నరేంద్ర మోదీ… భారత ప్రధాన మంత్రి మాత్రమే కాదు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వరల్డ్ మోస్ట్ పవర్ ఫుల్ నేత కూడా. దాదాపుగా అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో అత్యథిక సంఖ్యలో ఫాలోవర్లను కలిగిన నేతగా ఇప్పటికే మోదీ రికార్డులకెక్కారు. తాజాగా ఆ సోషల్ మీడియా ఖాతాల ద్వారా… ప్రత్యేకించి యూట్యూబ్ ద్వారా అత్యథిక ఆదాయాన్ని పొందుతూ కూడా మోదీ సరికొత్త రికార్డులను నెలకొల్పారు.
వ్యక్తిగత ఖాతా కేటగిరీలో మోదీ యూట్యూబ్ ఛానెల్ ఒక్క నెలకు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అయితే మోదీ ఈ ఛానెల్ ను ఏదో ఆదాయ ఆర్జన కోసం ప్రారంభించినది కాదు కదా. అయినప్పటికీ… నెలకు కోట్లాది రూపాయలను సదరు ఛానెల్ మోదీకి సంపాదించి పెడుతోంది.
అయినా మోదీ యూట్యూబ్ ఛానెల్ ఏ మేర సంపాదిస్తుందన్న విషయంలోకి వెళితే… నెలకు హీన పక్షం 1.86 లక్షల డాలర్లను సంపాదిస్తున్న ఈ ఛానెల్… అత్యధికంగా 5.67 లక్షల డాలర్ల దాకా సంపాదిస్తోందట. ఈ ఆదాయాన్ని మన ఇండియన్ కరెన్సీలోకి మార్చి చూస్తే…
మోదీ ఛానెల్ ఆదాయం నెలకు రూ.1.62 కోట్ల నుంచి రూ.4.88 కోట్ల దాకా ఉంటుంది. ఈ ఛానెల్ లో ఇప్పటిదాకా 29,272 వీడియోలను అప్ లోడ్ చేయగా… మొత్తంగా 636 కోట్ల వ్యూస్ వచ్చాయి. వీటిలో ఒక్కో వీడియో ఏకంగా 40 వేలకు పైగా వ్యూస్ సాధిస్తున్నాయి. సగటున ఒక్కో వీడియో 20 వేల వ్యూస్ దాకా సాధిస్తున్నట్లు అంచనా.
ఇక ఈ ఛానెల్ గురించిన మరిన్ని వివరాల్లోకి వెళితే.. 2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ తన యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించారు. తన అధికారిక కార్యక్రమాలను ప్రసారం చేసేుందకే మోదీ ఈ ఛానెల్ ను ప్రారంభించారట. 2014లో భారత ప్రధాని అయిన తర్వాత కూడా తన ఛానెల్ ను మోదీ కొనసాగించారు.
ప్రస్తుతం ఈ ఛానెల్ కు 2 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇంకా కొత్తగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతూనే ఉందని సమాచారం. ఈ స్థాయిలో యూట్యూబ్ సబ్ స్క్రైబర్లు ఉన్న రాజకీయ నేత విశ్వవ్యాప్తంగా ఏ ఒక్కరూ లేరు. యూట్యూట్ సబ్ స్క్రైబర్ల సంఖ్యలో మోదీ తర్వాత బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనార్ ఉన్నారు.
ఈయన ఛానెల్ కు ఉన్న సబ్ స్క్రైబర్ల సంఖ్య కేవలం 60 లక్షలే. మోదీ ఛానెల్ కు ఉన్న సబ్ స్క్రైబర్ల సంఖ్యలో పోలిస్తే… ఈ సంఖ్య నాలుగో వంతే. మోదీ చానెల్ లో ప్రతీ వారం కనీసం 19 వీడియోలో అప్ లోడ్ అవుతున్నాయట.
This post was last modified on January 11, 2025 7:17 pm
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…