తెగించినోడికి తెడ్డే లింగం! కానీ, అన్నా.. ఏదైదే అదేజరుగుతుంది!– తాజాగా కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ అసమ్మతి నాయకుడు, వైసీపీ సానుకూల నేత వల్లభనేని చేసిన వ్యాఖ్యలు ఇవేనని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒక్కసారిగా ఆయన ఇంత మాట ఎందుకు అన్నారు? నిన్నమొన్నటి వరకు అందరినీ కలుపుకొని వెళ్తానని చెప్పిన వంశీలో మారిన వైఖరి ఏంటి? ఇప్పుడు అందరి ఆలోచింప చేస్తున్న ప్రశ్నలు ఇవి. వరుస విజయాలతో టీడీపీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వంశీకి కమ్మ వర్గం మంచి పేరుంది.
టీడీపీలోని కమ్మలు ఆయనకు ఇప్పటికీ సానుకూలంగానే ఉన్నారు. ఆయన కూడా పార్టీని విమర్శించ లేదు. కేవలం చంద్రబాబు తన కుమారుడు లోకేష్ను బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. పరుష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఇదిలావుంటే, వైసీపీలోకి వంశీ రావడం దగ్గర నుంచి ఆయనపై విరుచుకుపడుతున్న వైసీపీనాయకులు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు.. వంశీ విషయంలో దూకుడు ప్రదర్శించాలని భావిస్తున్నారు. ఈ విషయంలో జగన్ వారికి నచ్చజెప్పినా.. వినిపించుకునే పరిస్థితిలో లేరు. గన్నవరం ఇంచార్జ్గా వంశీ తనను తాను ప్రకటించుకోవడం, కార్యక్రమాలు నిర్వహించడం వంటివి వీరికి అస్సలు ఇష్టం లేదు.
ఈ నేపథ్యంలో పైకి బాగానే ఉన్నామని సంకేతాలు ఇస్తూనే.. వంశీకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నట్టు సోషల్ మీడియాకు లీకులు ఇస్తున్నారు. అంటే.. వంశీ విషయంలో రేపు రాజకీయ ఒత్తిడి వచ్చి.. వైసీపీ అధినేత జగన్ ఆయనతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్తే.. పట్టుబట్టి ఓడించాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అవసరమైతే.. టీడీపీ నేతలతో కూడా చేతులు కలిపి.. వంశీని ఓడించాలని, ఆయన దూకుడుకు కళ్లెం వేయాలని నేతలు భావిస్తున్నారట.
ఆయా విషయాలపై సమాచారం అందుకున్న వంశీ.. ఏకం కానీ.. చూద్దాం. వాళ్లో నేనో తేలిపోతుంది. లాస్ట్ టైమ్ ఎన్నికల్లోనూ ఇలానే చేశారు. ఏం పీకారు? అని వ్యాఖ్యానించారు. దీంతో వంశీ ఇక, తెగించేసినట్టేనని అంటున్నారు పరిశీలకులు. ఆయన గెలుపు ఖాయమేనని, సానుభూతిపరులు బాగానే ఉన్నారని. అయితే, మెజారిటీ తగ్గితే తగ్గవచ్చని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…