అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం గురించి విన్నోళ్లంతా ‘వావ్’ అనకుండా ఉండలేకపోతున్నారు. అంతేకాదు.. భర్తను రక్షించేందుకు పెద్ద సాహసమే చేసిందా భార్య. ఇంతకూ ఆమె వయసు ఎంతో తెలుసా? అక్షరాల 56 ఏళ్లను. భర్త కోసం సదరు భార్య పడిన తపన.. అందుకోసం తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా చేసిన ప్రయత్నం గురించి తెలిస్తే ఆమెను అభినందించకుండా ఉండలేం.
ఈ ఆసక్తికర సంఘటన కేరళలో చోటు చేసుకుంది. ఎర్నాకుళం జిల్లా పిరవమ్ పట్టణంలో జరిగింది. తమ పెరట్లో ఉన్న మిరియాల చెట్టు మీదకు ఎక్కిన 64 ఏళ్ల రమేవన్.. మిరియాల్ని తీస్తుండగా ప్రమాదవశాత్తు.. చెట్టు కొమ్మ విరగటంతో చెట్టు పక్కనే ఉన్న 40 అడుగుల బావిలో పడిపోయారు. అంత ఎత్తునుంచి అంత లోతులోకి పడిపోయిన భర్తను చూసిన ఆయన భార్య పద్మ ఒక్కసారి షాక్ తిన్నారు.
ఇలాంటి ఘటనే మరెక్కడైనా జరిగితే.. భయంతో కేకలు వేయటం.. సాయం కోసం అడగటం లాంటివి చేస్తుంటారు. కానీ.. 56 ఏళ్ల పద్మ మాత్రం అలా చేయలేదు. యుద్ధంలో స్ప్రహ కోల్పోయిన శ్రీక్రిష్ణుడ్ని రక్షించుకోవటం కోసం సత్యభామ ఎలా అయితే తానే విల్లు పట్టి నరకాసురుడ్ని సంహరించిందో.. సరిగ్గా అలాంటి ధైర్య సాహసాల్నే ప్రదర్శించారు.
ఒక తాడు సాయంతో వెంటనే బావిలోకి దిగిన ఆమె.. అప్పటికే నీట మునిగి స్ర్పహ కోల్పోయే పరిస్థితుల్లో ఉన్న భర్తను దాదాపు 20 నిమిషాల పాటు అలానే ఒడిసి పట్టుకొని..అందరికి వినిపించేలా గట్టిగా కేకలు వేయటం మొదలు పెట్టింది. ఆమె అరుపుల్ని విన్న చుట్టుపక్కల వారు జరిగిన విషయాన్ని పోలీసులకు.. ఫైర్ శాఖకు చెప్పటంతో వారు రంగంలోకి దిగారు. భారీ వల సాయంతో వారిద్దరిని బయటకు తీశారు.
బయటకు క్షేమంగా వచ్చిన రమేశన్ షాక్ కు గురయ్యారు. గాయాలతో ఉన్న ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. 56 ఏళ్ల వయసులో భర్త క్షేమం కోసం అంత పెద్ద సాహసం చేసిన పద్మను అందరూ అభినందిస్తున్నారు. ఏమైనా.. భర్త కోసం పురుణాల్లో సత్యభామ ధనస్సు పడితే.. ఈ కాలంలో భర్తను సేవ్ చేయటానికే 40అడుగుల లోతు బావిలో దిగటం గ్రేట్ అంటే గ్రేట్ అని చెప్పక తప్పదు.
This post was last modified on February 6, 2025 10:23 am
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…
ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…