Political News

మరణశిక్షపై ట్రంప్ కఠిన వైఖరి!

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్ మరణశిక్ష అమలుపై తన కఠినమైన వైఖరిని వ్యక్తం చేశారు. అత్యంత క్రూరమైన నేరస్తులకు మరణశిక్ష తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. రేపిస్టులు, హంతకులు వంటి ఘోర నేరస్తులను క్షమించే అవకాశం తన పరిపాలనలో ఉండదని, న్యాయశాఖకు తగిన ఆదేశాలు జారీ చేస్తానని ట్రంప్ పేర్కొన్నారు. సమాజ శాంతి భద్రతల పునరుద్ధరణకు ఈ నిర్ణయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం అమెరికాలో మరణశిక్ష విధానం వివాదాస్పదంగా మారింది. 50 రాష్ట్రాలలో 23 రాష్ట్రాలు మరణశిక్షను పూర్తిగా రద్దు చేయగా, మరో ఆరు రాష్ట్రాలు తాత్కాలికంగా నిలిపివేశాయి. మిగిలిన రాష్ట్రాల్లోనే మరణశిక్ష అమలవుతోంది. అయితే, ఈ శిక్షలను చాలా అరుదుగా అమలు చేస్తుండటంతో దీనిపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1988 నుంచి ఇప్పటి వరకు 79 మందికి మరణశిక్ష విధించగా, కేవలం 16 మందికి మాత్రమే అమలు చేశారు.

డొనాల్డ్ ట్రంప్ తన మొదటి అధ్యక్షత్వ కాలంలో ఈ వ్యవహారంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఆరునెలల కాలంలోనే 13 మందికి మరణశిక్ష అమలు చేయించారు. అయితే, తాజాగా జో బైడెన్ ప్రక్షిప్త నిర్ణయాలు తీసుకుంటూ, మరణశిక్ష పడిన 40 మంది ఖైదీలలో 37 మందికి శిక్షలను తగ్గించారు. ఈ చర్యను ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు.

“అత్యంత క్రూరమైన నేరస్తులను క్షమించడం సమాజానికి అపాయం,” అని ట్రంప్ అభిప్రాయపడ్డారు. తన అధ్యక్షత్వ కాలంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోబోనని స్పష్టంగా ప్రకటించారు. ఫెడరల్ ఖైదీల విషయంలో కఠినంగా ఉండటం మాత్రమే సమాజంలో న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని కలిగించగలదని ట్రంప్ అన్నారు. ఆయన ఈ నిర్ణయాల వల్ల మరణశిక్ష విధానం అమెరికాలో మళ్లీ ప్రధాన చర్చగా మారింది.

This post was last modified on December 25, 2024 7:36 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

9 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago