టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.. ఇటీవల కాలంలో పెద్దగా రాజకీయాల్లో యాక్టివ్గా కనిపించడం లేదు. ఎందుకంటే.. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా..యనమలకు మంత్రి పదవి ఖాయం. అయితే.. ఈ సారి కూటమి సర్కారులో మాత్రమే యనమలకు అవకాశం దక్కలేదు.
ఈ నేపథ్యంలో యనమల మౌనంగా ఉంటున్నారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. పార్టీ కోసం పనిచేయరా? అంటూ..కొందరు సటైర్లు కూడా వేస్తున్నారు. ప్రస్తుతం యనమల ఎమ్మెల్సీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇదిలావుంటే.. తాజాగా యనమల చెలరేగిపోయారు. వైసీపీకి భారీ షాక్ ఇచ్చే పని చేపట్టారు. తన సొంత నియోజకవర్గం (ప్రస్తుతం యనమల కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా ఉన్నారు) తునిలో వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ.. ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లను టీడీపీ గూటికి చేర్చారు. ఒక్కొక్కరుగా కాదు.. అన్నట్టుగా.. ఒకేసారి.. పది మందికిపైగా కౌన్సిలర్లను టీడీపీలోకి ఆహ్వానించి పచ్చకండువా కప్పారు.
తుని పట్టణానికి చెందిన ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు గతంలోనే టీడీపీలో చేరారు. ఇక, తాజాగా ఇప్పుడు మరో 10 మందిని యనమల ఆహ్వానించి.. సైకిల్ ఎక్కించుకున్నారు.
దీంతో మొత్తంగా టీడీపీలో చేరిన కౌన్సిలర్ల సంఖ్య 13కు చేరింది. వీరందరికీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృ ష్ణుడు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇదిలావుంటే.. త్వరలోనే తుని మునిసిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మార్పులు.. కూటమి పార్టీలకు బలంగా మారనున్నాయి.
ఇప్పటి వరకు జిల్లాలో పట్టున్న వైసీపీ.. తాజాగా తునిలో బలాన్ని కోల్పోవడంతోపాటు.. మునిసిపల్ వైస్ చైర్మన్ పీఠాన్ని కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇదిలావుంటే.. తుని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత దాడిశెట్టి రాజా ప్రస్తుతం మౌనంగా ఉండడం గమనార్హం.
This post was last modified on February 16, 2025 12:23 am
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…