Political News

మైక్ పట్టుకొని సాక్షి రిపోర్టర్ తో లోకేష్ పంచులు!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ తనదైన మార్క్ రాజకీయంతో దూసుకుపోతున్నారు. 23 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు ఉన్న పార్టీకి రాత్రికి రాత్రి… 135 ఎమ్మెల్యే సీట్లు, 18 ఎంపీ సీట్లు కలిగిన పార్టీగా టీడీపీకి బలమైన కం బ్యాక్ ఇచ్చారు. రాజ్యసభలో జీరో స్థాయికి చేరిన టీడీపీ సంఖ్యను ఆరంటే ఆరు నెలల్లోనే తిరిగి ఖాతా ఓపెన్ అయ్యేలా చేశారు.

అంతేనా… వైరి వర్గాలపై ఆయన చేస్తున్న సెటైరిక్ విమర్శలు అంతకంతకూ పదునెక్కుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే… వైసీపీపైనా, ఆ పార్టీ పత్రికగా ముద్ర పడిన సాక్షి మీడియాపైనా లోకేశ్ చేస్తున్న ర్యాగింగ్ డోస్ మరింత పెరిగిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రాజకీయంగా తనను నిత్యం టార్గెట్ చేస్తున్న సాక్షి మీడియాను చూసి దూరం వెళ్లడానికి బదులుగా… సాక్షి మీడియాను టార్గెట్ చేయడాన్ని లోకేశ్ చాలా కాలం క్రితమే మొదలుపెట్టారు. ఎక్కడ మీడియా సమావేశం పెట్టినా…సాక్షి ఎక్కడబ్బా… ఎవరు వచ్చారు సాక్షి నుంచి… అంటూ సెటైర్లు సంధించే లోకేశ్… ఎంటీ సాక్షి రాలేదా?.. అంత భయమైతే ఎలాగబ్బా… అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ సాగారు.

ఇక తన మీడియా సమావేశాలకు హాజరయ్యే సాక్షి ప్రతినిధులను పిలిచి మరీ బాగున్నారా? అంటూ పలరిస్తూ కూడా లోకేశ్… ఆ పలకరింపులోనూ తనదైన వ్యంగ్యాన్ని జోగించి సాక్షికి బీపీ పెంచేవారు.

తాజాగా శనివారం విశాఖ వచ్చిన సందర్బంగా కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా లోకేశ్ తన ర్యాగింగ్ డోస్ ను మరింతగా పెంచారు. ”సాక్షి వచ్చాడా అబ్బా… ఎవరు?..ఎవరొచ్చారు?…ఏడీ?… ఎక్కడ?.. మీరేనా?… బాగున్నారా?… ఏంటీ?.. చాలా రోజుల తర్వాత మేడం గారు ఆఫీస్ కు వెళ్లారంట….”.అంటూ లోకేశ్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. నిన్నటిదాకా సాక్షి ప్రతినిధులతోనే ఆడుకున్న లోకేశ్… ఇప్పుడు ఏకంగా సాక్షి మీడియా అధినేత్రిగా ఉన్న వైఎస్ భారతిని కూడా ప్రస్తావిస్తూ సెటైర్లు వేస్తూ… సాక్షిపై తన ర్యాగింగ్ డోస్ ను అమాంతంగా పెంచేశారు.

This post was last modified on February 16, 2025 12:39 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

17 minutes ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

34 minutes ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

1 hour ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

2 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

2 hours ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

3 hours ago