Political News

నారా కుటుంబాన్ని రోడ్డెక్కించిన 2024 రాజ‌కీయం..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుటుంబం మొత్తం ఎప్పుడూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌రిస్థితి లేదు. ఆయ‌న కుమారుడు, ఆయ‌న కోడ‌లు బ్రాహ్మ‌ణి మాత్ర‌మే ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారం చేసిన ప‌రిస్థితి ఉండేది. మ‌హా అయితే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయన స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి కుప్పంలో ఒక‌టి రెండు రోజులు ప‌ర్య‌టించిన ప‌రిస్థితి ఉంది. కానీ.. రాజ‌కీయాల్లో తొలిసారి 2024లో నారా కుటుంబం యావ‌త్తు తొలి ఐదు మాసాలు.. రోడ్డెక్కిన ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపించింది. 2024 జ‌న‌వ‌రి నుంచి మేలో ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు నారా కుటుంబం ఇంటి బాట‌ప‌ట్టింది కేవ‌లం కొద్ది రోజులు మాత్ర‌మే.

నేరుగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేయ‌ని నారా భువ‌నేశ్వ‌రి.. చంద్ర‌బాబును జైల్లో పెట్టిన స‌మ‌యంలో ఆవేద‌న చెంది.. మృతి చెందిన కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌ను క‌లుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఆమె జ‌న‌వ‌రి నుంచే ప్రారంభించారు. ఎన్నిక‌లు అయ్యే వ‌ర‌కు కూడా దీనిని కొన‌సాగించారు. ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలోనూ ఆమె కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు వెళ్లారు. వారిని ఓదార్చారు. వైసీపీ సర్కారుపై మ‌హిళ‌ల్లో చైత‌న్యం ర‌గిలించి స‌మ‌ర శంఖం పూరించారు. త‌న‌దైన శైలిలో ఆమె వైసీపీ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. త‌ర్వాత కుప్పంలోనే రోజుల త‌ర‌బ‌డి ఉన్నారు.

అదేవిధంగా నారా వారి కోడ‌లు.. బ్రాహ్మ‌ణి కూడా.. రెండు మాసాల పాటు మంగ‌ళ‌గిరిలోనే తిష్ఠ‌వేశారు. గ‌తంలో 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో కేవ‌లం ప‌దిరోజులు మాత్ర‌మే నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ఆమె.. ఈ సంవ‌త్స‌రం జ‌రిగిన ఎన్నిక‌ల్లో తొలిసారి రెండు మాసాల పాటు ఇక్క‌డే ఉండి.. అన్ని వ‌ర్గాల‌ను క‌లుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి.. బొట్టు పెట్టి మ‌రీ త‌న భ‌ర్త‌నుగెలిపించాల‌ని కోరుకున్నారు. చేనేత కార్మికుల కుటుంబాల‌ను కూడా ఆమె క‌లుసుకున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. రాజ‌ధాని రైతుల ను క‌లుసుకున్నారు. ఇలా.. రెండు మాసాల పాటు క్యాంపెయిన్ నిర్విరామంగా సాగించారు.

వీరికంటే ముఖ్యంగా.. ఎన్న‌డూలేని విధంగా చివ‌ర‌కు అన్న‌గారు జీవించి ఉన్న రోజుల్లో కూడా.. రోడ్డెక్క‌ని నంద‌మూరి ఆడ‌ప‌డుచులు, మ‌న‌వ‌ళ్లు..మ‌న‌వ‌రాళ్లు సైతం ఈ ఏడాది రోడ్డెక్కారు. నంద‌మూరి వార‌సులు అంద‌రూ రోజుల త‌ర‌బ‌డి మంగ‌ళ‌గిరిలో మండు టెండ‌లో నారా లోకేష్ విజ‌యం కొసం శ్ర‌మించారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి గ‌డ‌ప‌కూ.. వెళ్లారు. ఓట్లు అర్థించారు. పవైసీపీ పాల‌న‌పై ఒక యుద్ధ‌మే చేశారు. మొత్తంగా చూస్తే.. నారా కుటుంబంతోపాటు, నంద‌మూరి కుటుంబాల‌ను కూడా.. 2024 రోడ్డెక్కించింది. అయితే.. అందుకు త‌గ్గ ఫ‌లితం ద‌క్క‌డం మాత్రం భారీ ఉర‌ట‌నే చెప్పాలి.

This post was last modified on December 31, 2024 5:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో ‘ఆ రాజ్యాంగ ప‌ద‌వులు’ వైసీపీకి ద‌క్క‌లేదు!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం చేసే ఖ‌ర్చులు, తీసుకునే నిర్ణ‌యాల‌ను స‌మీక్షించి.. నిర్ణ‌యం తీసుకునేందుకు ప్ర‌త్యేకంగా మూడు క‌మిటీలు ఉంటాయి. ఇది…

10 minutes ago

ప్ర‌జల సంతృప్తి.. చంద్ర‌బాబు అసంతృప్తి!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న ప్రారంభించి.. ఏడు మాసాలు పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఏమనుకుంటున్నారు? ఫీడ్ బ్యాక్ ఏంటి?…

1 hour ago

రెట్రో : 42 వయసులో శ్రియ స్పెషల్ సాంగ్…

పాతికేళ్ల క్రితం 2001 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్,…

2 hours ago

జ‌గ‌న్‌ను మ‌రోసారి ఏకేసిన‌ ష‌ర్మిల

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్.. లండ‌న్ నుంచి ఇలా వ‌చ్చారో లేదో.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు,…

2 hours ago

జూనియర్ అభిమానులు ఎందుకు ఫీలయ్యారు

జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ని కలుసుకోవడానికి త్వరలోనే ఒక వేడుక ఏర్పాటు చేస్తానని, అప్పటిదాకా ఓపిగ్గా ఎదురు చూడమని…

3 hours ago

దొంగోడి లవ్.. ప్రేయసికి గిఫ్ట్ గా రూ.3 కోట్ల ఇల్లు..

బెంగళూరులో ఇటీవల అరెస్టైన ఓ దొంగ కథ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 37 ఏళ్ల పంచాక్షరి స్వామి అనే…

3 hours ago