డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏదైనా చెబితే అది జరిగేలా పక్కా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ, ఎందుకో కానీ.. ఆయన చెప్పిన వాటిలో కొన్ని మాత్రమే జరుగుతున్నాయి. వీటిలో కీలకమైంది.. కాకినాడ సీపోర్టులో అప్పట్లో నిలిపి ఉంచిన విదేశీ షిప్పు. ‘సీజ్ ది షిప్’ అని పవన్ ఆదేశించినా.. సీజ్ చేయలేకపోయారు. ఇది ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చగానే ఉంది. ఇక, మరో కీలకమైన ఆదేశం.. రహదారుల బాగుచేత. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రహదారులను ముఖ్యంగా పంచాయతీ స్థాయిలో బాగు చేస్తామన్నారు.
వైసీపీ హయాంలో రహదారులను పట్టించుకోలేదని.. సో.. ఇప్పుడు తాము బాగు చేస్తున్నామని కూడా పవ న్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే గ్రామీణ , పంచాయతీ, గిరిజన ప్రాంతాలకు చెందిన రహదారులను తిరిగి నిర్మించడం లేదా.. బాగు చేయడం.. అసలు లేనిచోట కొత్తవాటిని నిర్మించడం అనే కాన్సెప్టు ను పెట్టుకున్నారు. దీనికి సంబంధించి సంక్రాంతి పండుగను టార్గెట్గా పెట్టుకుని ఇదే ప్రకటన కూడా చేశారు. సంక్రాంతి నాటికి అన్ని పనులు పూర్తి అవుతాయని కూడా ప్రకటించారు.
కానీ, తాజాగా పవన్ కల్యాణ్ చేసిన రివ్యూలో.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పంచాయతీలు, గిరిజన ఆవాసాలు ఉన్న ప్రాంతాల్లో 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. వాస్తవానికి ఆయా రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఈ బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. దీంతో పనులు వేగంగా సాగుతాయని లెక్కలు కూడా వేసుకున్నారు. కానీ, ఇప్పటి వరకు పనులు ముందుకు సాగలేదు. దీంతో పెట్టుకున్న సంక్రాంతి లక్ష్యం పక్కకు తొలగిపోయింది.
దీనిపైనే పవన్ దృష్టి పెట్టారు. ఇచ్చిన నిధులు 2672 కోట్లు.. సరిపోలాదా? లేక.. పనులు ఆగిపోయాయా? ఎవరైనా ఆపారా? అన్నది ఆయన చర్చించారు. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై అధి కారులు ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. కాంట్రాక్టర్ల విషయంలో వారు జోక్యం చేసుకోవడం.. పనుల నిలిపివేత.. సొంతానికి రహదారులు నిర్మించుకోవడం వంటివి వెలుగు చూసినట్టు తెలిసింది. దీనిపై ఆర్ అండ్ బీ అధికారులు పెద్ద నివేదికే ఇచ్చారని తెలిసింది. ఆ వెంటనే ఈ వ్యవహారంపై సీరియస్ అయిన.. పవన్.. సీఎం చంద్రబాబు ముందు పెట్టి సదరు ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on January 24, 2025 9:34 pm
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…