పోలవరం ప్రాజెక్టు… ఎవరు ఔనన్నా, కాదన్నా…ఏపీకి జీవనాడే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సత్యాన్ని గ్రహించిన నేత పవర్ లో ఉంటే… పోలవరం పనులు ఎలా సాగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులు అచ్చు గుద్దినట్టు అలాగే పరుగులు పెడుతున్నాయి. 50 ఏళ్ల తర్వాతి పరిస్థితులను కూడా అంచనా వేయగలిగిన విజనరీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎంగా ఉండగా.. పోలవరం పనులు మందకోడిగా జరుగుతాయని ఎలా అనుకుంటాం?
నిజమే.. తనదైన శైలి విజన్ తో అద్భుతాలు సృష్టిస్తున్న చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ పోలవరం పనులను పరుగులు పెట్టిస్తోంది. 7 నెలల క్రితం రెండోసారి అధికారం చేపట్టిన చంద్రబాబు… వచ్చీరాగానే పోలవరం పనులపై దృష్టి సారించారు. అంతేకాకుండా గత ప్రభుత్వం పోలవరంలో చేసిన విధ్వంస రచనను కూడా అంచనా వేసిన చంద్రబాబు ఈ దఫా అలాంటి ముప్పు పోలవరానికి ఎదురు కాకూడదని తీర్మానించుకున్నారు. ఆ దిశగానే పకడ్బందీగా ప్రణాళికలు రచించారు. ఈ ప్రాణాళికలను నిర్దేశిత సమయంలోగానే అమలులోకి తీసుకువచ్చారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి మాసంలో పోలవరంలో కీలకమైన డయాఫ్రం వాల్ పనులను చేపడతామని గతంలో ప్రకటించిన చంద్రబాబు.. ఆ మాట మేరకే జనవరిలోనే డయాఫ్రం వాల్ పనులను మొదలు పెట్టించారు. ప్రస్తుతం డయాఫ్రం వాల్ పనులు అక్కడ శరవేగంగా జరుగుతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు సాగుతున్నాయి. డయాఫ్రం వాల్ నిర్మాణం నిర్ణీత దశ వరకు పూర్తి కాగానే… దానికి సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు చేపట్టాలని కూడా చంద్రబాబు ఇదివరకే నిర్ణయించారు. ఆ మాట మేరకే ఇప్పుడు డయాఫ్రం వాల్ నిర్మాణం నిర్దేశిత దశకు చేరువలో ఉన్నట్లు సమాచారం. ఈ దశకు డయాఫ్రం వాల్ రాగానే… వెనువెంటనే దానికి సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ప్రారంభించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరిగిపోయాయి.
This post was last modified on January 29, 2025 11:32 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…