అదును చూసుకుని వ్యాపార సంస్థలు తమ నైజాన్ని బయట పెట్టుకుంటాయి. పది రూపాయలు పోగేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఇప్పుడు చమురు విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇరాన్ యుద్ధం సహా పాకిస్థాన్ – అఫ్ఘానిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాలకు చమురు సమస్య తలెత్తే ప్రమాదం పొంచి ఉందని అంతర్జాతీయ పరిణామాలు సూచిస్తున్నాయి.
ముఖ్యంగా భారత్ వంటి అతి పెద్ద జనాభా ఉన్న దేశంలో చమురు వినియోగం తారస్థాయిలో ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ఎక్కువగా వినియోగిస్తున్న దేశాల్లో భారత్ మూడవ స్థానంలో ఉంది. రోజుకు మన దేశంలో సుమారు 55 లక్షల బ్యారెళ్ల చమురును వినియోగిస్తున్నారు. ఇందులో డీజిల్, పెట్రోల్ రెండూ ఉన్నాయి. ఒక్క బ్యారెల్కు 159 లీటర్లు ఉంటాయి. ఆ లెక్కన దేశానికి ఎంత పెద్ద స్థాయిలో చమురు అవసరమో అర్థమవుతుంది.
ఈ డిమాండ్ను తట్టుకునేందుకు భారత్ ప్రపంచ దేశాల నుంచి నిరంతరం చమురును దిగుమతి చేసుకుంటోంది. తాజాగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హోర్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేసినట్టు సమాచారం. దీంతో ఆ మార్గం ద్వారా భారత్కు చేరాల్సిన చమురు నౌకలు నిలిచిపోయాయి.
మరోవైపు రష్యా నుంచి కొనుగోలు చేయాలని అనుకున్నా అమెరికా అధ్యక్షుడి ఆంక్షల నేపథ్యంలో ఆ దిగుమతులను కూడా తగ్గించినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు చమురు సరఫరా విషయంలో భారత్ పునరాలోచనలో పడింది.
ప్రస్తుతం దేశంలో ఉన్న చమురు నిల్వలు దాదాపు పది రోజుల వరకు సరిపోతాయని అంచనా. అత్యవసర నిల్వలను ఉపయోగించినా అవి సుమారు 20 రోజులకే పరిమితం కావచ్చు. అందులోనూ దాదాపు 60 శాతం నిల్వలు రక్షణ అవసరాలకు కేటాయించబడతాయి. దీంతో సాధారణ వినియోగానికి ఎంత చమురు అందుబాటులో ఉంటుంది అన్నది కీలకంగా మారింది.
ఇప్పటికే దేశంలో చమురు నిల్వలపై కలకలం మొదలైంది. ఫలితంగా సాధారణ వస్తువుల నుంచి అన్ని రకాల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రవాణాతో ముడిపడిన ప్రతి వస్తువు ధర పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
This post was last modified on March 2, 2026 11:01 pm
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్…
న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…
ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…
అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ…
దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి ఉద్యమాలు జరుగున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్…