Political News

మోదీ ఊరికి చైనా అధ్యక్షుడితో అనుబంధం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో పాడ్‌కాస్ట్‌లో పాల్గొని అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గుజరాత్‌లోని తన స్వగ్రామం వాద్‌నగర్‌కు, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు మధ్య ఉన్న చారిత్రక సంబంధాన్ని గుర్తుచేశారు. ఈ అనుబంధం వెనుక బౌద్ధ యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్ పాత్ర ఉందని చెప్పారు.

మోదీ వివరించిన ప్రకారం, 2014లో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ప్రపంచ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫోన్ చేసి స్వయంగా అభినందించినప్పుడు, తన స్వగ్రామం వాద్‌నగర్‌ను సందర్శించాలనే ఆసక్తిని వ్యక్తం చేశారట.

మోదీ దీనికి ఆశ్చర్యపడి కారణం అడగగా, హ్యూయెన్ త్సాంగ్ వాద్‌నగర్‌లో నివసించాడని, ఆ తరువాత మా ప్రాంతంలో కూడా నివసించారని జిన్‌పింగ్ తెలిపారు. ఇది విన్న మోదీకి తమ ఊరుకు అంతటిదూరంలో చైనా అధ్యక్షుడికి సంబంధం ఉందని తెలుసుకుని ఆశ్చర్యమేసిందట.

ఈ చారిత్రక అనుబంధాన్ని గుర్తుచేస్తూ, జిన్‌పింగ్ భారతదేశ పర్యటన సందర్భంగా 2014 సెప్టెంబర్ 17న గుజరాత్‌ను సందర్శించారు. ఈ రోజు మోదీ 64వ పుట్టినరోజు కావడం విశేషం. ఆ సందర్శనలో వాద్‌నగర్ చరిత్రను మరింత లోతుగా పరిశీలించిన జిన్‌పింగ్, రెండు దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని పునరుద్ధరించారు.

వాద్‌నగర్ చరిత్రలో బౌద్ధ ధర్మం ద్వారా ఆధ్యాత్మిక అనుబంధం ఉన్న ఈ సాన్నిహిత్యం, భారత చైనా సంబంధాలను బలపరిచే చారిత్రక సందర్భంగా నిలిచింది. హ్యూయెన్ త్సాంగ్ నివాసం చరిత్రను ప్రస్తావిస్తూ మోదీ జ్ఞాపకాల్ని పంచుకోవడం సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది.

This post was last modified on January 11, 2025 2:03 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

16 seconds ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

46 minutes ago

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

1 hour ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

2 hours ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

3 hours ago