Political News

మోడీ రాక‌తో 7.5 ల‌క్ష‌ల మందికి ఉపాధి: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ ప్ర‌జ‌లు గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నికల్లో ఎన్డీయేను న‌మ్మార‌ని.. అందుకే క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ఘ‌న విజ‌యం అందించారని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీకి ఘ‌న విజ‌యం అందించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు చెబుతున్న‌ట్టు తెలిపారు. విశాఖ‌లో ప్ర‌ధాని మోడీ పాల్గొన్న స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌సంగించారు. అయితే.. ఆయ‌న ప్ర‌సంగం క్లుప్తంగానే సాగింది. కేవ‌లం 10 నిమిషాల్లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ప్ర‌సంగాన్ని ముగించ‌డం గ‌మ‌నార్హం. అయితే.. మాట్లాడిన కొద్ది సేపు కూడా.. కీల‌కమైన అంశాల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావించారు.

ప్ర‌ధాన మంత్రి రాక‌తో ఏపీకి 2 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కుపైగా పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు.త ద్వారా 7.5 ల‌క్ష‌ల మంది యువ‌త‌కు ఉపాధి ల‌భిస్తోంద‌ని చెప్పారు. ప్ర‌ధాని మోడీ అంటే ధైర్య సాహ‌సాల‌కు ప్ర‌తీక‌గా పేర్కొన్నారు. ధైర్య సాహ‌సాల‌ను నింపితే అది ప‌టిష్ఠ భార‌త్‌ అవుతుంద‌న్నారు. స‌దాశ‌యంతో క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ.. దేశాన్ని పురోభివృద్ధిలో ముందుకు న‌డిపిస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌ధాని మోడీ హ‌యాంలో చేప‌ట్టిన స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మం దేశం గ‌తిని మార్చే కార్య‌క్ర‌మంగా అభివ‌ర్ణించారు. “పాల‌కుల‌కు సదుద్దేశం, సదాశయం ఉంటే ఏదైనా సాధ్యమే” అని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు.

దేశంలోని అప‌న్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాల‌ని ప్ర‌ధాని ఆకాంక్షిస్తున్నార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. అందుకే.. ఆయ‌న నిరంతరం కృషి చేస్తున్న‌ట్టు చెప్పారు. అభివృద్ధి పథంలో దేశాన్ని న‌డిపించేందుకు మోడీ చేస్తున్న కృషి అన‌న్య సామాన్యమ‌ని పేర్కొన్నారు. వ‌రుస‌గా మూడు సార్లు కేంద్రంలో అధికారం చేప‌ట్టిన మోడీ.. ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకోవ‌డం వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని పేర్కొన్నారు. అవినీతి, అరాచ‌క పాల‌న‌తో గ‌త ఐదేళ్లు రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొందని ప‌రోక్షంగా వైసీపీపై నిప్పులు చెరిగారు. కేంద్రంలో ప్ర‌ధాని మోడీ, రాష్ట్రంలో సీఎం చంద్ర‌బాబు దార్శనిక నేత‌ల‌ని పేర్కొన్నారు. వీరితో దేశం అభివృద్ది ప‌థంలో ముందుకు సాగుతుంద‌న్న న‌మ్మ‌కం ప్ర‌జ‌లకు ఉంద‌ని తెలిపారు.

This post was last modified on January 9, 2025 11:07 am

Share

Recent Posts

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

36 minutes ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

40 minutes ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

2 hours ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

2 hours ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

3 hours ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

4 hours ago