Political News

బాబు ముందు అధికారులను బుక్ చేసిన బాలిక

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించారు. స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర పేరిట ఇటీవలే ప్రారంభించిన కార్యక్రమంలో చంద్రబాబు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా కందుకూరు మార్కెట్ లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను పరిశీలించిన చంద్రబాబు… పట్టణంలోని పలు ప్రాంతాల్లో పరిశుభ్రతను పరికించారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

కందుకూరులో పరిశుభ్రతపై మాట్లాడేందుకు వచ్చిన ఓ బాలిక… చంద్రబాబు సమక్షంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పట్టణంలో పరిశుభ్రత గురించి మాట్లాడిన బాలిక… పట్టణంలో పరిశుభ్రతను అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిపింది. చంద్రబాబు వస్తున్నారని.. శనివారం ఉదయమే అధికారులు పట్టణంలోని చెత్తను తొలగించారని ఆ బాలిక తెలిపింది. అదే చంద్రబాబో, లేదంటే ఇతర ముఖ్య నేతల పర్యటనలు లేకుంటే.,..పట్ఠణంలో చెత్త తొలగింపును యంత్రాంగం అస్సలు పట్టంచుకోవట్లేదని కూడా ఆ బాలిక వెల్లడించింది.

వాస్తవానికి చంద్రబాబు పచ్చదనం-పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్నారు. తాను ఎప్పుడు సీఎంగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి ఆయన అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో బాబు పచ్చదనం-పరిశుభ్రత కాస్తా… స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్రగా మారినా.. లక్ష్యం మాత్రం పాతదే.

చంద్రబాబు ఇంత ప్రాధాన్యం ఇస్తున్న ఈ పథకంలో అధికారులు ఎంతగా నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విషయాన్ని కందుకూరు బాలిక సభా ముఖంగానే కుండబద్దలు కొట్టింది. బాలిక మాటలు విన్న చంద్రబాబు… కందుకూరు మునిసిపల్ అధికారుల పనితీరుపై మదింపు చేసి చర్యలు తీసుకునే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on February 15, 2025 7:16 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

37 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

1 hour ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago