Political News

“ఇవ‌న్నీ జ‌రుగుతుంటాయండీ.. పోలీసులంతే”… అన్నారు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ పోలీసుల ప‌నితీరుపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోలీసు అధికారుల తీరు స‌రిగాలేద‌ని చెప్పారు. వారి స్పంద‌న బాగుంటే.. మెరుగైన ఫ‌లితం రాబ‌ట్టుకోవ‌చ్చ‌న్నారు. కానీ, అలా లేద‌ని చెప్పారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప‌లు విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. ప్ర‌ధానంగా పోలీసుల ప‌నితీరు, ఉద్యోగుల అవినీతి, వారి సెల‌వులు వంటి విష‌యాల‌పై త‌న మ‌న‌సులో మాట‌ను మీడియాకు చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా పోలీసుల‌పై మాట్లాడుతూ.. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

“కాకినాడలో ఇటీవ‌ల ఓ ప్ర‌మాదం జ‌రిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్ద‌రు యువ‌కులు ప్ర‌మాదం జ‌రిగి చ‌నిపోయారు. వీరిలో ఒక‌రు బ్రెయిన్ డెడ్ అయ్యారు. అయితే.. కేసు న‌మోదు చేయలేద‌ని.. ఆ యువ‌కుల కుటుంబ స‌భ్యులు చెప్పారు. ఈ విష‌యం నాదాకా వ‌చ్చిన త‌ర్వాత‌.. మా కార్యాల‌య అధికారిని.. జిల్లా ఎస్పీతో మాట్లాడ‌మ‌ని చెప్పాను. దీంతో ఆయ‌న ఎస్పీతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌..”ఇలాంటి వ‌న్నీ జ‌రుగుతుంటాయండి. పోలీసులంతే” అని లైట్‌గా వ్యాఖ్యానించారు. ఇలా అయితే.. పోలీసుల పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం ఎలా క‌లుగుతుంది?” అని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శ్నించారు.

అవినీతి పెచ్చుపెరిగిపోయింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. “అధికారుల ప‌నితీరును బేరీజు వేసే వ్య‌వ‌స్థ‌ను వైసీపీ నాశ‌నం చేసిం ది. దీంతో ఎవ‌రి ఇష్టం వారిదే అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది. ఇది అవినీతికి కూడా దారి తీసింది. అస‌లు అవినీతి, లంచాలు అనేవి త‌మ హ‌క్కుగా అధికారులు భావించే ప‌రిస్థితి కూడా ఏర్పడింది” అని ప‌వ‌న్ అన్నారు. ఈ ప‌రిస్థితిని స‌మూలంగా మార్చాలంటే.. జిల్లాల ప‌ర్య‌ట‌న‌లే బెస్ట్ అని వ్యాఖ్యానించారు. జిల్లాల‌కు వెళ్లి అక్క‌డే తిష్ఠ‌వేయ‌డం ద్వారా.. ప‌రిస్థితిలో మార్పు తీసుకురావ‌చ్చ‌న్నారు. అయితే.. దీనికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. తానే తొలుత జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు రెడీ అవుతాన‌ని చెప్పారు.

ఇక‌, ఉద్యోగుల సెల‌వుల విష‌యంపైనా ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వారానికి రెండు రోజుల పాటు సెల‌వులు కావాల‌ని అధికారులు కొరుకుంటున్నార‌ని చెప్పారు. అయితే.. ఐదురోజుల పాటు స‌క్ర‌మంగా అలుపెరుగ‌ని విధంగా ప‌నిచేస్తే.. చివ‌రి రెండు రోజులు శ‌ని, ఆదివారాలు సెల‌వు తీసుకోవ‌డం త‌ప్పుకాద‌ని.. కానీ, అలా చేయ‌డం లేద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ప‌ని చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే స‌మ‌స్య‌లు పెరుగుతున్న‌ట్టు చెప్పారు. అందుకే చంద్ర‌బాబు అధికారుల‌కు గంట‌ల త‌ర‌బ‌డి క్లాస్ ఇస్తున్నార‌ని చెప్పారు. అయినా.. వారిలో మార్పు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌ని.. వారిలో మార్పు వ‌స్తే.. వారానికి రెండు రోజ‌లు సెల‌వు తీసుకున్నా… ప‌నులు జ‌రుగుతాయ‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on December 30, 2024 8:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

5 minutes ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

21 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

1 hour ago

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago