Political News

“ఇవ‌న్నీ జ‌రుగుతుంటాయండీ.. పోలీసులంతే”… అన్నారు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ పోలీసుల ప‌నితీరుపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోలీసు అధికారుల తీరు స‌రిగాలేద‌ని చెప్పారు. వారి స్పంద‌న బాగుంటే.. మెరుగైన ఫ‌లితం రాబ‌ట్టుకోవ‌చ్చ‌న్నారు. కానీ, అలా లేద‌ని చెప్పారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప‌లు విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. ప్ర‌ధానంగా పోలీసుల ప‌నితీరు, ఉద్యోగుల అవినీతి, వారి సెల‌వులు వంటి విష‌యాల‌పై త‌న మ‌న‌సులో మాట‌ను మీడియాకు చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా పోలీసుల‌పై మాట్లాడుతూ.. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

“కాకినాడలో ఇటీవ‌ల ఓ ప్ర‌మాదం జ‌రిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్ద‌రు యువ‌కులు ప్ర‌మాదం జ‌రిగి చ‌నిపోయారు. వీరిలో ఒక‌రు బ్రెయిన్ డెడ్ అయ్యారు. అయితే.. కేసు న‌మోదు చేయలేద‌ని.. ఆ యువ‌కుల కుటుంబ స‌భ్యులు చెప్పారు. ఈ విష‌యం నాదాకా వ‌చ్చిన త‌ర్వాత‌.. మా కార్యాల‌య అధికారిని.. జిల్లా ఎస్పీతో మాట్లాడ‌మ‌ని చెప్పాను. దీంతో ఆయ‌న ఎస్పీతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌..”ఇలాంటి వ‌న్నీ జ‌రుగుతుంటాయండి. పోలీసులంతే” అని లైట్‌గా వ్యాఖ్యానించారు. ఇలా అయితే.. పోలీసుల పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం ఎలా క‌లుగుతుంది?” అని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శ్నించారు.

అవినీతి పెచ్చుపెరిగిపోయింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. “అధికారుల ప‌నితీరును బేరీజు వేసే వ్య‌వ‌స్థ‌ను వైసీపీ నాశ‌నం చేసిం ది. దీంతో ఎవ‌రి ఇష్టం వారిదే అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది. ఇది అవినీతికి కూడా దారి తీసింది. అస‌లు అవినీతి, లంచాలు అనేవి త‌మ హ‌క్కుగా అధికారులు భావించే ప‌రిస్థితి కూడా ఏర్పడింది” అని ప‌వ‌న్ అన్నారు. ఈ ప‌రిస్థితిని స‌మూలంగా మార్చాలంటే.. జిల్లాల ప‌ర్య‌ట‌న‌లే బెస్ట్ అని వ్యాఖ్యానించారు. జిల్లాల‌కు వెళ్లి అక్క‌డే తిష్ఠ‌వేయ‌డం ద్వారా.. ప‌రిస్థితిలో మార్పు తీసుకురావ‌చ్చ‌న్నారు. అయితే.. దీనికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. తానే తొలుత జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు రెడీ అవుతాన‌ని చెప్పారు.

ఇక‌, ఉద్యోగుల సెల‌వుల విష‌యంపైనా ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వారానికి రెండు రోజుల పాటు సెల‌వులు కావాల‌ని అధికారులు కొరుకుంటున్నార‌ని చెప్పారు. అయితే.. ఐదురోజుల పాటు స‌క్ర‌మంగా అలుపెరుగ‌ని విధంగా ప‌నిచేస్తే.. చివ‌రి రెండు రోజులు శ‌ని, ఆదివారాలు సెల‌వు తీసుకోవ‌డం త‌ప్పుకాద‌ని.. కానీ, అలా చేయ‌డం లేద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ప‌ని చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే స‌మ‌స్య‌లు పెరుగుతున్న‌ట్టు చెప్పారు. అందుకే చంద్ర‌బాబు అధికారుల‌కు గంట‌ల త‌ర‌బ‌డి క్లాస్ ఇస్తున్నార‌ని చెప్పారు. అయినా.. వారిలో మార్పు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌ని.. వారిలో మార్పు వ‌స్తే.. వారానికి రెండు రోజ‌లు సెల‌వు తీసుకున్నా… ప‌నులు జ‌రుగుతాయ‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on December 30, 2024 8:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

9 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

45 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago