Political News

పిఠాపురం టీడీపీ వ‌ర్మ హ్యాపీ… అంత సంతోషానికి రీజ‌నేంటి..!

పిఠాపురం వ‌ర్మ‌గా పేరొందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ ఖుషీ అయ్యారు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం త‌న సీటును త్యాగం చేసిన ఆయ‌న ఆ త‌ర్వాత‌.. ఒకింత ముభావంగానే ఉన్నారు. ఇస్తామ‌న్న ప‌ద‌విని ఇవ్వ‌క‌పోగా.. క‌నీసం ప్రాధాన్యం ద‌క్క‌డంలేద‌ని వ‌ర్మ వ‌గ‌స్తున్న విష‌యం తెలిసిందే.

పైగా జ‌న‌సేన నాయ‌కుల నుంచి కూడా ఆయ‌న‌కు ప‌లుమార్లు అవ‌మానాలు ఎదుర‌య్యాయనీ వార్తలు వినిపించాయి. దీంతో వ‌ర్మ గ‌త నాలుగు మాసాలుగా అంటీముట్ట‌న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారనీ రాజకీయ నేతలు పలు మార్లు చర్చించారు. ఇటీవ‌ల కోడిపందేల బ‌రుల విష‌యంలోనూ వ‌ర్మ వ‌ర్గానికి చేదు అనుభ‌వాలు పెరిగిపోయాయి.

ఇలా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా వ‌ర్మ‌కు ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్న ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో అనూహ్యంగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా వ‌ర్మకు ఆయ‌న స్వ‌యంగా ఆహ్వానం ప‌లికారు.

అంతేకాదు.. త‌న‌తోపాటు వేదిక‌పైనా కూర్చోబెట్టుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆసాంతం వ‌ర్మ ఖుషీ అయ్యారు. ఆనందంగా గ‌డిపారు. అయితే.. దీనికి ముందు జ‌రిగిన చ‌ర్చ‌ల వ్య‌వ‌హారంపైనే ఆస‌క్తి నెల‌కొంది. పిఠాపురానికి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ముందుగానే వ‌ర్మ భేటీ అయిన‌ట్టు ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో వ‌ర్మ‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను బ‌ల‌మైన హామీ ల‌భించిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర్మ దేనికోసం అయితే.. వేచి చూస్తున్నారో.. అదే ఆయ‌న‌కు వ‌రంగా మారింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజానికి టికెట్‌ను త్యాగం చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడే.. చంద్ర‌బాబు వ‌ర్మ‌కు బ‌ల‌మైన హామీ ఇచ్చారు.

క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి మంత్రి వ‌ర్గంలో చోటు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చంద్ర‌బాబు అప్ప‌ట్లో చెప్పుకొచ్చారు. కానీ, మంత్రి వ‌ర్గంలో చోటు ల‌భించ‌లేదు. అలాగ‌ని వ‌ర్మ ఎక్క‌డా బ‌య‌ట‌పడలేదు. ఎక్క‌డా యాగీ కూడా చేయ‌లేదు. ఇక‌, ఈ వ్య‌వ‌హారం నానుతున్న క్ర‌మంలో ప‌వ‌న్ నుంచి గ‌ట్టి హామీ ల‌భించిన‌ట్టు తెలుస్తోంది.

ఏంటా హామీ..?

ఇప్పుడు వ‌ర్మ అనుచ‌రుల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో జ‌రుగుతున్న చ‌ర్చ కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. త‌మ నాయ‌కుడికి ప‌వ‌న్ నుంచి ఎలాంటి హామీ ల‌భించింద‌న్న విష‌యంపై వారు చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ప్ర‌స్తుతం దీనిపై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది.

అయితే.. క్ష‌త్రియ కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేసి.. దానికి చైర్మ‌న్ ప‌ద‌విని సృష్టించి.. ఆ ప‌ద‌విని వ‌ర్మ‌కు ఇచ్చే ఆలోచ‌న ఉంద‌ని వ‌ర్మ అనుచ‌రులు భావిస్తున్నారు. ఈ మేర‌కు ప‌వ‌న్ నుంచి బ‌ల‌మైన హామీ ద‌క్కింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది కేబినెట్ ర్యాంకుతో కూడిన ప‌ద‌విగా కూడా చెబుతున్నారు. అందుకే తాజా కార్య‌క్ర‌మంలో వ‌ర్మ ఖుషీ అయిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో ప్రభుత్వం దీని కార్యాచరణ ఎలా మొదలుపెడుతుందో చూడాలి.

This post was last modified on January 11, 2025 5:52 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

2 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

2 hours ago

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

8 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

10 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

10 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

11 hours ago