“తెల్లారే సరికి పింఛన్లు పంచకపోతే ప్రపంచం తలకిందులు అవుతుందా? ఇది ఉద్యోగులను క్షోభ పెట్టినట్టు కాదా? మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వారిని కనీసం పట్టించుకోకుండా.. ఉదయం 5 గంటలకే ఇళ్లకు తోలుతున్నారు. ఇదేం పద్ధతి“- ఇదీ.. వైసీపీ సానుభూతి పరుడుగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి… (రామిరెడ్డి) చేసిన వ్యాఖ్యలు. అయితే.. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు.
ఉద్యోగులు ఉన్నది ప్రజలకు సేవ చేసేందుకేనని.. సమయంతో నిమిత్తం లేదని అంటున్నారు. ఒకవేళ సమయం ప్రకారం పనిచేయాలని అనుకున్నా.. పింఛన్ల పంపిణీ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకే పనిచేసుకుని ఇళ్లకు వెళ్లిపోతున్నారు కదా? అని చెబుతున్నారు. నీతులు చెప్పాలని అనుకుంటే అప్పట్లో తెల్లవారు జామున 5గంటలకు వాలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను ఇళ్లకు పంపించిన జగన్కు ఎందుకు చెప్పలేదని నిలదీస్తున్నారు.
ప్రస్తుతం పింఛన్ల పంపిణీ సక్రమంగా సమయానికి జరిగిపోతోందని.. ఇది తట్టుకోలేని వైసీపీ నేతలు.. రామిరెడ్డిని ముందు పెట్టి విమర్శలు చేయిస్తున్నారని విజయవాడకు చెందిన టీడీపీ నాయకుడు ఒకరు విమర్శించారు. చంద్రబాబు కూడా.. ఉదయాన్నే బయలు దేరి ప్రజల మధ్యకు వెళ్తున్న విషయాన్ని, పింఛన్లు పంచుతున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. కాబట్టి.. రామిరెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని లేకపోతే… తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాగా.. వైసీపీ హయాంలోనూ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన రామిరెడ్డి.. టీడీపీ నేతలతో చీవాట్లు తిన్నారు. ఇటీవల ఆయనపై కేసు కూడా నమోదైంది. అనుమతి లేకుండా.. మందు పార్టీ ఇచ్చారన్న అభియోగాలపై ఆయనపై కేసు పెట్టారు. ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. సర్కారుపై దుమ్మెత్తి పోసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని.. ఉద్యోగుల్లోని మరో సంఘం నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on January 6, 2025 4:18 pm
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి…
ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…
అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…