తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం, కేటీఆర్ పై ఎఫ్ ఐఆర్ నమోదు కావడం సంచలనం రేపింది. అయితే, సభలో ఆ వ్యవహారంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేసిన కేటీఆర్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటే కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఆ కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత విచారణ జరపనుంది. క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి సమాచార లోపం ఉందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు.
తనపై పెట్టిన కేసు నిలబడదని కేటీఆర్ అన్నారు. ఆ రేసులో అవినీతి జరగలేదని మంత్రి పొన్నం అన్నారని, అటువంటపుడు కేసు ఎలా నిలబడుతుందని ప్రశ్నించారు. అయితే, ఆ నిధుల మళ్లింపులో కేటీఆర్ హస్తం ఉందని, ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి నిధులు విడుదల చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏసీబీ అధికారుల విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, రేపో మాపో కేటీఆర్ అరెస్టు ఖాయమని వారు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates