పిఠాపురం వర్మగా పేరొందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వర్మ ఖుషీ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఆయన ఆ తర్వాత.. ఒకింత ముభావంగానే ఉన్నారు. ఇస్తామన్న పదవిని ఇవ్వకపోగా.. కనీసం ప్రాధాన్యం దక్కడంలేదని వర్మ వగస్తున్న విషయం తెలిసిందే.
పైగా జనసేన నాయకుల నుంచి కూడా ఆయనకు పలుమార్లు అవమానాలు ఎదురయ్యాయనీ వార్తలు వినిపించాయి. దీంతో వర్మ గత నాలుగు మాసాలుగా అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారనీ రాజకీయ నేతలు పలు మార్లు చర్చించారు. ఇటీవల కోడిపందేల బరుల విషయంలోనూ వర్మ వర్గానికి చేదు అనుభవాలు పెరిగిపోయాయి.
ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వర్మకు ఎదురు దెబ్బలు తగులుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి కీలక సమయంలో అనూహ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా వర్మకు ఆయన స్వయంగా ఆహ్వానం పలికారు.
అంతేకాదు.. తనతోపాటు వేదికపైనా కూర్చోబెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆసాంతం వర్మ ఖుషీ అయ్యారు. ఆనందంగా గడిపారు. అయితే.. దీనికి ముందు జరిగిన చర్చల వ్యవహారంపైనే ఆసక్తి నెలకొంది. పిఠాపురానికి వచ్చిన పవన్ కల్యాణ్ను ముందుగానే వర్మ భేటీ అయినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు.
ఈ క్రమంలో వర్మకు పవన్ కల్యాణ్ను బలమైన హామీ లభించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు వర్మ దేనికోసం అయితే.. వేచి చూస్తున్నారో.. అదే ఆయనకు వరంగా మారిందన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి టికెట్ను త్యాగం చేయాల్సి వచ్చినప్పుడే.. చంద్రబాబు వర్మకు బలమైన హామీ ఇచ్చారు.
క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో చోటు ఇవ్వాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అప్పట్లో చెప్పుకొచ్చారు. కానీ, మంత్రి వర్గంలో చోటు లభించలేదు. అలాగని వర్మ ఎక్కడా బయటపడలేదు. ఎక్కడా యాగీ కూడా చేయలేదు. ఇక, ఈ వ్యవహారం నానుతున్న క్రమంలో పవన్ నుంచి గట్టి హామీ లభించినట్టు తెలుస్తోంది.
ఏంటా హామీ..?
ఇప్పుడు వర్మ అనుచరుల మధ్య తీవ్రస్థాయిలో జరుగుతున్న చర్చ కూడా ఇదే కావడం గమనార్హం. తమ నాయకుడికి పవన్ నుంచి ఎలాంటి హామీ లభించిందన్న విషయంపై వారు చర్చోపచర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం దీనిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
అయితే.. క్షత్రియ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి.. దానికి చైర్మన్ పదవిని సృష్టించి.. ఆ పదవిని వర్మకు ఇచ్చే ఆలోచన ఉందని వర్మ అనుచరులు భావిస్తున్నారు. ఈ మేరకు పవన్ నుంచి బలమైన హామీ దక్కిందన్న ప్రచారం జరుగుతోంది. ఇది కేబినెట్ ర్యాంకుతో కూడిన పదవిగా కూడా చెబుతున్నారు. అందుకే తాజా కార్యక్రమంలో వర్మ ఖుషీ అయినట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో ప్రభుత్వం దీని కార్యాచరణ ఎలా మొదలుపెడుతుందో చూడాలి.
This post was last modified on January 11, 2025 5:52 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…