Political News

నారా కుటుంబాన్ని రోడ్డెక్కించిన 2024 రాజ‌కీయం..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుటుంబం మొత్తం ఎప్పుడూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌రిస్థితి లేదు. ఆయ‌న కుమారుడు, ఆయ‌న కోడ‌లు బ్రాహ్మ‌ణి మాత్ర‌మే ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారం చేసిన ప‌రిస్థితి ఉండేది. మ‌హా అయితే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయన స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి కుప్పంలో ఒక‌టి రెండు రోజులు ప‌ర్య‌టించిన ప‌రిస్థితి ఉంది. కానీ.. రాజ‌కీయాల్లో తొలిసారి 2024లో నారా కుటుంబం యావ‌త్తు తొలి ఐదు మాసాలు.. రోడ్డెక్కిన ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపించింది. 2024 జ‌న‌వ‌రి నుంచి మేలో ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు నారా కుటుంబం ఇంటి బాట‌ప‌ట్టింది కేవ‌లం కొద్ది రోజులు మాత్ర‌మే.

నేరుగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేయ‌ని నారా భువ‌నేశ్వ‌రి.. చంద్ర‌బాబును జైల్లో పెట్టిన స‌మ‌యంలో ఆవేద‌న చెంది.. మృతి చెందిన కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌ను క‌లుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఆమె జ‌న‌వ‌రి నుంచే ప్రారంభించారు. ఎన్నిక‌లు అయ్యే వ‌ర‌కు కూడా దీనిని కొన‌సాగించారు. ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలోనూ ఆమె కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు వెళ్లారు. వారిని ఓదార్చారు. వైసీపీ సర్కారుపై మ‌హిళ‌ల్లో చైత‌న్యం ర‌గిలించి స‌మ‌ర శంఖం పూరించారు. త‌న‌దైన శైలిలో ఆమె వైసీపీ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. త‌ర్వాత కుప్పంలోనే రోజుల త‌ర‌బ‌డి ఉన్నారు.

అదేవిధంగా నారా వారి కోడ‌లు.. బ్రాహ్మ‌ణి కూడా.. రెండు మాసాల పాటు మంగ‌ళ‌గిరిలోనే తిష్ఠ‌వేశారు. గ‌తంలో 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో కేవ‌లం ప‌దిరోజులు మాత్ర‌మే నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ఆమె.. ఈ సంవ‌త్స‌రం జ‌రిగిన ఎన్నిక‌ల్లో తొలిసారి రెండు మాసాల పాటు ఇక్క‌డే ఉండి.. అన్ని వ‌ర్గాల‌ను క‌లుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి.. బొట్టు పెట్టి మ‌రీ త‌న భ‌ర్త‌నుగెలిపించాల‌ని కోరుకున్నారు. చేనేత కార్మికుల కుటుంబాల‌ను కూడా ఆమె క‌లుసుకున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. రాజ‌ధాని రైతుల ను క‌లుసుకున్నారు. ఇలా.. రెండు మాసాల పాటు క్యాంపెయిన్ నిర్విరామంగా సాగించారు.

వీరికంటే ముఖ్యంగా.. ఎన్న‌డూలేని విధంగా చివ‌ర‌కు అన్న‌గారు జీవించి ఉన్న రోజుల్లో కూడా.. రోడ్డెక్క‌ని నంద‌మూరి ఆడ‌ప‌డుచులు, మ‌న‌వ‌ళ్లు..మ‌న‌వ‌రాళ్లు సైతం ఈ ఏడాది రోడ్డెక్కారు. నంద‌మూరి వార‌సులు అంద‌రూ రోజుల త‌ర‌బ‌డి మంగ‌ళ‌గిరిలో మండు టెండ‌లో నారా లోకేష్ విజ‌యం కొసం శ్ర‌మించారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి గ‌డ‌ప‌కూ.. వెళ్లారు. ఓట్లు అర్థించారు. పవైసీపీ పాల‌న‌పై ఒక యుద్ధ‌మే చేశారు. మొత్తంగా చూస్తే.. నారా కుటుంబంతోపాటు, నంద‌మూరి కుటుంబాల‌ను కూడా.. 2024 రోడ్డెక్కించింది. అయితే.. అందుకు త‌గ్గ ఫ‌లితం ద‌క్క‌డం మాత్రం భారీ ఉర‌ట‌నే చెప్పాలి.

This post was last modified on December 31, 2024 5:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రావణుడిని అంత గొప్పగా చూపించగలరా

ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…

2 hours ago

బ్రేకింగ్: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…

3 hours ago

డెకాయిట్ అంచనాల మీటర్ ఎలా ఉంది

ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల…

3 hours ago

ఈసీని విపక్షాలు ఏం చెయ్యలేవా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు ఇచ్చిన…

4 hours ago

ఒంట‌రి పోరు వెనుక `విజ‌య్‌` ర‌హ‌స్యం బయటపడిందా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు…

4 hours ago

బైకర్ స్పీడ్ ఇంకా పెరగాలి

శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం,…

4 hours ago