Political News

విజిలెన్స్ రిపోర్ట్ రెడీ!… పెద్దిరెడ్డి ఆక్రమణలు నిజమేనా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారన్న విషయంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అటవీ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నుంచి జారీ అయిన ఆదేశాలతో వేగంగా కదిలిన అధికార యంత్రాంగం ఇప్పటికే సదరు విచారణను పూర్తి చేసి నివేదికను సిద్దం చేసినట్టుగా విశ్వసనీయ సమాచారం. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ చేపట్టిన ఈ విచారణలో సంచలన వాస్తవాలు వెలుగు చూసినట్టుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఆరోపించినట్టుగా పెద్దిరెడ్డి అటవీ భూములను దురాక్రమించినట్టుగా విజిలెన్స్ తేల్చిందని సమాచారం.

పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం ఉన్న చోట ఆయనకు కొంత భూమి ఉన్న మాట వాస్తవమేనట. అయితే తనకున్న భూమికి ఆనుకుని ఉన్న అటవీ భూములను ఆక్రమించేసిన పెద్దిరెడ్డి… ఆ భూములను తనతో పాటుగా రాజంపేట ఎంపీగా ఉన్న తన కుమారుడు మిథున్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల పేరిట రిజిష్టర్ చేయించుకుని… వాటిని తన భూమిలో కలిపేసుకున్నారని సమాచారం. విజిలెన్స్ నివేదిక ప్రకారం… అక్కడ పెద్దిరెడ్డికి కేవలం 23.69 ఎకరాలు మాత్రమే ఉందట. అయితే ఆ భూమిని ఆనుకుని ఉన్న అటవీ భూమిని ఆక్రమించిన పెద్దిరెడ్డి… మొత్తంగా 104 ఎకరాలకు కంచె వేసుకున్నారట. అంటే.. పెద్దిరెడ్డి ఏకంగా 90 ఎకరాల అటవీ భూములను ఆక్రమించుకున్నారన్న మాట.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ కు కేటాయించిన 1600 ఎకరాల భూముల్లో కేవలం 14 ఎకరాల అటవీ భూములు ఉన్నాయని తేలితేనే… కూటమి సర్కారు వాటిని వెనక్కు తీసుకుంది. మరి పెద్దిరెడ్డి ఏకంగా 90 ఎకరాలను ఆక్రమించి… దానిని తన వ్యవసాయ క్షేత్రంగా మలచుకుంటే సర్కారు ఊరుకుంటుందా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. దురాక్రమణలకు గురైన భూములను వెనక్కి తీసుకునేంత వరకు మాత్రమే చర్యలు ఉంటే సరేసరి… లేదంటే పెద్దిరెడ్డి తీవ్ర ఇబ్బందులు ఎదర్కొక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 90 ఎకరాల మేర అటవీ భూములను దురాక్రమించిన పెద్దిరెడ్డిపై ఏ మేర చర్యలు తీసుకుంటారన్న దిశగానూ ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.

This post was last modified on February 12, 2025 6:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

26 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago