పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాలు చేశారు. ఈ సమావేశానికి ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు హాజరయ్యారు. వీరిలో బీద మస్తాన్ రావు(టీడీపీ), వల్లభనేని బాలశౌరి(జనసేన), పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి(వైసీపీ) ఉన్నారు. ఏపీ తరఫున ఈ సమావేశానికి హాజరైన ఈ ముగ్గురిని చూసినంతనే ఏపీ జనం వారి మార్గాలపై ఆసక్తికర పయనాల గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల దాకా ఈ ముగ్గురు కూడా వైసీపీ నేతలుగానే కొనసాగారు. అంతేకాకుండా వైసీపీ తరఫున ఈ ముగ్గురు ఎంపీలుగానే కొనసాగారు. అంతేకాదండోయ్… నాడు వీరు ఏఏ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించారో ఇప్పుడు కూడా అవే ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ముర్గురి దారులు మాత్రం వేరు అయిపోయాయి. దానిపైనే ఏపీ జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. రాజంపేట నుంచి హ్యాట్రిక్ విజయాలు అందుకున్నఆయన ఆది నుంచి వైసీపీలోనే ఉన్నారు. మూడు పర్యాయాలు కూడా ఆయన రాజంపేట నుంచే విజయం సాధించారు. ఇక టీడీపీ తరఫున భేటీకి హాజరైన బీద మస్తాన్ రావు మొన్నటిదాకా వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అయితే సార్వత్రిక ఎన్నికల తర్వాత మోపిదేవి,వెంకటరమణ, ఆర్.కృష్ణయ్యలతో కలిసి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి… రాజ్యసభలో తన రాజీనామాతో ఖాళీ అయిన సీటునే ఆయన తిరిగీ దక్కించుకున్నారు.
ఇక వల్లభనేని బాలశౌరి కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం ఎంపీగా కొనసాగుతున్నారు. 2019లోనూ ఆయన ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. అయితే నాడు ఆయన వైసీపీ అభ్యర్థిగా గెలవగా… మొన్నటి ఎన్నికల్లో జనసేన తరఫున అదే స్థానం నుంచి పోటీ చేసి వరుసగా రెండో సారి విజయం సాధించారు. ఇదిలా ఉంటే… అటు వైసీపీ, ఇటు జనసేనతో పాటుగా…గతంలో ఓ సారి టీడీపీ తరఫున కూడా బాలశౌరి మచిలీపట్నం నుంచే ఎంపీగా గెలిచారు. ఇలా మొన్నటిదాకా ఒకే పార్టీలో సాగిన ఈ ముగ్గురు మూడు వేర్వేరు పార్టీల తరఫున భేటీకి హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు.
This post was last modified on January 30, 2025 12:30 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…