ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు… తప్పకుండా పాటించాలని కూడా ఆయన విన్నవించారు. తాజాగా విజయవాడలో పుస్తక మహో త్సవం(బుక్ ఎగ్జిబిషన్) ప్రారంభమైంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అభిమానులకు తాను ప్రాణమైతే, తనకు పుస్తకాలు ప్రాణమన్నారు. లక్షలాది మంది హృదయాలను ఆకట్టుకునే శక్తి తనకు పుస్తకాల వల్లనే వచ్చిందని తెలిపారు.
తన అభిమానులంతా తెలుగుభాషను పరిరక్షించే సైనికులు కావాలని, పుస్తకాలు చదవాలని పవన్ కల్యా ణ్ సందేశం ఇచ్చారు. పుస్తకాలు చదివి, సమాజంలో అన్యాయాలపై పోరాడేందుకు సిద్ధం కావాలని సూచించారు. “తెలుగు నేర్చుకోండి తెలుగు నిర్లక్ష్యం చేయకండి“ అని పిలుపునిచ్చారు. ఈ సందర్భం గా వైసీపీ హయాంలో తెలుగుపై తీసుకున్న నిర్ణయాన్ని ఆయన పరోక్షంగా దుయ్యబట్టారు. అప్పట్లో తెలుగు కాదు.. ఇంగ్లీషు ముద్దు అంటూ.. ప్రచారం చేసి.. పాఠశాలల్లో తెలుగు మీడియంను రద్దు చేసే ప్రయత్నం చేశారు.
ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన పవన్ కల్యాణ్.. “ఆంగ్లం అవసరమే కానీ, పేదరికం పారదోలేందు కు అది మార్గం కాదు. అందరూ ఇంగ్లీషే మాట్లాడే ఇంగ్లాండ్లో కూడా పేదరికం ఉంది“ అని చురకలు అంటించారు. రచయితలను కూడా ఈ సమాజం గౌరవించాలని సూచించారు. పుస్తకం చదవడం ద్వారా అభివృద్ధి చెందవచ్చని తెలిపారు. తాను చదువును మధ్యలోనే ఆపినా, పుస్తకాలు చదవడం ఆపలేదన్నారు. పుస్తకం జీవితంతోనూ, సమాజంలో అన్యాయాలతోనూ పోరాడే ధైర్యాన్నిస్తుందన్నారు. యువతీయువకులు కూడా పుస్తకాలు చదవడం మానవద్దని పవన్ సూచించారు.
This post was last modified on January 2, 2025 10:59 pm
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్షాలు ఇచ్చిన…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు…
శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం,…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఏపీలోని విపక్షం వైసీపీ మంగళవారం ఉదయం వినూత్న నిరసనకు దిగింది.…
ఏపీలో కూటమి పాలన ఎలాంటి ఇబ్బంది లేకుండానే సాగుతోంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ సాగడంతో పాటుగా…
ఇండస్ట్రీ, ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న క్షణం పెద్ది అనౌన్స్ మెంట్. ఏప్రిల్ 30 రావడం లేదని ప్రపంచం మొత్తం…