వంశీని అరెస్టు చేశారు. అయితే.. ఏదో ఒకరకంగా.. బెయిల్పై బయటకు తీసుకువచ్చేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
కానీ.. ఈ ప్రయత్నాలు జరుగుతుండగానే విజయవాడ పోలీసులు, గన్నవరం పోలీసులు సహా పలు ప్రాంతాలకు చెందిన స్టేషన్లలో మరిన్ని కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గన్నవరం పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో చంద్రబాబు, నారా లోకేష్లపై అసభ్య పదాలతో దూషించిన వీడియోపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇలాంటి కేసుల్లో చాలా మంది వైసీపీ నాయకులు జైళ్లలో ఉన్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా.. ఇలాంటి కేసునే ఎదుర్కొంటున్నారు.
ఇప్పుడు వంశీపైనా గతంలో నమోదైన కేసులతో పాటు.. తాజాగా మరికొన్ని కేసులు కూడా నమోదవుతున్నాయి. గన్నవరంలో ఇసుక దోపిడీపై ఇప్పటికే ఆయనపై రెండు కేసులు ఉన్నాయి. బెల్ట్షాపులను ప్రోత్సహించారన్న ఫిర్యాదులు కూడా గతంలోనే నమోదయ్యాయి. అదేవిధంగా గన్నవరంలో తమ ఆస్తులను వంశీ అనుచరులు లాక్కున్నారని.. వాటిని తిరిగి అప్పగించాలని.. తాజాగా టీడీపీ నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆ ప్రాంత బాధితులు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదులను వెంటనే టీడీపీ నాయకులు పోలీసులకు చేరవేసి కేసు పెట్టాలని కోరారు. ఇలా.. వంశీపై లెక్కకు మిక్కిలిగానే కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే.. వంశీ ఒక కేసులో బయటకు వచ్చినా.. మరో కేసు వెంటనే ఆయనను లోపలకు తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోందని వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
గతంలో టీడీపీ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను ఇలానే 12 కేసుల్లో 64 రోజులకుపైగా జైల్లో ఉంచిన విషయాన్ని వారే గుర్తు చేస్తుండడం గమనార్హం. దీనిని బట్టి వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 16, 2025 2:52 pm
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…