టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించారు. స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర పేరిట ఇటీవలే ప్రారంభించిన కార్యక్రమంలో చంద్రబాబు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా కందుకూరు మార్కెట్ లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను పరిశీలించిన చంద్రబాబు… పట్టణంలోని పలు ప్రాంతాల్లో పరిశుభ్రతను పరికించారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
కందుకూరులో పరిశుభ్రతపై మాట్లాడేందుకు వచ్చిన ఓ బాలిక… చంద్రబాబు సమక్షంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పట్టణంలో పరిశుభ్రత గురించి మాట్లాడిన బాలిక… పట్టణంలో పరిశుభ్రతను అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిపింది. చంద్రబాబు వస్తున్నారని.. శనివారం ఉదయమే అధికారులు పట్టణంలోని చెత్తను తొలగించారని ఆ బాలిక తెలిపింది. అదే చంద్రబాబో, లేదంటే ఇతర ముఖ్య నేతల పర్యటనలు లేకుంటే.,..పట్ఠణంలో చెత్త తొలగింపును యంత్రాంగం అస్సలు పట్టంచుకోవట్లేదని కూడా ఆ బాలిక వెల్లడించింది.
వాస్తవానికి చంద్రబాబు పచ్చదనం-పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్నారు. తాను ఎప్పుడు సీఎంగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి ఆయన అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో బాబు పచ్చదనం-పరిశుభ్రత కాస్తా… స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్రగా మారినా.. లక్ష్యం మాత్రం పాతదే.
చంద్రబాబు ఇంత ప్రాధాన్యం ఇస్తున్న ఈ పథకంలో అధికారులు ఎంతగా నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విషయాన్ని కందుకూరు బాలిక సభా ముఖంగానే కుండబద్దలు కొట్టింది. బాలిక మాటలు విన్న చంద్రబాబు… కందుకూరు మునిసిపల్ అధికారుల పనితీరుపై మదింపు చేసి చర్యలు తీసుకునే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 15, 2025 7:16 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…