Political News

మోడీ కోసం బాబు: ఎన్ని భ‌రిస్తున్నారంటే.. !

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్రమోడీతో ఉన్న గ్యాప్‌ను దాదాపు త‌గ్గించుకునే దిశ‌గా సీఎం చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా మోడీ ఏం చెప్పినా.. చంద్ర‌బాబు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే అదానీతో ఉన్న సౌర విద్యుత్ ఒప్పందాల‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని అనుకున్నా.. మోడీ అనుచ‌రుడు కావ‌డంతో అదానీతో స‌ఖ్య‌త లేక‌పోయినా.. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నా.. స‌ద‌రు ఒప్పందాల‌ను మాత్రం చంద్ర‌బాబు ర‌ద్దు చేసుకోలేక పోతున్నారు.

అదేవిధంగా స్మార్టు మీట‌ర్ల విష‌యంలోనూ జ‌గ‌న్ చేసిన ఒప్పందాల‌ను ర‌ద్దు చేసుకోలేక పోతున్నారు. దీనికి సంబంధించిన భారాలు ప్ర‌జ‌ల‌పై ప‌డుతున్నాయ‌ని చంద్ర‌బాబు చెబుతున్నా.. మోడీ కోసం.. ఈ ఒప్పందాన్ని కూడా భ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. కానీ, మ‌న‌సులో మాత్రం ర‌ద్దు చేసుకోవాల‌నే ఉంది. అయితే.. ఈ స్మార్టు మీట‌ర్లు కూడా.. అదానీకి చెందిన సంస్థ‌వే కావ‌డంతో చంద్ర‌బాబు సాహ‌సం చేయ‌లేక పోతున్నారు. ఇలా.. అనేక విష‌యాల్లో మోడీతో చెలిమి కోసం చంద్ర‌బాబు త‌పిస్తున్నారు.

ఇక‌, ఇప్పుడు మ‌రో కీల‌క విష‌యాన్ని కూడా చంద్ర‌బాబు త‌న భుజాల‌పైకి ఎత్తుకున్నారు. అదే జ‌మిలి ఎన్నిక‌లు. వ‌న్ నేష‌న్‌-వ‌న్ ఎల‌క్ష‌న్ పేరుతో కేంద్రంలోని మోడీ స‌ర్కారు తీసుకువ‌చ్చిన బిల్లు ప్ర‌స్తుతం లోక్‌స‌భ‌లో ఉంది. దీనిపై సంయుక్త పార్ల‌మెంట‌రీ క‌మిటీని ఏర్పాటు చేశారు. అయితే.. దీనిపై క‌మిటీ రిపోర్టు వ‌చ్చేందుకు మూడు మాసాల వ‌ర‌కు గ‌డువు ఉంటుంది. ఇంత‌లో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు చెందిన ముఖ్య‌మంత్రులు.. ఇత‌ర పార్టీల‌ను ఒప్పించాల్సి ఉంది.

నిజానికి త‌మిళ‌నాడు, క‌ర్ణాక‌ట‌, తెలంగాణ‌, ఒడిశాలోని ప్ర‌తిప‌క్షం వంటివి జ‌మిలికి ఒప్పుకోవ‌డం లేదు. అయితే.. వీరంతా కూడా.. చంద్ర‌బాబుకు స‌న్నిహితులు. ఒక్క క‌ర్ణాట‌క‌లో సిద్ద‌రామ‌య్య మిన‌హా.. మిగిలిన రాష్ట్రాల నేత‌లు.. ప్ర‌తిప‌క్ష నాయ‌కులుకూడా చంద్ర‌బాబుకు మిత్రులే. ఈ క్ర‌మంలో వారిని ఒప్పించే బాధ్య‌త‌ల‌ను మోడీ ఇప్పుడు చంద్ర‌బాబు భుజాల‌పై పెట్టిన‌ట్టు జాతీయ మీడియా చెబుతోంది. ఇటీవ‌ల డిల్లీ ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబుతో ఈ విష‌యం మోడీ చ‌ర్చించార‌ని.. కొంత బాధ్య‌త తీసుకోవాల‌నికోర‌న‌ట్టు స‌మాచారం. దీనికి చంద్ర‌బాబు కూడా ఓకే చెప్పార‌ని తెలిసింది. దీంతో జ‌మిలి బాధ్య‌త‌ల్లో కీల‌క పాత్ర ఇప్పుడు చంద్ర‌బాబు పై ప‌డింది. మ‌రి ఎలా సాధిస్తారో చూడాలి.

This post was last modified on December 27, 2024 11:29 am

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

52 minutes ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

2 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago