మంత్రి నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని ఇటీవల కొందరు టీడీపీ నేతలు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అదే సమయంలో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నామంటూ జనసేన నేతలు కొందరు వ్యాఖ్యానించారు.
అయితే, ఆ తర్వాత ఇరు పార్టీల హై కమాండ్ ఆ వ్యవహారాల గురించి మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేయడంతో ఆ ఇష్యూ సద్దుమణిగింది. ఈ క్రమంలోనే తాజాగా సీఎం పదవిపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ నేతలు అనడం సరికాదని గోరంట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, చంద్రబాబు ఉన్నంత కాలం ఆయనే సీఎం అని గోరంట్ల తేల్చేశారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారని, అటువంటప్పుడు లోకేష్ కు ఎందుకు ఇవ్వడం అని గోరంట్ల ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అని ప్రతిపాదించామని గుర్తు చేశారు. పార్టీని బ్రతికించుకోవడం కోసం కష్టపడ్డ లోకేశ్ కు సముచిత స్థానం ఇప్పటికే దక్కిందని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం ఆయనే సీఎం అని అన్నారు. మధ్యలో అనవసరమైన వివాదాల జోలికి వెళ్లడం నాయకులకు మంచిది కాదని హితవు పలికారు.
ఇక, విజయసాయిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారంపై గోరంట్ల స్పందించారు. అటువంటి వ్యక్తిని ఎన్డీఏ కూటమిలోని ఏ పార్టీ చేర్చుకోదని తాను భావిస్తున్నానని గోరంట్ల చెప్పారు. విశాఖ కేంద్రంగా విజయసాయి వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడని, అనేక సంస్థలను మోసం చేసి, కబ్జాలు చేసి వేల కోట్లు సంపాదించాడని ఆరోపించారు.
ఆ మొత్తాన్ని రికవరీ చేసి ప్రభుత్వానికి అప్పగించాలని అన్నారు. ఇక, కాకినాడ సీ పోర్టు అల్లుడికి అప్పగించాడని, విజయసాయికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఆనాడు..ఈనాడు విజయసాయి రెండో ముద్దాయి అని, జగన్ మొదటి ముద్దాయి అని చెప్పారు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…