Political News

“ఇవ‌న్నీ జ‌రుగుతుంటాయండీ.. పోలీసులంతే”… అన్నారు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ పోలీసుల ప‌నితీరుపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోలీసు అధికారుల తీరు స‌రిగాలేద‌ని చెప్పారు. వారి స్పంద‌న బాగుంటే.. మెరుగైన ఫ‌లితం రాబ‌ట్టుకోవ‌చ్చ‌న్నారు. కానీ, అలా లేద‌ని చెప్పారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప‌లు విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. ప్ర‌ధానంగా పోలీసుల ప‌నితీరు, ఉద్యోగుల అవినీతి, వారి సెల‌వులు వంటి విష‌యాల‌పై త‌న మ‌న‌సులో మాట‌ను మీడియాకు చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా పోలీసుల‌పై మాట్లాడుతూ.. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

“కాకినాడలో ఇటీవ‌ల ఓ ప్ర‌మాదం జ‌రిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్ద‌రు యువ‌కులు ప్ర‌మాదం జ‌రిగి చ‌నిపోయారు. వీరిలో ఒక‌రు బ్రెయిన్ డెడ్ అయ్యారు. అయితే.. కేసు న‌మోదు చేయలేద‌ని.. ఆ యువ‌కుల కుటుంబ స‌భ్యులు చెప్పారు. ఈ విష‌యం నాదాకా వ‌చ్చిన త‌ర్వాత‌.. మా కార్యాల‌య అధికారిని.. జిల్లా ఎస్పీతో మాట్లాడ‌మ‌ని చెప్పాను. దీంతో ఆయ‌న ఎస్పీతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌..”ఇలాంటి వ‌న్నీ జ‌రుగుతుంటాయండి. పోలీసులంతే” అని లైట్‌గా వ్యాఖ్యానించారు. ఇలా అయితే.. పోలీసుల పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం ఎలా క‌లుగుతుంది?” అని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శ్నించారు.

అవినీతి పెచ్చుపెరిగిపోయింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. “అధికారుల ప‌నితీరును బేరీజు వేసే వ్య‌వ‌స్థ‌ను వైసీపీ నాశ‌నం చేసిం ది. దీంతో ఎవ‌రి ఇష్టం వారిదే అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది. ఇది అవినీతికి కూడా దారి తీసింది. అస‌లు అవినీతి, లంచాలు అనేవి త‌మ హ‌క్కుగా అధికారులు భావించే ప‌రిస్థితి కూడా ఏర్పడింది” అని ప‌వ‌న్ అన్నారు. ఈ ప‌రిస్థితిని స‌మూలంగా మార్చాలంటే.. జిల్లాల ప‌ర్య‌ట‌న‌లే బెస్ట్ అని వ్యాఖ్యానించారు. జిల్లాల‌కు వెళ్లి అక్క‌డే తిష్ఠ‌వేయ‌డం ద్వారా.. ప‌రిస్థితిలో మార్పు తీసుకురావ‌చ్చ‌న్నారు. అయితే.. దీనికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. తానే తొలుత జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు రెడీ అవుతాన‌ని చెప్పారు.

ఇక‌, ఉద్యోగుల సెల‌వుల విష‌యంపైనా ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వారానికి రెండు రోజుల పాటు సెల‌వులు కావాల‌ని అధికారులు కొరుకుంటున్నార‌ని చెప్పారు. అయితే.. ఐదురోజుల పాటు స‌క్ర‌మంగా అలుపెరుగ‌ని విధంగా ప‌నిచేస్తే.. చివ‌రి రెండు రోజులు శ‌ని, ఆదివారాలు సెల‌వు తీసుకోవ‌డం త‌ప్పుకాద‌ని.. కానీ, అలా చేయ‌డం లేద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ప‌ని చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే స‌మ‌స్య‌లు పెరుగుతున్న‌ట్టు చెప్పారు. అందుకే చంద్ర‌బాబు అధికారుల‌కు గంట‌ల త‌ర‌బ‌డి క్లాస్ ఇస్తున్నార‌ని చెప్పారు. అయినా.. వారిలో మార్పు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌ని.. వారిలో మార్పు వ‌స్తే.. వారానికి రెండు రోజ‌లు సెల‌వు తీసుకున్నా… ప‌నులు జ‌రుగుతాయ‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on December 30, 2024 8:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీజేపీ కూటమితో విజ‌య్ క‌లుస్తారా?.. ఏం జ‌రుగుతుంది?

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న విజ‌య్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…

3 minutes ago

‘టైగర్ తమ్ముళ్ల’ ఆశలు మళ్లీ చిగురించాయి

లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…

7 minutes ago

JD చక్రవర్తిని ఇలాగేనా వాడుకోవడం

శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…

14 minutes ago

విజ‌య్‌ను క‌ట్ట‌డి చేయ‌డ‌మే వాళ్ళ కొంప ముంచిందా?

త‌మిళ‌నాట జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ విజ‌య‌దుందుభి మోగించారు. ఏక‌ప‌క్షంగా 110 స్థానాల్లో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా…

24 minutes ago

జాక్ పాట్ కొట్టిన జన నాయకుడు

నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…

51 minutes ago

రాకెట్ లా దూసుకుపోతున్న దళపతి పార్టీ

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర…

1 hour ago