Political News

మోడీ రాక‌తో 7.5 ల‌క్ష‌ల మందికి ఉపాధి: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ ప్ర‌జ‌లు గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నికల్లో ఎన్డీయేను న‌మ్మార‌ని.. అందుకే క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ఘ‌న విజ‌యం అందించారని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీకి ఘ‌న విజ‌యం అందించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు చెబుతున్న‌ట్టు తెలిపారు. విశాఖ‌లో ప్ర‌ధాని మోడీ పాల్గొన్న స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌సంగించారు. అయితే.. ఆయ‌న ప్ర‌సంగం క్లుప్తంగానే సాగింది. కేవ‌లం 10 నిమిషాల్లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ప్ర‌సంగాన్ని ముగించ‌డం గ‌మ‌నార్హం. అయితే.. మాట్లాడిన కొద్ది సేపు కూడా.. కీల‌కమైన అంశాల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావించారు.

ప్ర‌ధాన మంత్రి రాక‌తో ఏపీకి 2 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కుపైగా పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు.త ద్వారా 7.5 ల‌క్ష‌ల మంది యువ‌త‌కు ఉపాధి ల‌భిస్తోంద‌ని చెప్పారు. ప్ర‌ధాని మోడీ అంటే ధైర్య సాహ‌సాల‌కు ప్ర‌తీక‌గా పేర్కొన్నారు. ధైర్య సాహ‌సాల‌ను నింపితే అది ప‌టిష్ఠ భార‌త్‌ అవుతుంద‌న్నారు. స‌దాశ‌యంతో క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ.. దేశాన్ని పురోభివృద్ధిలో ముందుకు న‌డిపిస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌ధాని మోడీ హ‌యాంలో చేప‌ట్టిన స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మం దేశం గ‌తిని మార్చే కార్య‌క్ర‌మంగా అభివ‌ర్ణించారు. “పాల‌కుల‌కు సదుద్దేశం, సదాశయం ఉంటే ఏదైనా సాధ్యమే” అని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు.

దేశంలోని అప‌న్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాల‌ని ప్ర‌ధాని ఆకాంక్షిస్తున్నార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. అందుకే.. ఆయ‌న నిరంతరం కృషి చేస్తున్న‌ట్టు చెప్పారు. అభివృద్ధి పథంలో దేశాన్ని న‌డిపించేందుకు మోడీ చేస్తున్న కృషి అన‌న్య సామాన్యమ‌ని పేర్కొన్నారు. వ‌రుస‌గా మూడు సార్లు కేంద్రంలో అధికారం చేప‌ట్టిన మోడీ.. ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకోవ‌డం వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని పేర్కొన్నారు. అవినీతి, అరాచ‌క పాల‌న‌తో గ‌త ఐదేళ్లు రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొందని ప‌రోక్షంగా వైసీపీపై నిప్పులు చెరిగారు. కేంద్రంలో ప్ర‌ధాని మోడీ, రాష్ట్రంలో సీఎం చంద్ర‌బాబు దార్శనిక నేత‌ల‌ని పేర్కొన్నారు. వీరితో దేశం అభివృద్ది ప‌థంలో ముందుకు సాగుతుంద‌న్న న‌మ్మ‌కం ప్ర‌జ‌లకు ఉంద‌ని తెలిపారు.

This post was last modified on January 9, 2025 11:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

52 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

1 hour ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago