నరేంద్ర మోదీ… భారత ప్రధాన మంత్రి మాత్రమే కాదు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వరల్డ్ మోస్ట్ పవర్ ఫుల్ నేత కూడా. దాదాపుగా అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో అత్యథిక సంఖ్యలో ఫాలోవర్లను కలిగిన నేతగా ఇప్పటికే మోదీ రికార్డులకెక్కారు. తాజాగా ఆ సోషల్ మీడియా ఖాతాల ద్వారా… ప్రత్యేకించి యూట్యూబ్ ద్వారా అత్యథిక ఆదాయాన్ని పొందుతూ కూడా మోదీ సరికొత్త రికార్డులను నెలకొల్పారు.
వ్యక్తిగత ఖాతా కేటగిరీలో మోదీ యూట్యూబ్ ఛానెల్ ఒక్క నెలకు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అయితే మోదీ ఈ ఛానెల్ ను ఏదో ఆదాయ ఆర్జన కోసం ప్రారంభించినది కాదు కదా. అయినప్పటికీ… నెలకు కోట్లాది రూపాయలను సదరు ఛానెల్ మోదీకి సంపాదించి పెడుతోంది.
అయినా మోదీ యూట్యూబ్ ఛానెల్ ఏ మేర సంపాదిస్తుందన్న విషయంలోకి వెళితే… నెలకు హీన పక్షం 1.86 లక్షల డాలర్లను సంపాదిస్తున్న ఈ ఛానెల్… అత్యధికంగా 5.67 లక్షల డాలర్ల దాకా సంపాదిస్తోందట. ఈ ఆదాయాన్ని మన ఇండియన్ కరెన్సీలోకి మార్చి చూస్తే…
మోదీ ఛానెల్ ఆదాయం నెలకు రూ.1.62 కోట్ల నుంచి రూ.4.88 కోట్ల దాకా ఉంటుంది. ఈ ఛానెల్ లో ఇప్పటిదాకా 29,272 వీడియోలను అప్ లోడ్ చేయగా… మొత్తంగా 636 కోట్ల వ్యూస్ వచ్చాయి. వీటిలో ఒక్కో వీడియో ఏకంగా 40 వేలకు పైగా వ్యూస్ సాధిస్తున్నాయి. సగటున ఒక్కో వీడియో 20 వేల వ్యూస్ దాకా సాధిస్తున్నట్లు అంచనా.
ఇక ఈ ఛానెల్ గురించిన మరిన్ని వివరాల్లోకి వెళితే.. 2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ తన యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించారు. తన అధికారిక కార్యక్రమాలను ప్రసారం చేసేుందకే మోదీ ఈ ఛానెల్ ను ప్రారంభించారట. 2014లో భారత ప్రధాని అయిన తర్వాత కూడా తన ఛానెల్ ను మోదీ కొనసాగించారు.
ప్రస్తుతం ఈ ఛానెల్ కు 2 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇంకా కొత్తగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతూనే ఉందని సమాచారం. ఈ స్థాయిలో యూట్యూబ్ సబ్ స్క్రైబర్లు ఉన్న రాజకీయ నేత విశ్వవ్యాప్తంగా ఏ ఒక్కరూ లేరు. యూట్యూట్ సబ్ స్క్రైబర్ల సంఖ్యలో మోదీ తర్వాత బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనార్ ఉన్నారు.
ఈయన ఛానెల్ కు ఉన్న సబ్ స్క్రైబర్ల సంఖ్య కేవలం 60 లక్షలే. మోదీ ఛానెల్ కు ఉన్న సబ్ స్క్రైబర్ల సంఖ్యలో పోలిస్తే… ఈ సంఖ్య నాలుగో వంతే. మోదీ చానెల్ లో ప్రతీ వారం కనీసం 19 వీడియోలో అప్ లోడ్ అవుతున్నాయట.
This post was last modified on January 11, 2025 7:17 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…