పులివెందుల సమస్యల పరిష్కారం కోసం… ఆ నియోజకవర్గ ప్రజలు ఇప్పటిదాకా వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లేవారు. అది కూడా జగన్ పులివెందులకు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ తరహా దృశ్యాలు కనిపించేవి. ఎందుకంటే… చాలా ఏళ్లుగా పులివెందుల ఎమ్మెల్యే గా జగన్ కొనసాగుతున్నారు కాబట్టి. జగన్ కు ముందు ఆయన తల్లి విజయమ్మ అంతకుముందు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే లుగా కొనసాగారు. ఫలితంగా పులివెందుల సమస్యలు వైఎస్ కుటుంబ సభ్యులను దయతో పోలేదు.
అయితే… ఇప్పుడు మొట్టమొదటి సారి పులివెందుల సమస్యలు ఓ టీడీపీ నేత వద్దకు చేరాయి. ఆ టీడీపీ నేత అడ్డాకు పులివెందుల సమస్యలు తీసుకెళ్లిన నేత కూడా టీడీపీకి చెందిన నేతనే అయినా… ఆయన కూడా పులివెందులకు చెందినవారే కావడం గమనార్హం. పులివెందుల సమస్య ఇప్పుడు టీడీపీ యువ నేత కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ వద్దకు చేరింది. ఆ సమస్యను ఆయన వద్దకు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీసుకెళ్లారు. అయినా.. సదరు సమస్య ఏమిటన్న విషయానికి వస్తే.. పులివెందులలో రోడ్ల సమస్యను పరిష్కరించాలని కేంద్ర మంత్రికి భూమిరెడ్డి విన్నవించారు.
ఈ పరిణామం నిజంగానే జగన్ అండ్ కో కు అవమానమేనని చెప్పాలి. ఎందుకంటే.. పులివెందుల ఎమ్మెల్యే గా జగన్ ఉండగా… కడప ఎంపీగా జగన్ సోదరుడు వై ఎస్ అవినాష్ రెడ్డి కొనసాగుతున్నారు. అంటే.. పులివెందులకు అటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ.. రెండు పదవులు వైఎస్ ఫామిలీ చేతిలోనే ఉన్నాయి. అయినా కూడా పులివెందులలో ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా ఉన్న రోడ్ల సమస్యను పరిష్కరించాలని భూమిరెడ్డి నేరుగా కేంద్ర మంత్రి వద్దకు వెళ్లడం గమనార్హం. ఈ విషయం తెలిస్తే జగన్ ఎలా స్పందిస్తారోనన్న అంశం ఆసక్తి రేకెత్తిస్తోంది.
This post was last modified on February 10, 2025 9:55 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…