రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి, ‘మాస్ రాజా’ అనే ట్యాగ్ను కూడా పక్కన పెట్టి చేసిన సినిమా.. భర్త మహాశయులకు విజ్ఞప్తి. ‘నేను శైలజ’ దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజైంది. ఐతే రివ్యూలు, టాక్ యావరేజ్గా రాగా.. ఫలితం కూడా అందుకు తగ్గట్లే వచ్చింది.
సంక్రాంతి పండుగ అడ్వాంటేజ్ను ఓమాదిరిగా ఉపయోగించుకున్న ఈ మూవీ.. రవితేజ గత చిత్రాలతో పోలిస్తే కొంచెం మెరుగైన ఫలితాన్ని అందుకుంది. ఐతే మిగతా సంక్రాంతి సినిమాలన్నీ గత నెలలోనే ఓటీటీలోకి వచ్చేయగా.. రవితేజ మూవీ మాత్రం ఇంకా డిజిటల్ ప్రేక్షకులను పలకరించలేదు. థియేటర్లలో సినిమాను మిస్సయిన వాళ్లు.. ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తుంటే అది ఎంతకీ స్ట్రీమింగ్కు రాలేదు. ఓటీటీ డీల్ విషయంలో ఏదో ఒక సమస్య వల్ల స్ట్రీమింగ్ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఐతే ఇప్పుడు ఆ సమస్య తీరిపోయిందని.. అతి త్వరలోనే ‘భర్త మహాశయులకు’ టీవీ, మొబైల్ ప్రేక్షకులను పకలరించబోతోందని సమాచారం. మార్చి 13 నుంచి జీ5లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించగా.. జీ స్టూడియోస్ కూడా నిర్మాణంలో భాగం పంచుకుంది.
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కంటెంట్ పరంగా యావరేజే కానీ.. ఇందులో కొన్ని హైలైట్లు ఉన్నాయి. రవితేజ తన ఇమేజ్కు భిన్నంగా ఒక సాధారణ భర్త పాత్రలో కనిపించడం.. హీరోయిన్లు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతిల అందచందాలు.. కొన్ని కామెడీ సీన్లు.. పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
ఇదిలా ఉండగా.. సంక్రాంతి తర్వాత తమిళ, తెలుగు భాషల్లో వచ్చిన చిత్రాల్లో ది బెస్ట్ అనదగ్గ ‘విత్ లవ్’ సైతం డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయింది. ఆ చిత్రం మార్చి 6న నెట్ఫ్లిక్స్ ద్వారా డిజిటల్గా రిలీజ్ కాబోతోంది. ఒక విభన్న కథాంశంతో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రం.. ఓటీటీలోకి వచ్చాక మరింత ఆదరణ దక్కించుకోవడం ఖాయం.
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…