Political News

మోడీ రాక‌తో 7.5 ల‌క్ష‌ల మందికి ఉపాధి: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ ప్ర‌జ‌లు గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నికల్లో ఎన్డీయేను న‌మ్మార‌ని.. అందుకే క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ఘ‌న విజ‌యం అందించారని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీకి ఘ‌న విజ‌యం అందించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు చెబుతున్న‌ట్టు తెలిపారు. విశాఖ‌లో ప్ర‌ధాని మోడీ పాల్గొన్న స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌సంగించారు. అయితే.. ఆయ‌న ప్ర‌సంగం క్లుప్తంగానే సాగింది. కేవ‌లం 10 నిమిషాల్లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ప్ర‌సంగాన్ని ముగించ‌డం గ‌మ‌నార్హం. అయితే.. మాట్లాడిన కొద్ది సేపు కూడా.. కీల‌కమైన అంశాల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావించారు.

ప్ర‌ధాన మంత్రి రాక‌తో ఏపీకి 2 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కుపైగా పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు.త ద్వారా 7.5 ల‌క్ష‌ల మంది యువ‌త‌కు ఉపాధి ల‌భిస్తోంద‌ని చెప్పారు. ప్ర‌ధాని మోడీ అంటే ధైర్య సాహ‌సాల‌కు ప్ర‌తీక‌గా పేర్కొన్నారు. ధైర్య సాహ‌సాల‌ను నింపితే అది ప‌టిష్ఠ భార‌త్‌ అవుతుంద‌న్నారు. స‌దాశ‌యంతో క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ.. దేశాన్ని పురోభివృద్ధిలో ముందుకు న‌డిపిస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌ధాని మోడీ హ‌యాంలో చేప‌ట్టిన స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మం దేశం గ‌తిని మార్చే కార్య‌క్ర‌మంగా అభివ‌ర్ణించారు. “పాల‌కుల‌కు సదుద్దేశం, సదాశయం ఉంటే ఏదైనా సాధ్యమే” అని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు.

దేశంలోని అప‌న్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాల‌ని ప్ర‌ధాని ఆకాంక్షిస్తున్నార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. అందుకే.. ఆయ‌న నిరంతరం కృషి చేస్తున్న‌ట్టు చెప్పారు. అభివృద్ధి పథంలో దేశాన్ని న‌డిపించేందుకు మోడీ చేస్తున్న కృషి అన‌న్య సామాన్యమ‌ని పేర్కొన్నారు. వ‌రుస‌గా మూడు సార్లు కేంద్రంలో అధికారం చేప‌ట్టిన మోడీ.. ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకోవ‌డం వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని పేర్కొన్నారు. అవినీతి, అరాచ‌క పాల‌న‌తో గ‌త ఐదేళ్లు రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొందని ప‌రోక్షంగా వైసీపీపై నిప్పులు చెరిగారు. కేంద్రంలో ప్ర‌ధాని మోడీ, రాష్ట్రంలో సీఎం చంద్ర‌బాబు దార్శనిక నేత‌ల‌ని పేర్కొన్నారు. వీరితో దేశం అభివృద్ది ప‌థంలో ముందుకు సాగుతుంద‌న్న న‌మ్మ‌కం ప్ర‌జ‌లకు ఉంద‌ని తెలిపారు.

This post was last modified on January 9, 2025 11:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

4 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

4 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

5 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

5 hours ago

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

6 hours ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

8 hours ago