ఏపీ ప్రజలు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్డీయేను నమ్మారని.. అందుకే కనీ వినీ ఎరుగని రీతిలో ఘన విజయం అందించారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బీజేపీ-జనసేన-టీడీపీకి ఘన విజయం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నట్టు తెలిపారు. విశాఖలో ప్రధాని మోడీ పాల్గొన్న సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. అయితే.. ఆయన ప్రసంగం క్లుప్తంగానే సాగింది. కేవలం 10 నిమిషాల్లోనే పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ముగించడం గమనార్హం. అయితే.. మాట్లాడిన కొద్ది సేపు కూడా.. కీలకమైన అంశాలను పవన్ కల్యాణ్ ప్రస్తావించారు.
ప్రధాన మంత్రి రాకతో ఏపీకి 2 లక్షల రూపాయలకుపైగా పెట్టుబడులు వస్తున్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు.త ద్వారా 7.5 లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తోందని చెప్పారు. ప్రధాని మోడీ అంటే ధైర్య సాహసాలకు ప్రతీకగా పేర్కొన్నారు. ధైర్య సాహసాలను నింపితే అది పటిష్ఠ భారత్ అవుతుందన్నారు. సదాశయంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ.. దేశాన్ని పురోభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. ప్రధాని మోడీ హయాంలో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశం గతిని మార్చే కార్యక్రమంగా అభివర్ణించారు. “పాలకులకు సదుద్దేశం, సదాశయం ఉంటే ఏదైనా సాధ్యమే” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
దేశంలోని అపన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని ప్రధాని ఆకాంక్షిస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. అందుకే.. ఆయన నిరంతరం కృషి చేస్తున్నట్టు చెప్పారు. అభివృద్ధి పథంలో దేశాన్ని నడిపించేందుకు మోడీ చేస్తున్న కృషి అనన్య సామాన్యమని పేర్కొన్నారు. వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టిన మోడీ.. ప్రజల మనసులు గెలుచుకోవడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. అవినీతి, అరాచక పాలనతో గత ఐదేళ్లు రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొందని పరోక్షంగా వైసీపీపై నిప్పులు చెరిగారు. కేంద్రంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు దార్శనిక నేతలని పేర్కొన్నారు. వీరితో దేశం అభివృద్ది పథంలో ముందుకు సాగుతుందన్న నమ్మకం ప్రజలకు ఉందని తెలిపారు.
2024 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన విశ్వంభర టీజర్ మీద నెగటివ్ రియాక్షన్లు చాలా వచ్చాయి. ట్రోలింగ్ జరిగింది. దెబ్బకు…
టాలీవుడ్ బాక్సాఫీస్ జూన్ నెల నుంచి ఊపందుకుంది. ఓవర్సీస్, నార్త్ పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల వరకు పెద్ది బ్లాక్ బస్టర్…
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…