తెలంగాణలో చిత్రమైన రాజకీయం తెరమీదికి వచ్చింది. అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన నాయకులు మంత్రులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. అంతేకాదు.. పాదయాత్ర కూడా చేశారు. నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్భవన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. భారీ బ్యానర్లతో నాయకులు, మంత్రులు ముందుకు కదలిలారు. ఈ పాదయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఇతర మంత్రులు కూడా హాజరయ్యారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీని వెనుకేసుకు వస్తోందని.. ఆయనపై అమెరికాలో కేసులు నమోదైనా.. కనీసం విచారణకు కూడా అనుమతించడంలేదని నాయకులు ఆరోపించారు. ‘చలో రాజ్భవన్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు మీడియా సంస్థలతో మాట్లాడుతూ.. అదానీకి దేశ సంపదన దోచిపెడుతున్నారని మోడీపై నిప్పులు చెరిగారు. అదేవిధంగా మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నా.. కేంద్రం కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదన్నారు.
కానీ, జమిలి ఎన్నికల కోసం కేంద్రం ఆరాట పడుతోందని.. రాష్ట్రాల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని విమర్శలు గుప్పించారు. బీజేపీ వ్యవహరిస్తున్న తీరుతో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు సైతం.. సుప్తచేతనావస్థకు చేరుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కారుకు బుద్ధి తేవాలన్న ఉద్దేశంతోనే తాము చలోరాజ్భవన్ నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…