Political News

గిరిజనుల డోలీ మోతలకు బాబు – పవన్ చెక్!

చంద్రయాన్ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసిన దేశంగా భారత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు లేని దేశంగా కూడా విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ కోవలోనే ఆంధ్రప్రదే్శ్ లోని గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల కోసం డోలీలే గిరిజనులకు గతి. అయితే, గిరిజనులకు ఆ దుస్థితి తప్పించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నడుం బిగించారు.ఏపీలో డోలీల మోతకు చెల్లుచీటీ పాడేందుకు పవన్ ప్రయత్నాలు మొదలుబెట్టారు.

పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలోని మారుమూల గిరిజన గ్రామాలకు కూడా పక్కా తారు రోడ్లు నిర్మించేందుకు ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ చర్చలు జరిపారు. అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. తొలి దశలో ఆ జిల్లాల్లో 9 రోడ్ల నిర్మాణం జరపాలని అధికారులకు చంద్రబాబు, పవన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన రహదారులకు గిరిజన గ్రామాల రహదారులను అనుసంధానించేందుకు దాదాపు 50 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ప్రభుత్వం తాజా నిర్ణయంతో గిరిజనులకు డోలీ మోత నుంచి త్వరలోనే విముక్తి లభించనుంది. సరైన రహదారి లేక వాగులు, వంకలు దాటుకుంటూ కాలినడకన డోలీలో రోగులను మోసుకువెళుతున్న క్రమంలో ఎంతోమంది గిరిజనులు సకాలంలో వైద్యం అందక మృతి చెందిన ఘటనలు అనేకం ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 499 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. ఈ నెల 20న పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన గ్రామంలో రోడ్ల పనులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. రాబోయే ఐదేళ్లలో అన్ని గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు, పవన్ ముందుకు వెళుతున్నారు.

This post was last modified on December 17, 2024 5:36 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

22 minutes ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

39 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

1 hour ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago