Corona In Telangana
మొన్న ఏడు కేసులు.. నిన్న రెండు కేసులు.. నేడేమో ఆరు కేసులు.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల అప్ డేట్స్ ఇవి. ఓవైపు ఆంధ్రప్రదేశ్లో రోజూ 70-80కి తక్కువ కాకుండా కేసులు బయటికి వస్తున్నాయి. ఒక్కో జిల్లాలో పదుల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం పదో వంతు కేసులు కూడా వెలుగులోకి రావట్లేదు.
కేసుల సంఖ్యను బట్టి చూస్తే ఇక్కడ కరోనా ప్రభావం బాగా తగ్గిపోయినట్లే కనిపిస్తోంది. అతి త్వరలో కరోనా ఫ్రీ స్టేట్గా తెలంగాణ మారుతుందని అంటున్నారు. కేసుల సంఖ్య చూసి అయితే రాష్ట్ర వాసులు హమ్మయ్యా అనుకుంటున్నారు.
కానీ అదే సమయంలో ఈ నంబర్లు కరెక్టేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఏపీలో కరోనా కేసుల సంఖ్య చాలా పెద్దగా కనిపిస్తుండటానికి అక్కడ పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేస్తుండటమే కారణం అంటున్నారు.
ఏపీ దేశంలోనే అత్యధికంగా టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటి. తెలంగాణ పరిస్థితి దానికి పూర్తి భిన్నం. టెస్టుల నిర్వహణలో బాగా వెనుకబడి ఉంది. టెస్టులు చేయకపోవడం వల్లే ఇక్కడ పెద్దగా కేసులు బయటపడటం లేదని అంటున్నారు. కానీ అవసరం లేకున్నా ఇష్టానుసారం టెస్టులు చేయడంలో అర్థమేముందని ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అంటున్నారు.
కేసీఆర్ కూడా టెస్టుల విషయంలో ఏపీకి, తెలంగాణకు పోలిక పెట్టడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఎక్కువ టెస్టులు చేస్తే ఏమైనా ప్రైజులిస్తారా అన్నారు. లక్షణాలు ఉంటేనే కదా టెస్టులు చేస్తాం అన్నది తెలంగాణ ప్రభుత్వ పెద్దల వాదనగా ఉంది.
కానీ హైదరాబాద్ లాంటి చోట్ల కరోనా నివురు గప్పిన నిప్పులా ఉందని.. ఈ కేసుల సంఖ్యను చూసి మురిసిపోతే.. ఉన్నట్లుండి వైరస్ విజృంభించవచ్చని.. రాబోయే రోజుల్లో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగొచ్చని.. కాబట్టి జాగ్రత్త పడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కొత్త సినిమా రిలీజ్ కావడం అనేది చరిత్రలో చాలా అరుదుగా జరుగుతుంది. ఆ…
రేపు లెనిన్ విడుదల కానుంది. ఉదయం అయిదు గంటల నుంచి షోలు మొదలవుతాయని నిర్మాణ సంస్థ ప్రకటించింది కానీ దాదాపు…
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్న రీతిలో జరుగుతున్న మాటల యుద్ధం తారస్థాయికి…
ఏదో చిన్న ఉద్యోగమో.. పనో చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చే మనకే వంట గదిలోకి వెళ్లేందుకు సమయం ఉండదు. సమయం ఉన్నా..…
ఈ నెలలో రాబోతున్న చిత్రాల్లో ‘చెన్నై లవ్ స్టోరీ’ చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. ‘బేబీ’తో ఎవ్వరూ ఊహించని విజయాన్నందుకున్న సాయి…
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యంత హంగామా నెలకొన్న అరంగేట్రాల్లో అఖిల్ అక్కినేనిది ఒకటి. రెండేళ్ల వయసుండగానే ‘సిసింద్రీ’ సినిమా చేసి మంచి గుర్తింపు సంపాదించాడు అఖిల్.…