Political News

వైసీపీలో ఉక్కపోత ఈ రేంజిలో ఉందా?

ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి విపక్షంగా మారిన పార్టీల్లో ఉక్కపోతలు ఓ రేంజిలో పోస్తూ ఉంటాయి. ఈ తరహా ఉక్కపోతలను తట్టుకుని నిలిచే నేతలు చాలా తక్కువ మందే ఉంటారు. అయితే ఈ ఉక్కపోతలను తట్టుకుని నిలిచే నేతలూ చాలా మందే ఉంటారు. అయితే ఇలా తట్టుకుని నిలిచే నేతల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఈ పరిణామం ఇటీవలి కాలంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

ఏపీలో వైసీపీ మొన్నటిదాకా అధికార పార్టీ. ఇప్పుడా పార్టీ విపక్షంలోకి మారిపోయింది. ఆ వెంటనే ఆ పార్టీ నుంచి వలసలు మొదలైపోయాయి. వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయ భాను, మోపిదేవి వెంకట రమణ లాంటి వారు కూడా వైసీపీని వీడారు. ఆ వెంటనే వారంతా అటు జనసేనలోనో, లేదంటే ఇటు టీడీపీలోనో చేరిపోయారు. ఈ ముగ్గురు నేతలు జగన్ కే కాకుండా వైఎస్ ఫ్యామిలీకి నమ్మిన బంటుల్లాంటి వారి కిందే లెక్క. ఈ తరహా నేతలు పార్టీని వీడారంటే… పార్టీలో పరిస్థితి ఏ మాదిరిగా ఉందన్న దానిపై ఓ రేంజిలో చర్చ జరుగోతంది.

అయితే తాజాగా చోటుచేసుకున్న పరిణామం,, వైసీపీలో ఉక్కపోత ఏ రేంజిలో ఉందన్న విషయాన్ని ఇట్టే చెప్పేసింది. వైసీపీ అధికార ప్రతినిధిగా కొనసాగిన కారుమూరు రవిచంద్రారెడ్డికి పార్టీలో మంచి పేరుంది. పార్టీ వైఖరిపై స్పష్టమైన అవగాహన కలిగిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. పార్టీ తరఫున టీవీ డీటేట్లకు హాజరయ్యే ఈ రెడ్డి గారు… తన పార్టీ లైన్ ను క్లిస్టర్ క్లియర్ గా వివరించడంతో పాటుగా… వైరి వర్గాలపై తనదైన శైలి సుతిమెత్తటి వాగ్ధాటితో పైచేయి సాధిస్తూ ఉంటారు. పరుష పదజాలం వాడకానికి ఈయన అల్లంత దూరంలో ఉంటారు. సాధువులా కనిపించే ఈయనను ఓడించడంటే… చాలా కష్టమేనని వైరి వర్గాల వారే చెబుతూ ఉంటారు.

అలాంటి రవిచంద్రారెడ్డి ఇప్పుడు ప్లేటు ఫిరాయించేశారు. వైసీపీకి రాజీనామా చేసిన ఈయన వెనువెంటనే బీజేపీలో చేరిపోయారు. పార్టీలో అధికార ప్రతినిధిగా మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన నేత… వైసీపీ అధికారంలో ఉండగా ఓ నామినేటెడ్ పోస్టులోనూ కొనసాగారు. జగన్ కు అత్యంత సన్నిహితుడిగానే పేరున్న రవిచంద్రారెడ్డి.. ఎందుకనో జగన్ కోటరీకి దగ్గర కాలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో ఓ టీవీ డీబేట్ లో సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే వైసీపీ ఓడిందంటూ రవిచంద్రారెడ్డి నోరు జారారట. అప్పటి నుంచి ఆయనను పార్టీ దూరం పెట్టినట్లు సమాచారం. దీనిపై ఎంతగా సర్దుకుందామనుకున్నా కుదరలేదట. దీంతోనే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన… కేవలం గంట వ్యవధిలోనే బీజేపీలో చేరిపోవడం గమనార్హం.

This post was last modified on January 19, 2025 7:59 am

Share

Recent Posts

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

9 minutes ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

13 minutes ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

53 minutes ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

4 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

4 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

5 hours ago