Political News

లోక్ సభలో లిక్కర్ గోల.. ఏపీ ఎంపీల సిగపట్లు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏపీకి సంబంధించిన సమస్యలు వరుసగా ప్రస్తావనకు వస్తున్నాయి. అందులో భాగంగా మంగళవారం నాటి లోక్ సభ సమావేశాల్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నెలకొంది. వైసీపీ పాలనపై రమేష్ విసుర్లు సాధిస్తే… రమేష్ వ్యాఖ్యలను ఖండించే క్రమంలో మిథున్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేసి సంచలనం రేపారు.

లోక్ సభ జీరో అవర్ లో భాగంగా మైక్ లభించిన సీఎం రమేష్.. ఏపీలో కూడా ఢిల్లీ తరహాలో లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపించారు. ఢిల్లీలో రూ.2,500 కోట్ల మేర స్కాం జరిగితే… ఏపీలో దానికి 10 రేట్ల మేర లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపించారు. అంతేకాకుండా లిక్కర్ వ్యాపారాన్ని ప్రైవేట్ చేతిలో నుంచి ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. లక్ష కోట్ల మేర వ్యాపారం జరిగితే.. సింగల్ పైసా కూడా డిజిటల్ గా బదిలీ కాలేదన్నారు. ఉద్యోగుల్లో అందరినీ కాంట్రాక్టు పద్దతిలోనే నియమించుకున్నారని ఆరోపించారు.

ఈ సందర్బంగా రమేష్ ప్రసంగానికి అడ్డు తగిలిన మిథున్ రెడ్డి… బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. అసలు రమేష్ బీజేపీ ఎంపీనా, టీడీపీ ఎంపీనా అని మిథున్ ప్రశ్నించారు. చంద్రబాబు నుంచి కాంట్రాక్టులు దక్కించుకునేందుకు రమేష్ ఇలాంటి అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే… మిథున్ నోట చంద్రబాబు పేరు విన్నంతనే… డిప్యూటీ స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేని నేతల గురించిన ప్రస్తావన సరి కాదని ఆయన మిథున్ కు గుర్తు చేశారు. మొత్తంగా ఉన్నట్టుండి… లోక్ సభలో ఏపీ లిక్కర్ స్కాం అంటూ రమేష్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి.

Satya

Recent Posts

సీఎం ఇంటిముందే చెత్త పోసి నిరసన

నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…

2 hours ago

లేటైతే… హైప్ హుళక్కే

ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…

6 hours ago

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే…

7 hours ago

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

9 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

9 hours ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

11 hours ago