Movie News

విశాల్ ఆరోగ్యం వెనుక అసలు నిజం

ఇటీవలే చెన్నైలో జరిగిన మదగజరాజ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశాల్ లుక్స్ చూసి అభిమానులు కాని వాళ్ళు సైతం షాక్ తిన్నారు. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు పెట్టారు. మైకు పట్టుకున్నప్పుడు వణుకుతున్న తన చేతులు చూసి ఏదో పెద్ద సమస్యే అంటూ కోలీవుడ్ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. మోహంలో కళ తగ్గిపోయి నవ్వులో జీవం లేనట్టుగా అనిపించిన విశాల్ పడిన తీవ్ర ఇబ్బంది కెమెరా సాక్షిగా బయట పడింది. సినిమాకు పని చూసినవాళ్లందరూ ఉత్సాహంగా మాట్లాడితే విశాల్ ఒక్కటే తడబడుతూ ప్రసంగించాడు. బయట ప్రచారం కాస్త ఎక్కువైపోవడంతో అసలు నిజాలు బయటికి వచ్చాయి.

విశాల్ ఢిల్లీలో ఉన్నప్పుడు జ్వరం వచ్చింది. అక్కడే చికిత్స తీసుకుంటూ ఉండగా 12 సంవత్సరాల తర్వాత మదగజరాజ రిలీజవుతున్న సంగతి తెలిసి హుటాహుటిన చెన్నై వచ్చాడు. అప్పటికింకా కోలుకోలేదు. తీరా ఈవెంట్ లో పాల్గొన్నాక అది మరింత ఎక్కువయ్యింది. ఇది గమనించిన ఖుష్బూ, సుందర్ సి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లక అక్కడ క్రమంగా కోలుకుంటున్నాడు. వాస్తవాలు తెలుసుకోకుండా ఈలోగా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు స్టోరీలు వండేయడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కొంత ఎక్కువ రెస్ట్ అవసరం ఉండటంతో విశాల్ మరికొన్నాళ్లు బయట కనిపించకపోవచ్చు. డాక్టర్ల సలహా కూడా ఇదే.

ఇదంతా ఖుష్బూ స్వయంగా పంచుకున్నారు. జనవరి 12 విడుదలవుతున్న మదగజరాజకు అనూహ్యంగా మద్దతు దొరుకుతోంది. అంత పాత సినిమాని జనం పట్టించుకుంటరానే అనుమానాలకు భిన్నంగా విశాల్, సంతానం కామెడీని ఎంజాయ్ చేసేందుకు ఎదురు చూస్తున్నామని సోషల్ మీడియాలో చెప్పడం గమనార్హం. బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ సంగీతం సమకూర్చిన ఈ మాస్ ఎంటర్ టైనర్ కి సుందర్ సి దర్శకుడు. హీరోయిన్లు వరలక్ష్మి శరత్ కుమార్, అంజలిలు మాత్రం ఈ సినిమా ప్రమోషన్ కు దూరంగా ఉన్నారు. గేమ్ ఛేంజర్ తో పాటు మరో ఆరేడు సినిమాలతో మదగజరాజకు పెద్ద పోటీనే ఉంది.

This post was last modified on January 8, 2025 1:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

18 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

58 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago