టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు మరింతగా ప్రాధాన్యం పెరిగింది. బుధవారం ప్రదానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న సందర్భంగా ఏపీలోని కూటమి సర్కారు విడుదల చేసిన పోస్టర్ లోకి నారా లోకేశ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేశారు. వాస్తవానికి కూటమిలో టీడీపీ బిగ్ ప్లేయర్ గా ఉండగా… బీజేపీ, జనసేనలు అందులో కొనసాగుతున్నాయి. ఈ లెక్కన టీడీపీ తరఫున ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన తరఫున ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ తరఫున ఆ పార్టీ కీలక నేత హోదాలో ప్రదాని నరేంద్ర మోదీ ఫొటోలతో కూడిన పోస్టర్ ను రూపొందించడం ఆనవాయితీ. అయితే అనూహ్యంగా ఈ పోస్టర్ లో ముగ్గురు నేతల ఫొటోలకు బదులుగా నలుగురు నేతల ఫొటోలు చేరిపోయాయి.
రాష్ట్రానికి వస్తున్న అతిథిగా ప్రధాని మోదీని ఒకింత పెద్ద సైజు ఫొటోలో చూపించిన రాస్ట్ర ప్రభుత్వం… మోదీకి కుడి వైపున చంద్రబాబు, ఎడమ వైపున పవన్ కల్యాణ్ ల ఫొటోలను పెట్టారు. అయితే అందుకు విరుద్ధంగా ప్రభుత్వ పాలనలో లోకేశ్ పాత్ర అంతకంతకూ పెరిగిపోతున్న క్రమంలో ఆయన ఫొటోను కూడా ఈ పోస్టర్ లో పెట్టాలని అధికార యంత్రాంగం భావించినట్టు ఉంది. అందుకే… చంద్రబాబు ఫొటో పక్కన లోకేశ్ ఫొటోకు స్థానం కల్పించారు. వెరసి ఈ పోస్టర్ లో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్… నలుగురు నేతలు చిద్విలాసంగా నవ్వుతూ కనిపిస్తున్నారు.
టీడీపీ భావి అధినేతగా లోకేశ్ ఇప్పటికే గుర్తింపు సంపాదించుకున్నారు. 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు యువగళం పేరిట చేపట్టిన పాదయాత్రతో లోకేశ్ తన సత్తాను నిరూపించుకున్నారనే చెప్పాలి. అదే సమయంలో తాను ఓడిన మంగళగిరి నియోజకవర్గంలోనే తిరిగి ఎన్నికల బరిలోకి దిగి ఘన విజయం సాధించిన తీరుతోనూ లోకేశ్ తన పట్టుదల ఎలాంటిదో కూడా నిరూపించుకున్నారు. మొత్తంగా పార్టీలో ఏ నిర్ణయం అయినా తీసుకోగలిగే సత్తా తనకు ఉందని లోకేశ్ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. అందుకే కాబోలు… మొన్నటి ఎన్నికల్లో టీడీపీ టికెట్లతో పాటుగా మంత్రివర్గ కూర్పులోనూ ఆయన మార్కే చాలా స్పష్టంగా కనిపించింది. పార్టీలో సత్తా నిరూపించుకున్న లోకేశ్… ఇటు ప్రభుత్వ పాలనలోనూ తనదైన మార్కు చూపుతూ సాగుతున్నారు. ఫలితంగా కూటమి సర్కారు తాజా పోస్టర్ లో లోకేశ్ సరికొత్తగా స్థానం సంపాదించుకున్నారు.
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 రావడం దాదాపు ఖాయమే.…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు పరామర్శలు వెల్లువలా తరలి వస్తున్నాయి. ఏపీ సహా తెలంగాణ…
ఇటీవల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో పెద్ద గొడవ జరిగి అది మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ…
బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…
గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…
భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…