Political News

పాత వ్యూహమే: ఎమ్మెల్సీ ఎన్నికలకు గులాబీ పార్టీ దూరం

కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ బాస్.. కాస్త తేడా వచ్చినంతనే అందుకు భిన్నమైన స్వరాన్ని వినిపించటం మామూలే. తాజాగా మరోసారి ఆయన తీరు అందరికి అర్థమయ్యే పరిస్థితి. త్వరలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు కాగా.. ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం. వీటి నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది.

ఇలాంటి వేళలో.. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేదా? అన్నదానిపై ఆ పార్టీకి చెందిన వారెవరూ మాట్లాడని పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత.. తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి ఎన్నికలు ఏవైనా దూకుడు ప్రదర్శించే గులాబీ పార్టీ తాజాగా జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో మాత్రం మౌనాన్ని ప్రదర్శిస్తున్నారు.ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ప్రస్తుతం జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో రెండు స్థానాలు బీఆర్ఎస్ కు అధికంగా ఎమ్మెల్యేలు ఉన్న జిల్లాలవే కావటం.. పార్టీ మొదట్నించి బలంగా ఉన్నజిల్లాల్లో జరుగుతున్నాయి.

ఇలాంటి వేళ.. ఎన్నికల్లో పోటీ చేసి ఫలితం వేరుగా ఉంటే జరిగే నష్టం కంటే.. పోటీకి దూరంగా ఉండటం మంచిదన్నఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన ఇలాంటి వ్యూహాన్ని ఉద్యమం వేళలోనూ పాటించారు. బలం లేని వేళ.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటం.. పరిస్థితి తమకు కాస్త అనుకూలంగా ఉన్నా వెంటనే పోటీకి దిగి.. భావోద్వేగంతో ఎన్నికల్లో గెలవటం తెలిసిందే.

ఇప్పుడు కూడా అదే పాతపద్దతిని ఫాలో కావటం మంచిదన్న ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉపాధ్యాయ సంఘాల ప్రభావం ఎక్కువ. పట్టభద్రుల ఎమ్మెల్సీలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించే బీజేపీ.. అధికార కాంగ్రెస్ ధాటికి నిలవటం కష్టంగా మారుతుందన్న ఉద్దేశంతో ఎన్నికలకు దూరంగా ఉండటం మంచిదన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

అందుకే.. ఎన్నికలు జరుగుతున్నా.. దాని ఊసే తమకు పట్టలేదన్నట్లుగా వ్యవహరిస్తుండటం వ్యూహంలో భాగంగా తెలుస్తోంది. ఇక్కడే ఇంకో విషయాన్ని చెప్పాలి. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఎన్నికల్లో ఓడిన పార్టీలను ఉద్దేశించి గులాబీ ముఖ్యనేతలు కేసీఆర్.. కేటీఆర్.. హరీశ్ రావు.. కవితలు ఇష్టారాజ్యంగా మాట్లాడేవారు. అలాంటి పార్టీ ఇప్పుడు ఎన్నికల బరిలోకి కూడా దిగకపోవటంపై కాసింత వివరణ కూడా ఇవ్వరా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

This post was last modified on February 6, 2025 10:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

26 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago