జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఏపీ కేబినెట్ లో చోటు దక్కబోతోందని అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. జనసేనలో పవన్ తో పాటు కీలకంగా వ్యవహరించిన నాగబాబుకు ఖాళీగా ఉన్న మంత్రి పదవిని ఇవ్వబోతున్నారని ఖరారయింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ మీడియాతో చిట్ చాట్ చేసినట్లు తెలుస్తోంది.
నాగబాబును మొదట ఎమ్మెల్సీని చేస్తామని, ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వడం గురించి ఆలోచిస్తామని పవన్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సందర్భంగా అన్నారట. అయితే, కుల సమీకరణాలతో, బంధు ప్రీతితో తన సోదరుడు నాగబాబును ఎమ్మెల్సీని చేయడం లేదని, పార్టీలో తనతోపాటు సమానంగా చాలాకాలం నుంచి కష్టపడుతూ వస్తున్నారు కాబట్టే ఆ పదవి దక్కనుందని పవన్ అన్నారట.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ది ఏ కులమో తనకు తెలీదని, ఆయన పనితీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చానని పవన్ గుర్తు చేశారట. రాజకీయాల్లో కులం ప్రామాణికం కాదని, పనితీరే కొలమానం అని అన్నారట. రాజ్యసభ సీటును నాగబాబు త్యాగం చేశారని, కాబట్టి ఎమ్మెల్సీ చేద్దామనుకుంటున్నామని అన్నారు. తనతో సమానంగా కష్టపడి పనిచేసినవారిని తాను చూసుకోవాలని చెప్పారట.
రాజ్యసభ సీటును నాగబాబు త్యాగం చేశారని, తనతో సమానంగా కష్టపడి పనిచేసినవారిని తాను చూసుకోవాలని చెప్పారట. నాగబాబు విషయంలో వారసత్వ రాజకీయాలు అని అడుగుతారని, కానీ, వైఎస్ జగన్ విషయంలో మాత్రం అడగరని మీడియా ప్రతినిధులతో పవన్ వ్యాఖ్యానించారట. నాగబాబుకు మంత్రి పదవి దక్కనుందన్న ప్రచారం నేపథ్యంలో పవన్ పై కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on December 30, 2024 3:10 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…