Corona In Telangana
మొన్న ఏడు కేసులు.. నిన్న రెండు కేసులు.. నేడేమో ఆరు కేసులు.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల అప్ డేట్స్ ఇవి. ఓవైపు ఆంధ్రప్రదేశ్లో రోజూ 70-80కి తక్కువ కాకుండా కేసులు బయటికి వస్తున్నాయి. ఒక్కో జిల్లాలో పదుల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం పదో వంతు కేసులు కూడా వెలుగులోకి రావట్లేదు.
కేసుల సంఖ్యను బట్టి చూస్తే ఇక్కడ కరోనా ప్రభావం బాగా తగ్గిపోయినట్లే కనిపిస్తోంది. అతి త్వరలో కరోనా ఫ్రీ స్టేట్గా తెలంగాణ మారుతుందని అంటున్నారు. కేసుల సంఖ్య చూసి అయితే రాష్ట్ర వాసులు హమ్మయ్యా అనుకుంటున్నారు.
కానీ అదే సమయంలో ఈ నంబర్లు కరెక్టేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఏపీలో కరోనా కేసుల సంఖ్య చాలా పెద్దగా కనిపిస్తుండటానికి అక్కడ పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేస్తుండటమే కారణం అంటున్నారు.
ఏపీ దేశంలోనే అత్యధికంగా టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటి. తెలంగాణ పరిస్థితి దానికి పూర్తి భిన్నం. టెస్టుల నిర్వహణలో బాగా వెనుకబడి ఉంది. టెస్టులు చేయకపోవడం వల్లే ఇక్కడ పెద్దగా కేసులు బయటపడటం లేదని అంటున్నారు. కానీ అవసరం లేకున్నా ఇష్టానుసారం టెస్టులు చేయడంలో అర్థమేముందని ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అంటున్నారు.
కేసీఆర్ కూడా టెస్టుల విషయంలో ఏపీకి, తెలంగాణకు పోలిక పెట్టడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఎక్కువ టెస్టులు చేస్తే ఏమైనా ప్రైజులిస్తారా అన్నారు. లక్షణాలు ఉంటేనే కదా టెస్టులు చేస్తాం అన్నది తెలంగాణ ప్రభుత్వ పెద్దల వాదనగా ఉంది.
కానీ హైదరాబాద్ లాంటి చోట్ల కరోనా నివురు గప్పిన నిప్పులా ఉందని.. ఈ కేసుల సంఖ్యను చూసి మురిసిపోతే.. ఉన్నట్లుండి వైరస్ విజృంభించవచ్చని.. రాబోయే రోజుల్లో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగొచ్చని.. కాబట్టి జాగ్రత్త పడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…