తెలంగాణలో చిత్రమైన రాజకీయం తెరమీదికి వచ్చింది. అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన నాయకులు మంత్రులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. అంతేకాదు.. పాదయాత్ర కూడా చేశారు. నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్భవన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. భారీ బ్యానర్లతో నాయకులు, మంత్రులు ముందుకు కదలిలారు. ఈ పాదయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఇతర మంత్రులు కూడా హాజరయ్యారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీని వెనుకేసుకు వస్తోందని.. ఆయనపై అమెరికాలో కేసులు నమోదైనా.. కనీసం విచారణకు కూడా అనుమతించడంలేదని నాయకులు ఆరోపించారు. ‘చలో రాజ్భవన్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు మీడియా సంస్థలతో మాట్లాడుతూ.. అదానీకి దేశ సంపదన దోచిపెడుతున్నారని మోడీపై నిప్పులు చెరిగారు. అదేవిధంగా మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నా.. కేంద్రం కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదన్నారు.
కానీ, జమిలి ఎన్నికల కోసం కేంద్రం ఆరాట పడుతోందని.. రాష్ట్రాల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని విమర్శలు గుప్పించారు. బీజేపీ వ్యవహరిస్తున్న తీరుతో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు సైతం.. సుప్తచేతనావస్థకు చేరుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కారుకు బుద్ధి తేవాలన్న ఉద్దేశంతోనే తాము చలోరాజ్భవన్ నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
This post was last modified on December 18, 2024 2:04 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…