Political News

లోక్ సభలో లిక్కర్ గోల.. ఏపీ ఎంపీల సిగపట్లు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏపీకి సంబంధించిన సమస్యలు వరుసగా ప్రస్తావనకు వస్తున్నాయి. అందులో భాగంగా మంగళవారం నాటి లోక్ సభ సమావేశాల్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నెలకొంది. వైసీపీ పాలనపై రమేష్ విసుర్లు సాధిస్తే… రమేష్ వ్యాఖ్యలను ఖండించే క్రమంలో మిథున్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేసి సంచలనం రేపారు.

లోక్ సభ జీరో అవర్ లో భాగంగా మైక్ లభించిన సీఎం రమేష్.. ఏపీలో కూడా ఢిల్లీ తరహాలో లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపించారు. ఢిల్లీలో రూ.2,500 కోట్ల మేర స్కాం జరిగితే… ఏపీలో దానికి 10 రేట్ల మేర లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపించారు. అంతేకాకుండా లిక్కర్ వ్యాపారాన్ని ప్రైవేట్ చేతిలో నుంచి ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. లక్ష కోట్ల మేర వ్యాపారం జరిగితే.. సింగల్ పైసా కూడా డిజిటల్ గా బదిలీ కాలేదన్నారు. ఉద్యోగుల్లో అందరినీ కాంట్రాక్టు పద్దతిలోనే నియమించుకున్నారని ఆరోపించారు.

ఈ సందర్బంగా రమేష్ ప్రసంగానికి అడ్డు తగిలిన మిథున్ రెడ్డి… బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. అసలు రమేష్ బీజేపీ ఎంపీనా, టీడీపీ ఎంపీనా అని మిథున్ ప్రశ్నించారు. చంద్రబాబు నుంచి కాంట్రాక్టులు దక్కించుకునేందుకు రమేష్ ఇలాంటి అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే… మిథున్ నోట చంద్రబాబు పేరు విన్నంతనే… డిప్యూటీ స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేని నేతల గురించిన ప్రస్తావన సరి కాదని ఆయన మిథున్ కు గుర్తు చేశారు. మొత్తంగా ఉన్నట్టుండి… లోక్ సభలో ఏపీ లిక్కర్ స్కాం అంటూ రమేష్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి.

This post was last modified on February 11, 2025 5:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

56 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago