టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు మరింతగా ప్రాధాన్యం పెరిగింది. బుధవారం ప్రదానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న సందర్భంగా ఏపీలోని కూటమి సర్కారు విడుదల చేసిన పోస్టర్ లోకి నారా లోకేశ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేశారు. వాస్తవానికి కూటమిలో టీడీపీ బిగ్ ప్లేయర్ గా ఉండగా… బీజేపీ, జనసేనలు అందులో కొనసాగుతున్నాయి. ఈ లెక్కన టీడీపీ తరఫున ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన తరఫున ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ తరఫున ఆ పార్టీ కీలక నేత హోదాలో ప్రదాని నరేంద్ర మోదీ ఫొటోలతో కూడిన పోస్టర్ ను రూపొందించడం ఆనవాయితీ. అయితే అనూహ్యంగా ఈ పోస్టర్ లో ముగ్గురు నేతల ఫొటోలకు బదులుగా నలుగురు నేతల ఫొటోలు చేరిపోయాయి.
రాష్ట్రానికి వస్తున్న అతిథిగా ప్రధాని మోదీని ఒకింత పెద్ద సైజు ఫొటోలో చూపించిన రాస్ట్ర ప్రభుత్వం… మోదీకి కుడి వైపున చంద్రబాబు, ఎడమ వైపున పవన్ కల్యాణ్ ల ఫొటోలను పెట్టారు. అయితే అందుకు విరుద్ధంగా ప్రభుత్వ పాలనలో లోకేశ్ పాత్ర అంతకంతకూ పెరిగిపోతున్న క్రమంలో ఆయన ఫొటోను కూడా ఈ పోస్టర్ లో పెట్టాలని అధికార యంత్రాంగం భావించినట్టు ఉంది. అందుకే… చంద్రబాబు ఫొటో పక్కన లోకేశ్ ఫొటోకు స్థానం కల్పించారు. వెరసి ఈ పోస్టర్ లో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్… నలుగురు నేతలు చిద్విలాసంగా నవ్వుతూ కనిపిస్తున్నారు.
టీడీపీ భావి అధినేతగా లోకేశ్ ఇప్పటికే గుర్తింపు సంపాదించుకున్నారు. 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు యువగళం పేరిట చేపట్టిన పాదయాత్రతో లోకేశ్ తన సత్తాను నిరూపించుకున్నారనే చెప్పాలి. అదే సమయంలో తాను ఓడిన మంగళగిరి నియోజకవర్గంలోనే తిరిగి ఎన్నికల బరిలోకి దిగి ఘన విజయం సాధించిన తీరుతోనూ లోకేశ్ తన పట్టుదల ఎలాంటిదో కూడా నిరూపించుకున్నారు. మొత్తంగా పార్టీలో ఏ నిర్ణయం అయినా తీసుకోగలిగే సత్తా తనకు ఉందని లోకేశ్ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. అందుకే కాబోలు… మొన్నటి ఎన్నికల్లో టీడీపీ టికెట్లతో పాటుగా మంత్రివర్గ కూర్పులోనూ ఆయన మార్కే చాలా స్పష్టంగా కనిపించింది. పార్టీలో సత్తా నిరూపించుకున్న లోకేశ్… ఇటు ప్రభుత్వ పాలనలోనూ తనదైన మార్కు చూపుతూ సాగుతున్నారు. ఫలితంగా కూటమి సర్కారు తాజా పోస్టర్ లో లోకేశ్ సరికొత్తగా స్థానం సంపాదించుకున్నారు.
This post was last modified on January 8, 2025 1:13 pm
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…
ప్రియాంకా చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రామ్ చరణ్ జంజీర్…
నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్లో, లవర్ బాయ్గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…