Political News

ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పాలుపంచుకున్నారు. మంగళవారం నాటి లోక్ సభ సమావేశాల్లో భాగంగా తనకు అవకాశం రాగా… మిథున్ రెడ్డి సుదీర్ఘంగానే ప్రసంగించారు. ఈ సందర్భంగా రాస్ట్రపతి ప్రస్తావించిన పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన కీలక అంశాలను లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల ప్రాజెక్టు లక్ష్యం నెరవేరదని తెలిపారు. ఎత్తు తగ్గింపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇక్కడిదాకా బాగానే ఉన్నా…ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని రద్దు చేసిన విషయాన్ని మిథున్ రెడ్డి ప్రస్తావించారు. అంతేకాకుండా తమ పార్టీ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన సీబీఎస్ఈని కూడా రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు పేద పిల్లలకు విద్యనందించే సర్కారీ బడుల్లో వైసీపీ ప్రభుత్వం భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. అయితే ఇప్పుడు అధికారం చేపట్టిన కూటమి సర్కారు ఆంగ్ల మాధ్యమంతో పాటుగా సీబీఎస్ఈని రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద పిల్లల ఉజ్వల భవిష్యత్తును దృస్టిలో పెట్టుకుని తక్షణమే ఏపీలోని సర్కారీ బడుల్లో ఆంగ్ల మాధ్యమం, సీబీఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

మిథున్ రెడ్డి ప్రసంగం విన్నంతనే…ఆయన తీరుపై సెటైర్ల వర్షం మొదలైపోయింది. ఏ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించాలో కూడా తెలియని మీరు ఎంపీ ఎలా అయ్యారంటూ ఆయనను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయినా ఏపీలో ఎలాంటి విద్యను అందించాలన్నది అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించిన విషయం. దాని గురించి పార్లమెంటులో ప్రస్తావిస్తే ఏం లాభం అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఏపీ అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలను పార్లమెంటులో ప్రస్తావించిన లోక్ సభ విలువైన సమయాన్ని మిథున్ రెడ్డి వృథా చేస్తున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.

ఏపీలో అసెంబ్లీలో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్న సాకుతో అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లుగా జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను ప్రకటించినట్లుగానే జగన్ తనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా చేస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన మిథున్ రెడ్డి… అసెంబ్లీ అయితేనేం… పార్లమెంటు అయితేనేం… ఏపీ విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల గురించి ప్రస్తావిస్తే సరిపోలా అన్నకోణంలో ఈ అంశాన్ని లోక్ సభలో ప్రస్తావించారన్న కోణంలో సెటైర్లు పడుతున్నాయి.

This post was last modified on February 4, 2025 9:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

1 hour ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

3 hours ago

30 కోట్ల‌తో సీనియ‌ర్ నిర్మాత సాహ‌సం

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ కాలంగా నిర్మాత‌గా ఉన్నారు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు. 90వ ద‌శ‌కంలోనే దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబు…

3 hours ago

రౌడీ కోసం నాని వస్తే… అంత విశేషమా?

ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…

5 hours ago

తమిళంలో అదరగొట్టిన చంద్రబాబు

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…

5 hours ago

ధనుష్ కూడా ఇలా చేస్తే ఎలా?

పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా.. చాలా కష్టపడి స్టార్‌గా ఎదిగిన నటుడు ధనుష్. అతణ్ని చూడగానే సాధారణ మధ్యతరగతి మనిషిలానే అనిపిస్తుంది…

11 hours ago