ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి అయితే హైదరాబాద్ పోలీసులు అయితే చలానాలు వేయటం, లేదంటే పెండింగ్ చలానాలు ఉన్న వాహనదారుల్ని ఆపి.. వారి చేత ఫైన్లను క్లియర్ చేస్తుంటారు. కానీ.. బెంగళూరు పోలీసులు కాస్త డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఒక స్కూటర్ మీద ఏకంగా 311 కేసులు నమోదయ్యాయి.
ఇంత భారీగా ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించినప్పటికి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. హెల్మెట్ లేకుండా స్కూటర్ ను నడపటం.. డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ వాడటం.. సిగ్నల్ జంపింగ్.. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. రోడ్డు మీద ఇష్టారాజ్యంగా వాహనాన్ని నడిపే ఈ వ్యక్తి పెరియాస్వామిగా గుర్తించారు. బెంగళూరులోని కలాసిపాల్య ప్రాంతానికి చెందిన ఇతడు ఒక ట్రావెల్ ఏజెన్సీని నడుపుతుంటాడు.
తాను నడిపే స్కూటర్ మీద భారీగా చలానాలు విధిస్తున్న విషయాన్ని గుర్తించలేదు. కానీ.. సదరు వ్యక్తి వాహన చలానాల్ని ఏడాదిగా గమనిస్తున్న ఒక స్థానికుడు మాత్రం సదరు బైక్ ను పోలీసులు ఇంకా ఎందుకు సీజ్ చేయలేదంటూ ప్రశ్నిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. తన వాదనకు సాక్ష్యంగా చలానాలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను జత చేశాడు. ఈ పోస్టు మీద బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా నిద్ర లేచారు.
సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన స్కూటర్ మీద 311 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు ఉన్నట్లుగా గుర్తించి.. వెంటనే సదరు వాహనం గురించి ఆరా తీశారు. అదే సమయంలో.. వందలాది చలానాల ప్రింట్ తీయటంతో అది కాస్తా 20 మీటర్ల పొడవు వచ్చింది. మొత్తం చలానాల మీద విధించిన ఫైన్ మొత్తం రూ.1,61,500గా తేల్చారు. రికార్డు స్థాయిలో కేసులు నమోదైన స్కూటర్ ను వాయు వేగంతో సీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. సదరు వాహనదారుడు పోలీసులను సైతం విస్మయానికి గురి చేశాడు. స్కూటర్ విలువ కంటే ఎక్కువగా ఉన్న చలానాల్ని క్లియర్ చేసేసి.. బైక్ ను తీసుకెళ్లేందుకు స్టేషన్ కు వచ్చాడు. అయితే.. అతనికి స్కూటర్ బండి తాళాలు ఇచ్చే వేళలో.. ట్రాఫిక్ నిబంధనల్ని కచ్ఛితంగా పాటిస్తానని మాట ఇచ్చినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 6, 2025 10:16 am
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…