Political News

రోడ్డెక్కిన తెలంగాణ ప్ర‌భుత్వం

తెలంగాణ‌లో చిత్ర‌మైన రాజ‌కీయం తెర‌మీదికి వ‌చ్చింది. అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన నాయ‌కులు మంత్రులు రోడ్డెక్కి నిర‌స‌న తెలిపారు. అంతేకాదు.. పాద‌యాత్ర కూడా చేశారు. నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్‌భ‌వ‌న్ వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వ‌హించారు. భారీ బ్యాన‌ర్ల‌తో నాయ‌కులు, మంత్రులు ముందుకు క‌ద‌లిలారు. ఈ పాద‌యాత్ర‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఇత‌ర మంత్రులు కూడా హాజ‌ర‌య్యారు.

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీని వెనుకేసుకు వ‌స్తోంద‌ని.. ఆయ‌న‌పై అమెరికాలో కేసులు న‌మోదైనా.. క‌నీసం విచార‌ణ‌కు కూడా అనుమ‌తించ‌డంలేద‌ని నాయ‌కులు ఆరోపించారు. ‘చ‌లో రాజ్‌భ‌వ‌న్‌’ పేరుతో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు మీడియా సంస్థ‌ల‌తో మాట్లాడుతూ.. అదానీకి దేశ సంప‌ద‌న దోచిపెడుతున్నార‌ని మోడీపై నిప్పులు చెరిగారు. అదేవిధంగా మ‌ణిపూర్‌లో అల్ల‌ర్లు జ‌రుగుతున్నా.. కేంద్రం క‌నీసం క‌న్నెత్తి కూడా చూడ‌డం లేద‌న్నారు.

కానీ, జ‌మిలి ఎన్నిక‌ల కోసం కేంద్రం ఆరాట ప‌డుతోంద‌ని.. రాష్ట్రాల హ‌క్కుల‌ను కాల‌రాసే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా ఎన్నికైన ప్ర‌భుత్వాలు సైతం.. సుప్త‌చేత‌నావ‌స్థ‌కు చేరుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు బుద్ధి తేవాల‌న్న ఉద్దేశంతోనే తాము చ‌లోరాజ్‌భ‌వ‌న్‌ నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో వంద‌ల సంఖ్య‌లో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

This post was last modified on December 18, 2024 2:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

4 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

6 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

6 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

7 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

8 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

9 hours ago