Political News

పిఠాపురం టీడీపీ వ‌ర్మ హ్యాపీ… అంత సంతోషానికి రీజ‌నేంటి..!

పిఠాపురం వ‌ర్మ‌గా పేరొందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ ఖుషీ అయ్యారు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం త‌న సీటును త్యాగం చేసిన ఆయ‌న ఆ త‌ర్వాత‌.. ఒకింత ముభావంగానే ఉన్నారు. ఇస్తామ‌న్న ప‌ద‌విని ఇవ్వ‌క‌పోగా.. క‌నీసం ప్రాధాన్యం ద‌క్క‌డంలేద‌ని వ‌ర్మ వ‌గ‌స్తున్న విష‌యం తెలిసిందే.

పైగా జ‌న‌సేన నాయ‌కుల నుంచి కూడా ఆయ‌న‌కు ప‌లుమార్లు అవ‌మానాలు ఎదుర‌య్యాయనీ వార్తలు వినిపించాయి. దీంతో వ‌ర్మ గ‌త నాలుగు మాసాలుగా అంటీముట్ట‌న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారనీ రాజకీయ నేతలు పలు మార్లు చర్చించారు. ఇటీవ‌ల కోడిపందేల బ‌రుల విష‌యంలోనూ వ‌ర్మ వ‌ర్గానికి చేదు అనుభ‌వాలు పెరిగిపోయాయి.

ఇలా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా వ‌ర్మ‌కు ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్న ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో అనూహ్యంగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా వ‌ర్మకు ఆయ‌న స్వ‌యంగా ఆహ్వానం ప‌లికారు.

అంతేకాదు.. త‌న‌తోపాటు వేదిక‌పైనా కూర్చోబెట్టుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆసాంతం వ‌ర్మ ఖుషీ అయ్యారు. ఆనందంగా గ‌డిపారు. అయితే.. దీనికి ముందు జ‌రిగిన చ‌ర్చ‌ల వ్య‌వ‌హారంపైనే ఆస‌క్తి నెల‌కొంది. పిఠాపురానికి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ముందుగానే వ‌ర్మ భేటీ అయిన‌ట్టు ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో వ‌ర్మ‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను బ‌ల‌మైన హామీ ల‌భించిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర్మ దేనికోసం అయితే.. వేచి చూస్తున్నారో.. అదే ఆయ‌న‌కు వ‌రంగా మారింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజానికి టికెట్‌ను త్యాగం చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడే.. చంద్ర‌బాబు వ‌ర్మ‌కు బ‌ల‌మైన హామీ ఇచ్చారు.

క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి మంత్రి వ‌ర్గంలో చోటు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చంద్ర‌బాబు అప్ప‌ట్లో చెప్పుకొచ్చారు. కానీ, మంత్రి వ‌ర్గంలో చోటు ల‌భించ‌లేదు. అలాగ‌ని వ‌ర్మ ఎక్క‌డా బ‌య‌ట‌పడలేదు. ఎక్క‌డా యాగీ కూడా చేయ‌లేదు. ఇక‌, ఈ వ్య‌వ‌హారం నానుతున్న క్ర‌మంలో ప‌వ‌న్ నుంచి గ‌ట్టి హామీ ల‌భించిన‌ట్టు తెలుస్తోంది.

ఏంటా హామీ..?

ఇప్పుడు వ‌ర్మ అనుచ‌రుల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో జ‌రుగుతున్న చ‌ర్చ కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. త‌మ నాయ‌కుడికి ప‌వ‌న్ నుంచి ఎలాంటి హామీ ల‌భించింద‌న్న విష‌యంపై వారు చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ప్ర‌స్తుతం దీనిపై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది.

అయితే.. క్ష‌త్రియ కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేసి.. దానికి చైర్మ‌న్ ప‌ద‌విని సృష్టించి.. ఆ ప‌ద‌విని వ‌ర్మ‌కు ఇచ్చే ఆలోచ‌న ఉంద‌ని వ‌ర్మ అనుచ‌రులు భావిస్తున్నారు. ఈ మేర‌కు ప‌వ‌న్ నుంచి బ‌ల‌మైన హామీ ద‌క్కింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది కేబినెట్ ర్యాంకుతో కూడిన ప‌ద‌విగా కూడా చెబుతున్నారు. అందుకే తాజా కార్య‌క్ర‌మంలో వ‌ర్మ ఖుషీ అయిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో ప్రభుత్వం దీని కార్యాచరణ ఎలా మొదలుపెడుతుందో చూడాలి.

Kumar

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

2 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

4 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

6 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

7 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

7 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

7 hours ago