Political News

త‌మ్ముళ్లు వ‌ర్సెస్ త‌మ్ముళ్లు: ఎవ‌రూ స‌రిగా లేరు.. !

టీడీపీ-బీజేపీ నేత‌ల మ‌ధ్య వివాదాలు తెర‌మీదికి వ‌చ్చాయి.. స‌ర్దుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. సాధార‌ణంగా ఒకే వ‌ర‌లో రెండు క‌త్తులు ఇమ‌డ‌వ‌నే సామెత ఉన్న నేప‌థ్యంలో రెండు పార్టీల‌కు చెందిన వారు క‌లిసి ప్ర‌యాణం చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఇలాంటి స‌మ‌స్య‌లు కామ‌న్ గానే తెర‌మీద‌కు వ‌స్తుంటాయి. అయితే.. ఇప్పుడు ఒకే పార్టీకి చెందిన నాయ‌కులు త‌న్నుకునే ప‌రిస్థితి కూడా తెర‌మీదికి వ‌చ్చింది. ఇలా.. ఒక చోట రెండు చోట్ల అయితే ఫ‌ర్లేదు.

కానీ, 5-10 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇరుగుపొరుగు టీడీపీ ఎమ్మెల్యేలు… కూడా క‌లివిడిగా లేక‌పోతే.. త‌న్నుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది. ఉదాహ‌ర‌ణ‌కు ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని మ‌డ‌క‌శిర‌, శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గాలు, విజ‌య‌వాడ‌లోని సెంట్ర‌ల్‌-ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గాలు, గుంటూరు వెస్ట్-ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు త‌న్నుకుంటున్నారు. దీనికి కార‌ణం.. సొంత రాజ‌కీయాలేన‌ని కొంద‌రు చెబుతున్నారు. మ‌రికొంద‌రు ఆధిప‌త్య రాజ‌కీయాలు చేసుకుంటున్నార‌ని అంటున్నారు.

మ‌డ‌క‌శిర‌-శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యేల వివాదాలు త‌ర‌చుగా రోడ్డెక్కుతున్నాయి. ఇక‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌-ఈస్ట్‌లో మాత్రం.. కొంత వ‌ర‌కు రోడ్డెక్క‌క‌పోయినా.. ఎమ్మెల్యేల మ‌ధ్య మాత్రం కోల్డ్ వార్ సాగుతోంది. ఇక‌, గుంటూరులో మాత్రం ఈ వివాదాలు బ‌హిరంగంగానే సాగుతున్నాయి. మ‌రికొన్ని చోట్ల త‌మ్ముళ్లు పంప‌కాల‌తో స‌రిపుచ్చుకుంటున్నారు. అంటే వివాదాల‌కు అవ‌కాశం లేకుండా ముందుకు సాగుతున్నారు. దీంతో వారి ప‌రిస్థితి అధిష్టానానికి పెద్ద ఇబ్బందిగా మార‌లేదు.

కానీ, ఇలా వివాదాల‌కు దిగుతున్న వారితోనే ఇబ్బందులు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో పార్టీ ప‌రంగా ఇలాంటి వారిని క‌ట్ట‌డి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని భావిస్తున్నారు. అయితే.. ఇది అంత సాధ్య‌మ‌య్యే లా క‌నిపించ‌డం లేదు. అందుకే పార్టీ కూడా ఈ విష‌యాల‌ను చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేయ‌డం గ‌మ‌నార్హం. ఇసుక‌, మ‌ద్యం వ‌ర‌కే కాకుండా.. ఇత‌ర విష‌యాల‌పైనా ఆధిప‌త్యం కోసం పోరాడుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on January 8, 2025 12:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

39 minutes ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

2 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

3 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

3 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

4 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

5 hours ago