Political News

పిఠాపురం టీడీపీ వ‌ర్మ హ్యాపీ… అంత సంతోషానికి రీజ‌నేంటి..!

పిఠాపురం వ‌ర్మ‌గా పేరొందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ ఖుషీ అయ్యారు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం త‌న సీటును త్యాగం చేసిన ఆయ‌న ఆ త‌ర్వాత‌.. ఒకింత ముభావంగానే ఉన్నారు. ఇస్తామ‌న్న ప‌ద‌విని ఇవ్వ‌క‌పోగా.. క‌నీసం ప్రాధాన్యం ద‌క్క‌డంలేద‌ని వ‌ర్మ వ‌గ‌స్తున్న విష‌యం తెలిసిందే.

పైగా జ‌న‌సేన నాయ‌కుల నుంచి కూడా ఆయ‌న‌కు ప‌లుమార్లు అవ‌మానాలు ఎదుర‌య్యాయనీ వార్తలు వినిపించాయి. దీంతో వ‌ర్మ గ‌త నాలుగు మాసాలుగా అంటీముట్ట‌న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారనీ రాజకీయ నేతలు పలు మార్లు చర్చించారు. ఇటీవ‌ల కోడిపందేల బ‌రుల విష‌యంలోనూ వ‌ర్మ వ‌ర్గానికి చేదు అనుభ‌వాలు పెరిగిపోయాయి.

ఇలా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా వ‌ర్మ‌కు ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్న ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో అనూహ్యంగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా వ‌ర్మకు ఆయ‌న స్వ‌యంగా ఆహ్వానం ప‌లికారు.

అంతేకాదు.. త‌న‌తోపాటు వేదిక‌పైనా కూర్చోబెట్టుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆసాంతం వ‌ర్మ ఖుషీ అయ్యారు. ఆనందంగా గ‌డిపారు. అయితే.. దీనికి ముందు జ‌రిగిన చ‌ర్చ‌ల వ్య‌వ‌హారంపైనే ఆస‌క్తి నెల‌కొంది. పిఠాపురానికి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ముందుగానే వ‌ర్మ భేటీ అయిన‌ట్టు ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో వ‌ర్మ‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను బ‌ల‌మైన హామీ ల‌భించిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర్మ దేనికోసం అయితే.. వేచి చూస్తున్నారో.. అదే ఆయ‌న‌కు వ‌రంగా మారింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజానికి టికెట్‌ను త్యాగం చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడే.. చంద్ర‌బాబు వ‌ర్మ‌కు బ‌ల‌మైన హామీ ఇచ్చారు.

క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి మంత్రి వ‌ర్గంలో చోటు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చంద్ర‌బాబు అప్ప‌ట్లో చెప్పుకొచ్చారు. కానీ, మంత్రి వ‌ర్గంలో చోటు ల‌భించ‌లేదు. అలాగ‌ని వ‌ర్మ ఎక్క‌డా బ‌య‌ట‌పడలేదు. ఎక్క‌డా యాగీ కూడా చేయ‌లేదు. ఇక‌, ఈ వ్య‌వ‌హారం నానుతున్న క్ర‌మంలో ప‌వ‌న్ నుంచి గ‌ట్టి హామీ ల‌భించిన‌ట్టు తెలుస్తోంది.

ఏంటా హామీ..?

ఇప్పుడు వ‌ర్మ అనుచ‌రుల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో జ‌రుగుతున్న చ‌ర్చ కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. త‌మ నాయ‌కుడికి ప‌వ‌న్ నుంచి ఎలాంటి హామీ ల‌భించింద‌న్న విష‌యంపై వారు చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ప్ర‌స్తుతం దీనిపై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది.

అయితే.. క్ష‌త్రియ కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేసి.. దానికి చైర్మ‌న్ ప‌ద‌విని సృష్టించి.. ఆ ప‌ద‌విని వ‌ర్మ‌కు ఇచ్చే ఆలోచ‌న ఉంద‌ని వ‌ర్మ అనుచ‌రులు భావిస్తున్నారు. ఈ మేర‌కు ప‌వ‌న్ నుంచి బ‌ల‌మైన హామీ ద‌క్కింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది కేబినెట్ ర్యాంకుతో కూడిన ప‌ద‌విగా కూడా చెబుతున్నారు. అందుకే తాజా కార్య‌క్ర‌మంలో వ‌ర్మ ఖుషీ అయిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో ప్రభుత్వం దీని కార్యాచరణ ఎలా మొదలుపెడుతుందో చూడాలి.

This post was last modified on January 11, 2025 5:52 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…

2 seconds ago

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…

2 hours ago

వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి…

2 hours ago

రాజమౌళి టెన్షన్ పడే టైపు కాదు

ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…

3 hours ago

రజినీకాంత్ సినిమాకు దర్శకుల కష్టాలు

అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…

4 hours ago

విజ‌య్ గ్రాఫ్‌… పోలింగ్ ముందు ఎలా ఉంది?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు త‌మ‌ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…

4 hours ago