Political News

నారా కుటుంబాన్ని రోడ్డెక్కించిన 2024 రాజ‌కీయం..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుటుంబం మొత్తం ఎప్పుడూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌రిస్థితి లేదు. ఆయ‌న కుమారుడు, ఆయ‌న కోడ‌లు బ్రాహ్మ‌ణి మాత్ర‌మే ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారం చేసిన ప‌రిస్థితి ఉండేది. మ‌హా అయితే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయన స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి కుప్పంలో ఒక‌టి రెండు రోజులు ప‌ర్య‌టించిన ప‌రిస్థితి ఉంది. కానీ.. రాజ‌కీయాల్లో తొలిసారి 2024లో నారా కుటుంబం యావ‌త్తు తొలి ఐదు మాసాలు.. రోడ్డెక్కిన ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపించింది. 2024 జ‌న‌వ‌రి నుంచి మేలో ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు నారా కుటుంబం ఇంటి బాట‌ప‌ట్టింది కేవ‌లం కొద్ది రోజులు మాత్ర‌మే.

నేరుగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేయ‌ని నారా భువ‌నేశ్వ‌రి.. చంద్ర‌బాబును జైల్లో పెట్టిన స‌మ‌యంలో ఆవేద‌న చెంది.. మృతి చెందిన కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌ను క‌లుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఆమె జ‌న‌వ‌రి నుంచే ప్రారంభించారు. ఎన్నిక‌లు అయ్యే వ‌ర‌కు కూడా దీనిని కొన‌సాగించారు. ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలోనూ ఆమె కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు వెళ్లారు. వారిని ఓదార్చారు. వైసీపీ సర్కారుపై మ‌హిళ‌ల్లో చైత‌న్యం ర‌గిలించి స‌మ‌ర శంఖం పూరించారు. త‌న‌దైన శైలిలో ఆమె వైసీపీ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. త‌ర్వాత కుప్పంలోనే రోజుల త‌ర‌బ‌డి ఉన్నారు.

అదేవిధంగా నారా వారి కోడ‌లు.. బ్రాహ్మ‌ణి కూడా.. రెండు మాసాల పాటు మంగ‌ళ‌గిరిలోనే తిష్ఠ‌వేశారు. గ‌తంలో 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో కేవ‌లం ప‌దిరోజులు మాత్ర‌మే నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ఆమె.. ఈ సంవ‌త్స‌రం జ‌రిగిన ఎన్నిక‌ల్లో తొలిసారి రెండు మాసాల పాటు ఇక్క‌డే ఉండి.. అన్ని వ‌ర్గాల‌ను క‌లుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి.. బొట్టు పెట్టి మ‌రీ త‌న భ‌ర్త‌నుగెలిపించాల‌ని కోరుకున్నారు. చేనేత కార్మికుల కుటుంబాల‌ను కూడా ఆమె క‌లుసుకున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. రాజ‌ధాని రైతుల ను క‌లుసుకున్నారు. ఇలా.. రెండు మాసాల పాటు క్యాంపెయిన్ నిర్విరామంగా సాగించారు.

వీరికంటే ముఖ్యంగా.. ఎన్న‌డూలేని విధంగా చివ‌ర‌కు అన్న‌గారు జీవించి ఉన్న రోజుల్లో కూడా.. రోడ్డెక్క‌ని నంద‌మూరి ఆడ‌ప‌డుచులు, మ‌న‌వ‌ళ్లు..మ‌న‌వ‌రాళ్లు సైతం ఈ ఏడాది రోడ్డెక్కారు. నంద‌మూరి వార‌సులు అంద‌రూ రోజుల త‌ర‌బ‌డి మంగ‌ళ‌గిరిలో మండు టెండ‌లో నారా లోకేష్ విజ‌యం కొసం శ్ర‌మించారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి గ‌డ‌ప‌కూ.. వెళ్లారు. ఓట్లు అర్థించారు. పవైసీపీ పాల‌న‌పై ఒక యుద్ధ‌మే చేశారు. మొత్తంగా చూస్తే.. నారా కుటుంబంతోపాటు, నంద‌మూరి కుటుంబాల‌ను కూడా.. 2024 రోడ్డెక్కించింది. అయితే.. అందుకు త‌గ్గ ఫ‌లితం ద‌క్క‌డం మాత్రం భారీ ఉర‌ట‌నే చెప్పాలి.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

4 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

6 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

8 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

8 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

9 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

9 hours ago