Political News

మైక్ పట్టుకొని సాక్షి రిపోర్టర్ తో లోకేష్ పంచులు!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ తనదైన మార్క్ రాజకీయంతో దూసుకుపోతున్నారు. 23 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు ఉన్న పార్టీకి రాత్రికి రాత్రి… 135 ఎమ్మెల్యే సీట్లు, 18 ఎంపీ సీట్లు కలిగిన పార్టీగా టీడీపీకి బలమైన కం బ్యాక్ ఇచ్చారు. రాజ్యసభలో జీరో స్థాయికి చేరిన టీడీపీ సంఖ్యను ఆరంటే ఆరు నెలల్లోనే తిరిగి ఖాతా ఓపెన్ అయ్యేలా చేశారు.

అంతేనా… వైరి వర్గాలపై ఆయన చేస్తున్న సెటైరిక్ విమర్శలు అంతకంతకూ పదునెక్కుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే… వైసీపీపైనా, ఆ పార్టీ పత్రికగా ముద్ర పడిన సాక్షి మీడియాపైనా లోకేశ్ చేస్తున్న ర్యాగింగ్ డోస్ మరింత పెరిగిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రాజకీయంగా తనను నిత్యం టార్గెట్ చేస్తున్న సాక్షి మీడియాను చూసి దూరం వెళ్లడానికి బదులుగా… సాక్షి మీడియాను టార్గెట్ చేయడాన్ని లోకేశ్ చాలా కాలం క్రితమే మొదలుపెట్టారు. ఎక్కడ మీడియా సమావేశం పెట్టినా…సాక్షి ఎక్కడబ్బా… ఎవరు వచ్చారు సాక్షి నుంచి… అంటూ సెటైర్లు సంధించే లోకేశ్… ఎంటీ సాక్షి రాలేదా?.. అంత భయమైతే ఎలాగబ్బా… అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ సాగారు.

ఇక తన మీడియా సమావేశాలకు హాజరయ్యే సాక్షి ప్రతినిధులను పిలిచి మరీ బాగున్నారా? అంటూ పలరిస్తూ కూడా లోకేశ్… ఆ పలకరింపులోనూ తనదైన వ్యంగ్యాన్ని జోగించి సాక్షికి బీపీ పెంచేవారు.

తాజాగా శనివారం విశాఖ వచ్చిన సందర్బంగా కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా లోకేశ్ తన ర్యాగింగ్ డోస్ ను మరింతగా పెంచారు. ”సాక్షి వచ్చాడా అబ్బా… ఎవరు?..ఎవరొచ్చారు?…ఏడీ?… ఎక్కడ?.. మీరేనా?… బాగున్నారా?… ఏంటీ?.. చాలా రోజుల తర్వాత మేడం గారు ఆఫీస్ కు వెళ్లారంట….”.అంటూ లోకేశ్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. నిన్నటిదాకా సాక్షి ప్రతినిధులతోనే ఆడుకున్న లోకేశ్… ఇప్పుడు ఏకంగా సాక్షి మీడియా అధినేత్రిగా ఉన్న వైఎస్ భారతిని కూడా ప్రస్తావిస్తూ సెటైర్లు వేస్తూ… సాక్షిపై తన ర్యాగింగ్ డోస్ ను అమాంతంగా పెంచేశారు.

This post was last modified on February 16, 2025 12:39 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

2 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

4 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

6 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

9 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

10 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

11 hours ago