Political News

తులసిబాబుకు రూ.48 లక్షలు!.. ఎందుకిచ్చారంటే..?

కామేపల్లి తులసిబాబుకు ఏపీ సీఐడీ భారీ నజరానా ఇచ్చిందన్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజుపై గతంలో ఆయన ఎంపీగా ఉండగా సీఐడీ కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగిందన్న కేసులో తులసి బాబు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. రఘురామపై టార్చర్ జరుగుతున్న సమయంలో సీఐడీ కార్యాలయానికి వచ్చిన తులసిబాబు.. రఘురామ గుండెలపై కూర్చున్నారని, సీఐడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఆయన అలా చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ విషయంలోనే తులసిబాబు అరెస్ట్ కాగా… ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం హైకోర్టులో ఉంది.

అయినా తులసిబాబుకు నాటి సీఐడీ అధికారులు రూ.48 లక్షలు ఇచ్చారంటూ తాజాగా బుధవారం రఘురామ సంచలన ఆరోపణ చేశారు. అయితే ఆదేదో… రఘురామ గుండెలపై కూర్చున్నందుకు తులసిబాబుకు సీఐడీ ఆ మొత్తాన్ని ఇవ్వలేదట. సీఐడీ కేసుల్లో లీగల్ అసిస్టెంట్ గా వ్యవహరించినందుకు లాయర్ ఫీజుల కింద ఆ మొత్తాన్ని తులసిబాబుకు అందించారట. ఇదే విషయాన్ని చెప్పిన రఘురామ… దీనిపైనా విచారణ చేపట్టాలని కోర్టును కోరనున్నట్లు ఆయన చెప్పారు. సీఐడీకి లీగల్ అసిస్టెంట్ గా వ్యవహరించేంత అనుభవం తులసిబాబుకు లేదని కూడా రఘురామ ఆరోపించారు. కేవలం నాటి సీఐడీ చీప్ పీవీ సునీల్ కుమార్ కు సన్నిహితుడన్న కారణంగానే ఈ మొత్తాన్ని తులసిబాబుకు అందించారన్నది రఘురామ ఆరోపణ.

ఈ వ్యవహారంలో మరో మతలబు కూడా ఉందని రఘురామ చెప్పారు. 2021లో తులసిబాబు ఏపీ బార్ కౌన్సిల్ లో తన పేరును న్యాయవాదిగా రిజిస్టర్ చేసుకున్నారని ఆయన తెలిపారు. అయితే సీఐడీ మాత్రం తులసిబాబును 2020 అక్టోబర్ లోనే లీగల్ అసిస్టెంట్ గా నియమించుకుందని తెలిపారు. హైకోర్టులో సీఐడీ తరఫున 12 కేసుల విచారణకు తులసిబాబును లీగల్ అసిస్టెంట్ గా నియమించుకున్నట్టుగా సీఐడీ చెబుతుంటే… అసలు సీఐడీ కేసుల ట్రయల్ హైకోర్టులోనే ఉండదని రఘురామ తెలిపారు. అంటే… పీవీ సునీల్ కుమార్ చెప్పినట్టుగా వ్యవహరించిన కారణంగానే తులసిబాబుకు నజరానాగా రూ.48 లక్షలను ఇచ్చారని రఘురామ ఆరోపించారు.

This post was last modified on February 12, 2025 6:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

4 minutes ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

4 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

8 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

9 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

9 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

9 hours ago