జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో పోల్చితే… పవన్ రాజకీయం చాలా డిఫరెంట్ గానే కనిపిస్తుంది. అదే సమయంలో ఆయన ప్రజల పట్ల మాట్లాడే తీరు గానీ, ప్రజా సమస్యలపై స్పందించే తీరు కూడా ఇతరులతో పోల్చితే టోటల్ డిఫరెంట్ గా ఉంటుందని చెప్పక తప్పదు. ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుందన్నది ఈ సంక్రాంతి తర్వాత మరింత స్పష్టంగా కనిపించనుంది. ప్రస్తుతం సంక్రాంతి సంబరాల కోసం తన సొంత నియోజకవర్గం పిఠాపురం వెళ్లిన పవన్… పండుగను అక్కడి ప్రజల మధ్యనే జరుపుకోనున్నారు.
సంక్రాంతి ముగియగానే పవన్ పలగ్రామాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నుంచి పవన్ పల్లెల పర్యటన ప్రారంభం కానుంది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ పర్యటనల్లో భాగంగా ప్రతి జిల్లాలో అధికారులు కొన్ని గ్రామాలను ఎంపిక చేస్తారు. ఆ గ్రామాల్లోనే పవన్ పర్యటిస్తారు. గ్రామాల్లో పవన్ పర్యటన అంటే… ఏదో అలా పల్లెల్లో అడుగు పెట్టేసి… అలా అలా అక్కడి ప్రజలతో మాటా మంతి కలి వెనుదిరగడం కాదు. ఆ గ్రామాల్లోని ప్రజలతో మమేకం అవుతూ… వారితో కలిసి ఆ గ్రామాల్లో పవన్ బస చేస్తారు.
ఓ రకంగా చెప్పాలంటే… ఈ పర్యటనలకు పల్లె నిద్ర అని పేరు పెడితే సరిపోతుందేమో. సివిల్ సర్వీసెస్ అధికారులు తమ శిక్షణలో భాగంగా ఇలా కొన్ని పల్లెలకు వెళ్లి వాటిలోనే కొంతకాలం పాటు బస చేస్తారు. అక్కడి పస్రజానీకం జీవన విధానాలను పరిశీలిస్తారు. వారి సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తారు. సరిగ్గా.. ఇప్పుడు పవన్ కూడా వారి మాదిరిగానే గ్రామాల్లో పర్యటించనున్నారు. తాను వెళ్లే గ్రామాల్లోనే టెంపరరీ టెంట్లు వేసుకునే పవన్… వాటిలోనే బస చేస్తారు. ఆ టెంట్ల నుంచే తన రోజువారీ విధులను నిర్వహిస్తారు. అదే సమయంలో ఆయా గ్రామాల్లోని ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలపరిష్కారం కోసం కృషి చేస్తారు. ఈ పర్యటనలతో పవన్ స్థాయి ఓ రేంజికి చేరుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on January 10, 2025 6:51 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…