పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాలు చేశారు. ఈ సమావేశానికి ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు హాజరయ్యారు. వీరిలో బీద మస్తాన్ రావు(టీడీపీ), వల్లభనేని బాలశౌరి(జనసేన), పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి(వైసీపీ) ఉన్నారు. ఏపీ తరఫున ఈ సమావేశానికి హాజరైన ఈ ముగ్గురిని చూసినంతనే ఏపీ జనం వారి మార్గాలపై ఆసక్తికర పయనాల గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల దాకా ఈ ముగ్గురు కూడా వైసీపీ నేతలుగానే కొనసాగారు. అంతేకాకుండా వైసీపీ తరఫున ఈ ముగ్గురు ఎంపీలుగానే కొనసాగారు. అంతేకాదండోయ్… నాడు వీరు ఏఏ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించారో ఇప్పుడు కూడా అవే ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ముర్గురి దారులు మాత్రం వేరు అయిపోయాయి. దానిపైనే ఏపీ జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. రాజంపేట నుంచి హ్యాట్రిక్ విజయాలు అందుకున్నఆయన ఆది నుంచి వైసీపీలోనే ఉన్నారు. మూడు పర్యాయాలు కూడా ఆయన రాజంపేట నుంచే విజయం సాధించారు. ఇక టీడీపీ తరఫున భేటీకి హాజరైన బీద మస్తాన్ రావు మొన్నటిదాకా వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అయితే సార్వత్రిక ఎన్నికల తర్వాత మోపిదేవి,వెంకటరమణ, ఆర్.కృష్ణయ్యలతో కలిసి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి… రాజ్యసభలో తన రాజీనామాతో ఖాళీ అయిన సీటునే ఆయన తిరిగీ దక్కించుకున్నారు.
ఇక వల్లభనేని బాలశౌరి కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం ఎంపీగా కొనసాగుతున్నారు. 2019లోనూ ఆయన ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. అయితే నాడు ఆయన వైసీపీ అభ్యర్థిగా గెలవగా… మొన్నటి ఎన్నికల్లో జనసేన తరఫున అదే స్థానం నుంచి పోటీ చేసి వరుసగా రెండో సారి విజయం సాధించారు. ఇదిలా ఉంటే… అటు వైసీపీ, ఇటు జనసేనతో పాటుగా…గతంలో ఓ సారి టీడీపీ తరఫున కూడా బాలశౌరి మచిలీపట్నం నుంచే ఎంపీగా గెలిచారు. ఇలా మొన్నటిదాకా ఒకే పార్టీలో సాగిన ఈ ముగ్గురు మూడు వేర్వేరు పార్టీల తరఫున భేటీకి హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు.
This post was last modified on January 30, 2025 12:30 pm
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…