జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో పోల్చితే… పవన్ రాజకీయం చాలా డిఫరెంట్ గానే కనిపిస్తుంది. అదే సమయంలో ఆయన ప్రజల పట్ల మాట్లాడే తీరు గానీ, ప్రజా సమస్యలపై స్పందించే తీరు కూడా ఇతరులతో పోల్చితే టోటల్ డిఫరెంట్ గా ఉంటుందని చెప్పక తప్పదు. ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుందన్నది ఈ సంక్రాంతి తర్వాత మరింత స్పష్టంగా కనిపించనుంది. ప్రస్తుతం సంక్రాంతి సంబరాల కోసం తన సొంత నియోజకవర్గం పిఠాపురం వెళ్లిన పవన్… పండుగను అక్కడి ప్రజల మధ్యనే జరుపుకోనున్నారు.
సంక్రాంతి ముగియగానే పవన్ పలగ్రామాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నుంచి పవన్ పల్లెల పర్యటన ప్రారంభం కానుంది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ పర్యటనల్లో భాగంగా ప్రతి జిల్లాలో అధికారులు కొన్ని గ్రామాలను ఎంపిక చేస్తారు. ఆ గ్రామాల్లోనే పవన్ పర్యటిస్తారు. గ్రామాల్లో పవన్ పర్యటన అంటే… ఏదో అలా పల్లెల్లో అడుగు పెట్టేసి… అలా అలా అక్కడి ప్రజలతో మాటా మంతి కలి వెనుదిరగడం కాదు. ఆ గ్రామాల్లోని ప్రజలతో మమేకం అవుతూ… వారితో కలిసి ఆ గ్రామాల్లో పవన్ బస చేస్తారు.
ఓ రకంగా చెప్పాలంటే… ఈ పర్యటనలకు పల్లె నిద్ర అని పేరు పెడితే సరిపోతుందేమో. సివిల్ సర్వీసెస్ అధికారులు తమ శిక్షణలో భాగంగా ఇలా కొన్ని పల్లెలకు వెళ్లి వాటిలోనే కొంతకాలం పాటు బస చేస్తారు. అక్కడి పస్రజానీకం జీవన విధానాలను పరిశీలిస్తారు. వారి సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తారు. సరిగ్గా.. ఇప్పుడు పవన్ కూడా వారి మాదిరిగానే గ్రామాల్లో పర్యటించనున్నారు. తాను వెళ్లే గ్రామాల్లోనే టెంపరరీ టెంట్లు వేసుకునే పవన్… వాటిలోనే బస చేస్తారు. ఆ టెంట్ల నుంచే తన రోజువారీ విధులను నిర్వహిస్తారు. అదే సమయంలో ఆయా గ్రామాల్లోని ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలపరిష్కారం కోసం కృషి చేస్తారు. ఈ పర్యటనలతో పవన్ స్థాయి ఓ రేంజికి చేరుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on January 10, 2025 6:51 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…