Political News

రోడ్డెక్కిన తెలంగాణ ప్ర‌భుత్వం

తెలంగాణ‌లో చిత్ర‌మైన రాజ‌కీయం తెర‌మీదికి వ‌చ్చింది. అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన నాయ‌కులు మంత్రులు రోడ్డెక్కి నిర‌స‌న తెలిపారు. అంతేకాదు.. పాద‌యాత్ర కూడా చేశారు. నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్‌భ‌వ‌న్ వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వ‌హించారు. భారీ బ్యాన‌ర్ల‌తో నాయ‌కులు, మంత్రులు ముందుకు క‌ద‌లిలారు. ఈ పాద‌యాత్ర‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఇత‌ర మంత్రులు కూడా హాజ‌ర‌య్యారు.

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీని వెనుకేసుకు వ‌స్తోంద‌ని.. ఆయ‌న‌పై అమెరికాలో కేసులు న‌మోదైనా.. క‌నీసం విచార‌ణ‌కు కూడా అనుమ‌తించ‌డంలేద‌ని నాయ‌కులు ఆరోపించారు. ‘చ‌లో రాజ్‌భ‌వ‌న్‌’ పేరుతో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు మీడియా సంస్థ‌ల‌తో మాట్లాడుతూ.. అదానీకి దేశ సంప‌ద‌న దోచిపెడుతున్నార‌ని మోడీపై నిప్పులు చెరిగారు. అదేవిధంగా మ‌ణిపూర్‌లో అల్ల‌ర్లు జ‌రుగుతున్నా.. కేంద్రం క‌నీసం క‌న్నెత్తి కూడా చూడ‌డం లేద‌న్నారు.

కానీ, జ‌మిలి ఎన్నిక‌ల కోసం కేంద్రం ఆరాట ప‌డుతోంద‌ని.. రాష్ట్రాల హ‌క్కుల‌ను కాల‌రాసే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా ఎన్నికైన ప్ర‌భుత్వాలు సైతం.. సుప్త‌చేత‌నావ‌స్థ‌కు చేరుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు బుద్ధి తేవాల‌న్న ఉద్దేశంతోనే తాము చ‌లోరాజ్‌భ‌వ‌న్‌ నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో వంద‌ల సంఖ్య‌లో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

This post was last modified on December 18, 2024 2:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

3 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

4 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

4 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

5 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

5 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

5 hours ago