అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం గురించి విన్నోళ్లంతా ‘వావ్’ అనకుండా ఉండలేకపోతున్నారు. అంతేకాదు.. భర్తను రక్షించేందుకు పెద్ద సాహసమే చేసిందా భార్య. ఇంతకూ ఆమె వయసు ఎంతో తెలుసా? అక్షరాల 56 ఏళ్లను. భర్త కోసం సదరు భార్య పడిన తపన.. అందుకోసం తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా చేసిన ప్రయత్నం గురించి తెలిస్తే ఆమెను అభినందించకుండా ఉండలేం.
ఈ ఆసక్తికర సంఘటన కేరళలో చోటు చేసుకుంది. ఎర్నాకుళం జిల్లా పిరవమ్ పట్టణంలో జరిగింది. తమ పెరట్లో ఉన్న మిరియాల చెట్టు మీదకు ఎక్కిన 64 ఏళ్ల రమేవన్.. మిరియాల్ని తీస్తుండగా ప్రమాదవశాత్తు.. చెట్టు కొమ్మ విరగటంతో చెట్టు పక్కనే ఉన్న 40 అడుగుల బావిలో పడిపోయారు. అంత ఎత్తునుంచి అంత లోతులోకి పడిపోయిన భర్తను చూసిన ఆయన భార్య పద్మ ఒక్కసారి షాక్ తిన్నారు.
ఇలాంటి ఘటనే మరెక్కడైనా జరిగితే.. భయంతో కేకలు వేయటం.. సాయం కోసం అడగటం లాంటివి చేస్తుంటారు. కానీ.. 56 ఏళ్ల పద్మ మాత్రం అలా చేయలేదు. యుద్ధంలో స్ప్రహ కోల్పోయిన శ్రీక్రిష్ణుడ్ని రక్షించుకోవటం కోసం సత్యభామ ఎలా అయితే తానే విల్లు పట్టి నరకాసురుడ్ని సంహరించిందో.. సరిగ్గా అలాంటి ధైర్య సాహసాల్నే ప్రదర్శించారు.
ఒక తాడు సాయంతో వెంటనే బావిలోకి దిగిన ఆమె.. అప్పటికే నీట మునిగి స్ర్పహ కోల్పోయే పరిస్థితుల్లో ఉన్న భర్తను దాదాపు 20 నిమిషాల పాటు అలానే ఒడిసి పట్టుకొని..అందరికి వినిపించేలా గట్టిగా కేకలు వేయటం మొదలు పెట్టింది. ఆమె అరుపుల్ని విన్న చుట్టుపక్కల వారు జరిగిన విషయాన్ని పోలీసులకు.. ఫైర్ శాఖకు చెప్పటంతో వారు రంగంలోకి దిగారు. భారీ వల సాయంతో వారిద్దరిని బయటకు తీశారు.
బయటకు క్షేమంగా వచ్చిన రమేశన్ షాక్ కు గురయ్యారు. గాయాలతో ఉన్న ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. 56 ఏళ్ల వయసులో భర్త క్షేమం కోసం అంత పెద్ద సాహసం చేసిన పద్మను అందరూ అభినందిస్తున్నారు. ఏమైనా.. భర్త కోసం పురుణాల్లో సత్యభామ ధనస్సు పడితే.. ఈ కాలంలో భర్తను సేవ్ చేయటానికే 40అడుగుల లోతు బావిలో దిగటం గ్రేట్ అంటే గ్రేట్ అని చెప్పక తప్పదు.
This post was last modified on February 6, 2025 10:23 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…