ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు… తప్పకుండా పాటించాలని కూడా ఆయన విన్నవించారు. తాజాగా విజయవాడలో పుస్తక మహో త్సవం(బుక్ ఎగ్జిబిషన్) ప్రారంభమైంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అభిమానులకు తాను ప్రాణమైతే, తనకు పుస్తకాలు ప్రాణమన్నారు. లక్షలాది మంది హృదయాలను ఆకట్టుకునే శక్తి తనకు పుస్తకాల వల్లనే వచ్చిందని తెలిపారు.
తన అభిమానులంతా తెలుగుభాషను పరిరక్షించే సైనికులు కావాలని, పుస్తకాలు చదవాలని పవన్ కల్యా ణ్ సందేశం ఇచ్చారు. పుస్తకాలు చదివి, సమాజంలో అన్యాయాలపై పోరాడేందుకు సిద్ధం కావాలని సూచించారు. “తెలుగు నేర్చుకోండి తెలుగు నిర్లక్ష్యం చేయకండి“ అని పిలుపునిచ్చారు. ఈ సందర్భం గా వైసీపీ హయాంలో తెలుగుపై తీసుకున్న నిర్ణయాన్ని ఆయన పరోక్షంగా దుయ్యబట్టారు. అప్పట్లో తెలుగు కాదు.. ఇంగ్లీషు ముద్దు అంటూ.. ప్రచారం చేసి.. పాఠశాలల్లో తెలుగు మీడియంను రద్దు చేసే ప్రయత్నం చేశారు.
ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన పవన్ కల్యాణ్.. “ఆంగ్లం అవసరమే కానీ, పేదరికం పారదోలేందు కు అది మార్గం కాదు. అందరూ ఇంగ్లీషే మాట్లాడే ఇంగ్లాండ్లో కూడా పేదరికం ఉంది“ అని చురకలు అంటించారు. రచయితలను కూడా ఈ సమాజం గౌరవించాలని సూచించారు. పుస్తకం చదవడం ద్వారా అభివృద్ధి చెందవచ్చని తెలిపారు. తాను చదువును మధ్యలోనే ఆపినా, పుస్తకాలు చదవడం ఆపలేదన్నారు. పుస్తకం జీవితంతోనూ, సమాజంలో అన్యాయాలతోనూ పోరాడే ధైర్యాన్నిస్తుందన్నారు. యువతీయువకులు కూడా పుస్తకాలు చదవడం మానవద్దని పవన్ సూచించారు.
This post was last modified on January 2, 2025 10:59 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…