Political News

వైసీపీలో ఉక్కపోత ఈ రేంజిలో ఉందా?

ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి విపక్షంగా మారిన పార్టీల్లో ఉక్కపోతలు ఓ రేంజిలో పోస్తూ ఉంటాయి. ఈ తరహా ఉక్కపోతలను తట్టుకుని నిలిచే నేతలు చాలా తక్కువ మందే ఉంటారు. అయితే ఈ ఉక్కపోతలను తట్టుకుని నిలిచే నేతలూ చాలా మందే ఉంటారు. అయితే ఇలా తట్టుకుని నిలిచే నేతల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఈ పరిణామం ఇటీవలి కాలంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

ఏపీలో వైసీపీ మొన్నటిదాకా అధికార పార్టీ. ఇప్పుడా పార్టీ విపక్షంలోకి మారిపోయింది. ఆ వెంటనే ఆ పార్టీ నుంచి వలసలు మొదలైపోయాయి. వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయ భాను, మోపిదేవి వెంకట రమణ లాంటి వారు కూడా వైసీపీని వీడారు. ఆ వెంటనే వారంతా అటు జనసేనలోనో, లేదంటే ఇటు టీడీపీలోనో చేరిపోయారు. ఈ ముగ్గురు నేతలు జగన్ కే కాకుండా వైఎస్ ఫ్యామిలీకి నమ్మిన బంటుల్లాంటి వారి కిందే లెక్క. ఈ తరహా నేతలు పార్టీని వీడారంటే… పార్టీలో పరిస్థితి ఏ మాదిరిగా ఉందన్న దానిపై ఓ రేంజిలో చర్చ జరుగోతంది.

అయితే తాజాగా చోటుచేసుకున్న పరిణామం,, వైసీపీలో ఉక్కపోత ఏ రేంజిలో ఉందన్న విషయాన్ని ఇట్టే చెప్పేసింది. వైసీపీ అధికార ప్రతినిధిగా కొనసాగిన కారుమూరు రవిచంద్రారెడ్డికి పార్టీలో మంచి పేరుంది. పార్టీ వైఖరిపై స్పష్టమైన అవగాహన కలిగిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. పార్టీ తరఫున టీవీ డీటేట్లకు హాజరయ్యే ఈ రెడ్డి గారు… తన పార్టీ లైన్ ను క్లిస్టర్ క్లియర్ గా వివరించడంతో పాటుగా… వైరి వర్గాలపై తనదైన శైలి సుతిమెత్తటి వాగ్ధాటితో పైచేయి సాధిస్తూ ఉంటారు. పరుష పదజాలం వాడకానికి ఈయన అల్లంత దూరంలో ఉంటారు. సాధువులా కనిపించే ఈయనను ఓడించడంటే… చాలా కష్టమేనని వైరి వర్గాల వారే చెబుతూ ఉంటారు.

అలాంటి రవిచంద్రారెడ్డి ఇప్పుడు ప్లేటు ఫిరాయించేశారు. వైసీపీకి రాజీనామా చేసిన ఈయన వెనువెంటనే బీజేపీలో చేరిపోయారు. పార్టీలో అధికార ప్రతినిధిగా మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన నేత… వైసీపీ అధికారంలో ఉండగా ఓ నామినేటెడ్ పోస్టులోనూ కొనసాగారు. జగన్ కు అత్యంత సన్నిహితుడిగానే పేరున్న రవిచంద్రారెడ్డి.. ఎందుకనో జగన్ కోటరీకి దగ్గర కాలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో ఓ టీవీ డీబేట్ లో సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే వైసీపీ ఓడిందంటూ రవిచంద్రారెడ్డి నోరు జారారట. అప్పటి నుంచి ఆయనను పార్టీ దూరం పెట్టినట్లు సమాచారం. దీనిపై ఎంతగా సర్దుకుందామనుకున్నా కుదరలేదట. దీంతోనే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన… కేవలం గంట వ్యవధిలోనే బీజేపీలో చేరిపోవడం గమనార్హం.

This post was last modified on January 19, 2025 7:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago