మంత్రి నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని ఇటీవల కొందరు టీడీపీ నేతలు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అదే సమయంలో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నామంటూ జనసేన నేతలు కొందరు వ్యాఖ్యానించారు.
అయితే, ఆ తర్వాత ఇరు పార్టీల హై కమాండ్ ఆ వ్యవహారాల గురించి మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేయడంతో ఆ ఇష్యూ సద్దుమణిగింది. ఈ క్రమంలోనే తాజాగా సీఎం పదవిపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ నేతలు అనడం సరికాదని గోరంట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, చంద్రబాబు ఉన్నంత కాలం ఆయనే సీఎం అని గోరంట్ల తేల్చేశారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారని, అటువంటప్పుడు లోకేష్ కు ఎందుకు ఇవ్వడం అని గోరంట్ల ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అని ప్రతిపాదించామని గుర్తు చేశారు. పార్టీని బ్రతికించుకోవడం కోసం కష్టపడ్డ లోకేశ్ కు సముచిత స్థానం ఇప్పటికే దక్కిందని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం ఆయనే సీఎం అని అన్నారు. మధ్యలో అనవసరమైన వివాదాల జోలికి వెళ్లడం నాయకులకు మంచిది కాదని హితవు పలికారు.
ఇక, విజయసాయిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారంపై గోరంట్ల స్పందించారు. అటువంటి వ్యక్తిని ఎన్డీఏ కూటమిలోని ఏ పార్టీ చేర్చుకోదని తాను భావిస్తున్నానని గోరంట్ల చెప్పారు. విశాఖ కేంద్రంగా విజయసాయి వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడని, అనేక సంస్థలను మోసం చేసి, కబ్జాలు చేసి వేల కోట్లు సంపాదించాడని ఆరోపించారు.
ఆ మొత్తాన్ని రికవరీ చేసి ప్రభుత్వానికి అప్పగించాలని అన్నారు. ఇక, కాకినాడ సీ పోర్టు అల్లుడికి అప్పగించాడని, విజయసాయికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఆనాడు..ఈనాడు విజయసాయి రెండో ముద్దాయి అని, జగన్ మొదటి ముద్దాయి అని చెప్పారు.
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…