మంత్రి నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని ఇటీవల కొందరు టీడీపీ నేతలు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అదే సమయంలో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నామంటూ జనసేన నేతలు కొందరు వ్యాఖ్యానించారు.
అయితే, ఆ తర్వాత ఇరు పార్టీల హై కమాండ్ ఆ వ్యవహారాల గురించి మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేయడంతో ఆ ఇష్యూ సద్దుమణిగింది. ఈ క్రమంలోనే తాజాగా సీఎం పదవిపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ నేతలు అనడం సరికాదని గోరంట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, చంద్రబాబు ఉన్నంత కాలం ఆయనే సీఎం అని గోరంట్ల తేల్చేశారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారని, అటువంటప్పుడు లోకేష్ కు ఎందుకు ఇవ్వడం అని గోరంట్ల ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అని ప్రతిపాదించామని గుర్తు చేశారు. పార్టీని బ్రతికించుకోవడం కోసం కష్టపడ్డ లోకేశ్ కు సముచిత స్థానం ఇప్పటికే దక్కిందని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం ఆయనే సీఎం అని అన్నారు. మధ్యలో అనవసరమైన వివాదాల జోలికి వెళ్లడం నాయకులకు మంచిది కాదని హితవు పలికారు.
ఇక, విజయసాయిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారంపై గోరంట్ల స్పందించారు. అటువంటి వ్యక్తిని ఎన్డీఏ కూటమిలోని ఏ పార్టీ చేర్చుకోదని తాను భావిస్తున్నానని గోరంట్ల చెప్పారు. విశాఖ కేంద్రంగా విజయసాయి వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడని, అనేక సంస్థలను మోసం చేసి, కబ్జాలు చేసి వేల కోట్లు సంపాదించాడని ఆరోపించారు.
ఆ మొత్తాన్ని రికవరీ చేసి ప్రభుత్వానికి అప్పగించాలని అన్నారు. ఇక, కాకినాడ సీ పోర్టు అల్లుడికి అప్పగించాడని, విజయసాయికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఆనాడు..ఈనాడు విజయసాయి రెండో ముద్దాయి అని, జగన్ మొదటి ముద్దాయి అని చెప్పారు.
This post was last modified on January 28, 2025 6:05 pm
తెలుగు నేల విభజన తర్వాత రాజధాని లేకుండానే ఆంధ్ర ప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. ఓ వైపు రాజధాని లేమి,…
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…
మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ…
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…