నరేంద్ర మోదీ… భారత ప్రధాన మంత్రి మాత్రమే కాదు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వరల్డ్ మోస్ట్ పవర్ ఫుల్ నేత కూడా. దాదాపుగా అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో అత్యథిక సంఖ్యలో ఫాలోవర్లను కలిగిన నేతగా ఇప్పటికే మోదీ రికార్డులకెక్కారు. తాజాగా ఆ సోషల్ మీడియా ఖాతాల ద్వారా… ప్రత్యేకించి యూట్యూబ్ ద్వారా అత్యథిక ఆదాయాన్ని పొందుతూ కూడా మోదీ సరికొత్త రికార్డులను నెలకొల్పారు.
వ్యక్తిగత ఖాతా కేటగిరీలో మోదీ యూట్యూబ్ ఛానెల్ ఒక్క నెలకు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అయితే మోదీ ఈ ఛానెల్ ను ఏదో ఆదాయ ఆర్జన కోసం ప్రారంభించినది కాదు కదా. అయినప్పటికీ… నెలకు కోట్లాది రూపాయలను సదరు ఛానెల్ మోదీకి సంపాదించి పెడుతోంది.
అయినా మోదీ యూట్యూబ్ ఛానెల్ ఏ మేర సంపాదిస్తుందన్న విషయంలోకి వెళితే… నెలకు హీన పక్షం 1.86 లక్షల డాలర్లను సంపాదిస్తున్న ఈ ఛానెల్… అత్యధికంగా 5.67 లక్షల డాలర్ల దాకా సంపాదిస్తోందట. ఈ ఆదాయాన్ని మన ఇండియన్ కరెన్సీలోకి మార్చి చూస్తే…
మోదీ ఛానెల్ ఆదాయం నెలకు రూ.1.62 కోట్ల నుంచి రూ.4.88 కోట్ల దాకా ఉంటుంది. ఈ ఛానెల్ లో ఇప్పటిదాకా 29,272 వీడియోలను అప్ లోడ్ చేయగా… మొత్తంగా 636 కోట్ల వ్యూస్ వచ్చాయి. వీటిలో ఒక్కో వీడియో ఏకంగా 40 వేలకు పైగా వ్యూస్ సాధిస్తున్నాయి. సగటున ఒక్కో వీడియో 20 వేల వ్యూస్ దాకా సాధిస్తున్నట్లు అంచనా.
ఇక ఈ ఛానెల్ గురించిన మరిన్ని వివరాల్లోకి వెళితే.. 2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ తన యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించారు. తన అధికారిక కార్యక్రమాలను ప్రసారం చేసేుందకే మోదీ ఈ ఛానెల్ ను ప్రారంభించారట. 2014లో భారత ప్రధాని అయిన తర్వాత కూడా తన ఛానెల్ ను మోదీ కొనసాగించారు.
ప్రస్తుతం ఈ ఛానెల్ కు 2 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇంకా కొత్తగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతూనే ఉందని సమాచారం. ఈ స్థాయిలో యూట్యూబ్ సబ్ స్క్రైబర్లు ఉన్న రాజకీయ నేత విశ్వవ్యాప్తంగా ఏ ఒక్కరూ లేరు. యూట్యూట్ సబ్ స్క్రైబర్ల సంఖ్యలో మోదీ తర్వాత బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనార్ ఉన్నారు.
ఈయన ఛానెల్ కు ఉన్న సబ్ స్క్రైబర్ల సంఖ్య కేవలం 60 లక్షలే. మోదీ ఛానెల్ కు ఉన్న సబ్ స్క్రైబర్ల సంఖ్యలో పోలిస్తే… ఈ సంఖ్య నాలుగో వంతే. మోదీ చానెల్ లో ప్రతీ వారం కనీసం 19 వీడియోలో అప్ లోడ్ అవుతున్నాయట.
This post was last modified on January 11, 2025 7:17 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…