టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించారు. స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర పేరిట ఇటీవలే ప్రారంభించిన కార్యక్రమంలో చంద్రబాబు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా కందుకూరు మార్కెట్ లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను పరిశీలించిన చంద్రబాబు… పట్టణంలోని పలు ప్రాంతాల్లో పరిశుభ్రతను పరికించారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
కందుకూరులో పరిశుభ్రతపై మాట్లాడేందుకు వచ్చిన ఓ బాలిక… చంద్రబాబు సమక్షంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పట్టణంలో పరిశుభ్రత గురించి మాట్లాడిన బాలిక… పట్టణంలో పరిశుభ్రతను అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిపింది. చంద్రబాబు వస్తున్నారని.. శనివారం ఉదయమే అధికారులు పట్టణంలోని చెత్తను తొలగించారని ఆ బాలిక తెలిపింది. అదే చంద్రబాబో, లేదంటే ఇతర ముఖ్య నేతల పర్యటనలు లేకుంటే.,..పట్ఠణంలో చెత్త తొలగింపును యంత్రాంగం అస్సలు పట్టంచుకోవట్లేదని కూడా ఆ బాలిక వెల్లడించింది.
వాస్తవానికి చంద్రబాబు పచ్చదనం-పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్నారు. తాను ఎప్పుడు సీఎంగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి ఆయన అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో బాబు పచ్చదనం-పరిశుభ్రత కాస్తా… స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్రగా మారినా.. లక్ష్యం మాత్రం పాతదే.
చంద్రబాబు ఇంత ప్రాధాన్యం ఇస్తున్న ఈ పథకంలో అధికారులు ఎంతగా నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విషయాన్ని కందుకూరు బాలిక సభా ముఖంగానే కుండబద్దలు కొట్టింది. బాలిక మాటలు విన్న చంద్రబాబు… కందుకూరు మునిసిపల్ అధికారుల పనితీరుపై మదింపు చేసి చర్యలు తీసుకునే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 15, 2025 7:16 pm
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…