Political News

“డబుల్ ఇంజిన్ కాదు… ట్రిపుల్ ఇంజిన్ సర్కారు”

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు కొలువు దీరిన తర్వాత… బీజేపీ నేతలు ఎక్కడకెళ్లినా… డబుల్ ఇంజిన్ సర్కారు అంటూ పదే పదే ఆ కొత్త పదబంధాన్ని ప్రయోగించారు. డబుల్ ఇంజిన్ అంటే… కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే… రాష్ట్రాల్లోనూ అదే పార్టీ అధికారంలోకి రావడమన్న మాట.

ఇలా డబుల్ ఇంజిన్ పాలన వచ్చిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి నిధుల కొరత ఉండదని, అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవని బీజేపీ చెబుతూ వచ్చింది. ఇదే మాటతోనే ఆ పార్టీ దేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేసింది కూడా.

డబుల్ ఇంజిన్ సర్కారు పాలనను దాటేసిన బీజేపీ… ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్ పాలన అంటూ సరికొత్త పదబంధాన్ని వాడుకలోకి తీసుకుని వస్తోంది. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన బీజేపీ… అక్కడి మునిసిపల్ కార్పొరేషన్లలోనూ పాగా వేయాలని ప్లాన్ రచిస్తోంది.

అందులో భాగంగా మొన్నటిదాకా ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు శనివారం బీజేపీలో చేరారు. వీరికి బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా కాషాయ జెండాలు కల్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా సచ్ దేవా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది… మొన్ననే ఢిల్లీ సీఎం పీఠాన్ని కూడా బీజేపీ చేజిక్కించుకుంది. త్వరలో జరగనున్న ఢిల్లి నగర పాలికల ఎన్నికల్లోనే విజయమే లక్ష్యంగా బీజేపీ సాగుతుంది.. ఫలితంగా ఢిల్లీలో ఇకపై ట్రిపుల్ ఇంజిన్ పాలన అమలులోకి వస్తుంది” ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ ఏప్రిల్ లో ఢిల్లీ నగర పాలక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లోగా ఢిల్లీలో ఆప్ ప్రభావాన్ని జీరో స్థాయికి తగ్గించి… ఢిల్లీ మునిసిపాలిటీపైనా కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. చూద్దాం మరి సచ్ దేవా చెప్పినట్లుగా ఢిల్లీలో ట్రిపుల్ ఇంజిన్ పాలన వస్తుందో?.. లేదో?

This post was last modified on February 16, 2025 12:29 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

29 minutes ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

42 minutes ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

2 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

4 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

4 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

5 hours ago