ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు… తప్పకుండా పాటించాలని కూడా ఆయన విన్నవించారు. తాజాగా విజయవాడలో పుస్తక మహో త్సవం(బుక్ ఎగ్జిబిషన్) ప్రారంభమైంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అభిమానులకు తాను ప్రాణమైతే, తనకు పుస్తకాలు ప్రాణమన్నారు. లక్షలాది మంది హృదయాలను ఆకట్టుకునే శక్తి తనకు పుస్తకాల వల్లనే వచ్చిందని తెలిపారు.
తన అభిమానులంతా తెలుగుభాషను పరిరక్షించే సైనికులు కావాలని, పుస్తకాలు చదవాలని పవన్ కల్యా ణ్ సందేశం ఇచ్చారు. పుస్తకాలు చదివి, సమాజంలో అన్యాయాలపై పోరాడేందుకు సిద్ధం కావాలని సూచించారు. “తెలుగు నేర్చుకోండి తెలుగు నిర్లక్ష్యం చేయకండి“ అని పిలుపునిచ్చారు. ఈ సందర్భం గా వైసీపీ హయాంలో తెలుగుపై తీసుకున్న నిర్ణయాన్ని ఆయన పరోక్షంగా దుయ్యబట్టారు. అప్పట్లో తెలుగు కాదు.. ఇంగ్లీషు ముద్దు అంటూ.. ప్రచారం చేసి.. పాఠశాలల్లో తెలుగు మీడియంను రద్దు చేసే ప్రయత్నం చేశారు.
ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన పవన్ కల్యాణ్.. “ఆంగ్లం అవసరమే కానీ, పేదరికం పారదోలేందు కు అది మార్గం కాదు. అందరూ ఇంగ్లీషే మాట్లాడే ఇంగ్లాండ్లో కూడా పేదరికం ఉంది“ అని చురకలు అంటించారు. రచయితలను కూడా ఈ సమాజం గౌరవించాలని సూచించారు. పుస్తకం చదవడం ద్వారా అభివృద్ధి చెందవచ్చని తెలిపారు. తాను చదువును మధ్యలోనే ఆపినా, పుస్తకాలు చదవడం ఆపలేదన్నారు. పుస్తకం జీవితంతోనూ, సమాజంలో అన్యాయాలతోనూ పోరాడే ధైర్యాన్నిస్తుందన్నారు. యువతీయువకులు కూడా పుస్తకాలు చదవడం మానవద్దని పవన్ సూచించారు.
This post was last modified on January 2, 2025 10:59 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…